- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
shivam dube: నితీశ్కు గాయం.. దూబెకు చోటు
యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి నిరాశ. టీమ్ఇండియా తరపున అరంగేట్రం కోసం ఈ విశాఖ ఆల్రౌండర్ ఎదురు చూడక తప్పదు.
దిల్లీ: యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి నిరాశ. టీమ్ఇండియా తరపున అరంగేట్రం కోసం ఈ విశాఖ ఆల్రౌండర్ ఎదురు చూడక తప్పదు. జింబాబ్వేతో సిరీస్ కోసం భారత టీ20 జట్టుకు తొలిసారి ఎంపికైన నితీశ్ తాజాగా గాయం బారిన పడ్డాడు. దీంతో అతను ఈ 5 టీ20ల సిరీస్కు దూరమయ్యాడు. హెర్నియా గాయమే అందుకు కారణంగా తెలుస్తోంది. అతని స్థానంలో ప్రపంచకప్లో ఆడుతున్న శివమ్ దూబెను జట్టులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ తరపున 21 ఏళ్ల నితీశ్ 303 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బౌలింగ్లోనూ మూడు వికెట్లు తీశాడు. బీసీసీఐ యువ ఆటగాళ్ల టార్గెట్ గ్రూప్లో ఉన్న నితీశ్ గత ఏడాది కాలంగా జాతీయ క్రికెట్ అకాడమీ పర్యవేక్షణలో ఉన్నాడు. ‘‘జింబాబ్వే పర్యటన కోసం గాయపడ్డ నితీశ్ స్థానంలో శివమ్ దూబెను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది’’ అని బీసీసీఐ బుధవారం ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 6న తొలి టీ20 జరుగుతుంది.
భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, శాంసన్, ధ్రువ్ జూరెల్, శివమ్ దూబె, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.