- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IND vs SA: భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
టీ20 ప్రపంచ కప్ సంగ్రామం తుది పోరుకు వేళైంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టైటిల్ వేట జరగనుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో (T20 World Cup 2024) దక్షిణాఫ్రికా స్పిన్నర్ తంబ్రిజ్ షంసీ అత్యంత ప్రభావం చూపిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లోనే 11 వికెట్లు తీశాడు. స్పిన్కు సహకరించే విండీస్ పిచ్లపై అతడిని ఎదుర్కోవడం కఠినమైన సవాల్ అని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, భారత్తో ఫైనల్లో (IND vs SA Final) అతడే ఎక్కువ పరుగులు ఇస్తాడని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించడం గమనార్హం.
‘‘షంసీ తుది జట్టులో ఉంటే నేను చాలా సంతోషిస్తా. బార్బడోస్ వేదికగా జరగనున్న మ్యాచ్లో (IND vs SA) బార్ట్మన్ కూడా ఉండాలి. వీరిద్దరిలో ఒకరికే అవకాశం అంటే మాత్రం షంసీ వైపు మొగ్గు చూపిస్తా. ఎందుకంటే అతడి బౌలింగ్లోనే భారత బ్యాటర్లు టార్గెట్ చేసి ఎక్కువ పరుగులు రాబట్టేందుకు వీలుంది. అతడు వికెట్లు తీసినా.. కనీసం 45+ పరుగులు సాధించే అవకాశం ఉంది. ఇప్పుడున్న భారత బ్యాటింగ్ లైనప్ను చూసి ఈ మాట చెబుతున్నా. మనకు అతడు ఉండటం బిగ్ డీల్ అవుతుంది’’ అని ఉతప్ప (Robin uthappa) తెలిపాడు.
షంసీ బౌలింగ్లో ఇలా..: అశ్విన్
‘‘షంసీ బౌలింగ్లో ఎక్కువగా స్వీప్ షాట్లు ఆడాలి. ఈ విషయంలో భారత బ్యాటర్లు పరిస్థితి బెటర్గానే ఉంది. అదిల్ రషీద్, లివింగ్స్టోన్ బౌలింగ్లో ఇలానే ఆడి పరుగులు రాబట్టారు. ఈసారి కూడా అలాంటి మ్యాచ్ ప్రదర్శనే చేయాలి. అయితే, తుది జట్టులో షంసీని ఉంచుతారా? బార్ట్మన్ను తీసుకుంటారా? అనేది చూడాలి’’ అని అశ్విన్ (Ashwin) వెల్లడించాడు.
బుమ్రా, కుల్దీప్ను కాచుకుంటేనే: మోర్కెల్
తొలిసారి ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికా కప్ను అందుకోవాలంటే.. టీమ్ఇండియా (Team India) జట్టులోని ఇద్దరు బౌలర్లతో జాగ్రత్తగా ఉండాలని మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ సూచించాడు. ‘‘జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను జాగ్రత్తగా ఆడాలి. ఒత్తిడిని దరిచేరనీయకూడదు. ఒక్కో బంతిపై దృష్టిపెడుతూ ఇన్నింగ్స్ సాగాలి. డెత్ ఓవర్లలో బుమ్రా (Jasprit Bumrah) మరింత ప్రమాదకరంగా మారతాడు. కాబట్టి మంచి స్కోరును చేసి లక్ష్యంగా నిర్దేశించేందుకు టీమ్ఇండియా ప్రయత్నిస్తుంది. బుమ్రా, కుల్దీప్ గురించి ఎక్కువ ఆందోళన చెందక్కర్లేదు. వారిని గౌరవిస్తూనే.. మిగతా బౌలింగ్ ఎటాక్ను లక్ష్యం చేసుకోవాలి’’ అని మోర్కెల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే మ్యాచ్లో 10 వికెట్లు.. అదరగొట్టిన స్నేహ్ రాణా
టీమ్ఇండియా స్టార్ బౌలర్ స్నేహ్ రాణా తన బౌలింగ్తో మరోసారి అద్భుతం చేసింది. దక్షిణాఫ్రికాతో అడుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా ఒకే మ్యాచ్లో 10 వికెట్లు తీసి సత్తా చాటింది.
-
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
మన అమ్మాయిలూ గెలిచేశారు!
దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది -
ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Dravid: టీమ్ఇండియా కోచ్ పదవి నుంచి దిగిపోయిన రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక నిరుద్యోగినన్నాడు. -
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
ఈ సీజన్ అనంతరం ఐపీఎల్కు వీడ్కోలు పలికిన దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సరికొత్త అవతారంలో ఆర్సీబీకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. -
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
బెరిల్ హరికేన్ ఎఫెక్ట్ టీమ్ఇండియాపై పడింది. ఈ హరికేన్ కారణంగా భారత జట్టు స్వదేశానికి ఆలస్యంగా రానుంది. -
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
జులై నెలాఖరులో టీమ్ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు కొత్త హెడ్ కోచ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
ఈ టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. -
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంపై అతడి సతీమణి ఎమోషనల్ అయ్యారు. అటు భార్య అనుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. -
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
T20 World Cup: తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్నకు సంబంధించిన వార్తను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత్ను కొనియాడుతూనే.. కీలక మ్యాచ్లో తడబడే అలవాటును దక్షిణాఫ్రికా కొనసాగించిందంటూ రాసుకొచ్చాయి. -
ఎందుకింత ఉద్వేగం!
దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్ మాత్రం దక్కడం లేదు. సెమీస్లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం. -
రూ.125 కోట్లు.. ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. -
ఈ కప్ అందరిదీ
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది. -
ఈ ప్రపంచకప్ వేరయా..
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. -
జకోవిచ్ సాధిస్తాడా?
సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) అదరగొట్టారు. జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్ రజత పతకంతో మెరిశాడు. -
స్నేహ్కు 8 వికెట్లు
భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
జడేజా కూడా టాటా
భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్ బాటలో మరో సీనియర్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు టాటా చెప్పాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. -
సంక్షిప్తవార్తలు(6)
తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు డిస్నీ+హాట్స్టార్లో భారీస్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు సీరియస్
-
ఈనాడు.నెట్ టాప్ 10 వార్తలు @ 9 PM
-
లెదర్ ఫినిష్తో రియల్మీ నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్
-
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ వేసుకున్నా..వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
-
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
-
పింఛన్ల పంపిణీలో రికార్డు.. ఏపీలో ఒక్క రోజే 95% పూర్తి