- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rohit Sharma: రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంపై అతడి సతీమణి ఎమోషనల్ అయ్యారు. అటు భార్య అనుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ నిరీక్షణ ఫలించి టీమ్ఇండియా (Team India) విశ్వవిజేతగా అవతరించడంతో యావత్ భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి. మన జట్టు టీ20 ప్రపంచకప్ (T20 World cup 2024) అందుకున్న ఉద్విగ్న క్షణాల్లో మైదానంలో ఆటగాళ్లతో పాటు కోట్లాది కళ్లు చెమర్చాయి. ఈ విజయంతోనే దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడం మరింత భావోద్వేగానికి గురిచేసింది. ఈసందర్భంగా వారి సతీమణులు తమ రియల్ లైఫ్ హీరోలకు ప్రత్యేకంగా విష్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సులువుగా తీసుకోలేకపోతున్నా: రితిక
ప్రపంచకప్ను అపురూపంగా చూసుకుంటున్న రోహిత్ శర్మ (Rohit Sharma) ఫొటోను షేర్ చేసిన అతడి సతీమణి రితికా సజ్దే భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. ‘‘రో.. ఈ విజయం నీకు ఎంత విలువైందో నాకు తెలుసు. ఈ ఫార్మాట్, ఈ కప్పు, ఈ ఆటగాళ్లు.. ఈ ప్రయాణం.. ఇదంతా నువ్వు కన్న కల. గత కొన్ని నెలలు నువ్వు చాలా కఠిన సమయాన్ని గడిపావు. అది నీ మనసు, శరీరంపై ఎంత ప్రభావం చూపిందో నాకు తెలుసు. కానీ వాటన్నింటినీ అధిగమించి నువ్వు నీ కలను నెరవేర్చుకోవడం చాలా స్ఫూర్తి కలిగిస్తోంది. ఓ భార్యగా ఇందుకు నేను చాలా గర్వపడుతున్నా. కానీ, నీ ఆటను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఇప్పుడు టీ20లకు వీడ్కోలు పలకడం బాధగా ఉంది. ఇది నీకు కఠిన నిర్ణయమైనా జట్టుకు ఏది ఉత్తమమైందో దానిగురించే నువ్వు సుదీర్ఘంగా ఆలోచిస్తావు. కానీ దీన్ని నేను సులువుగా తీసుకోలేకపోతున్నా. ఇంతటి గొప్ప వ్యక్తి నా సొంతం అయినందుకు నేను చాలా గర్విస్తున్నా. ఐ లవ్ వ్యూ సో మచ్’’ అని రితిక (Ritika Sajdeh) రాసుకొచ్చారు.
అనుష్క ఈ విజయం నీదే: కోహ్లీ
టీమ్ఇండియా విజయం తర్వాత కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) ఇన్స్టాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘ఈ వ్యక్తిని నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు నా సొంతమైనందుకు ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక ఓ గ్లాస్ చల్లని నీళ్లతో ఈ విజయాన్ని ఆస్వాదించు’’ అని ఆమె రాసుకొచ్చారు. దీనికి కోహ్లీ బదులిస్తూ సతీమణిపై తన ప్రేమను చాటుకున్నాడు. ‘‘నువ్వు లేకుండా ఇదేదీ సాధ్యమయ్యేది కాదు. నువ్వు నన్నెప్పుడూ అభినందిస్తావు.. నిస్సంకోచంగా ఉండేలా చూస్తావు. నాకు సంబంధించి ప్రతీది నిజాయతీగా తెలియజేస్తావు. నీకు నేనెప్పటికీ రుణపడి ఉంటా. ఈ విజయం నాది ఎంతో.. నీదీ అంతే..! థ్యాంక్యూ అనుష్క’’ అని విరాట్ (Virat Kohli) ఎమోషనల్ అయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
టీ20 ప్రపంచకప్ ట్రోఫీ పట్టుకుని రోహిత్ శర్మతో కలిసి ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) వెల్లడించాడు. -
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
కోచ్గా ఇన్నింగ్స్ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. -
అమ్మాయిలూ చుట్టేశారు
భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి.. అనంతరం స్వల్ప ఛేదనను కొట్టేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమ్ఇండియాదే పైచేయి. -
అల్కరాస్ శుభారంభం
మూడో సీడ్ అల్కరాస్ వింబుల్డన్లో శుభారంభం చేశాడు. అయిదోసీడ్ మెద్వెదెవ్, ఎనిమిదో సీడ్ రూడ్ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తొమ్మిదో సీడ్ సకారి ముందంజ వేసింది. -
గుకేశ్ పోరు సింగపూర్లో
సొంతగడ్డపై డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్ ఆశలు ఫలించలేదు. -
కోహ్లి లేకుండా ఐసీసీ ప్రపంచకప్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సత్తా చాటినప్పటికీ అంతకుముందు విఫలమవడంతో కోహ్లీని 12 మంది సభ్యుల జట్టుకు ఐసీసీ ఎంపిక చేయలేదు. -
ఆర్సీబీతోనే కార్తీక్.. కానీ కొత్తగా
వచ్చే ఏడాది ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్టుతో కలిసి దినేశ్ కార్తీక్ కనిపించనున్నాడు. అదేంటీ.. ఈ సీజన్ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు కదా. -
నా కెరీర్ ముగించాలనే కుట్ర
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లోని లోపాలు ఎత్తి చూపినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని, రెజ్లింగ్లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారని భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ఆరోపించాడు. -
క్వార్టర్స్లో ఇంగ్లాండ్, స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్తో ఇంగ్లాండ్ త్రుటిలో పరాజయం తప్పించుకుంది. -
శ్రీలంకతో సిరీస్లో కొత్త కోచ్ బాధ్యతలు
శ్రీలంకతో సిరీస్లో భారత జట్టు కొత్త చీఫ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ నెలలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తాడని చెప్పాడు. -
పారిస్ డైమైండ్ లీగ్ నుంచి నీరజ్ ఔట్
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్కు దూరమయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బందిపడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. -
కోర్టులోనే కుప్పకూలి..
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్ జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
‘లక్ష్య’ అథ్లెట్లకు గోపీచంద్ అభినందనలు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లను బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ గోపీచంద్ అభినందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
-
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
-
విమానంలో కుదుపులు.. ఓవర్హెడ్ బిన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
-
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
-
ఎఫ్డీ కంటే అధిక వడ్డీ.. ఆర్బీఐ గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్ గురించి తెలుసా?
-
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 15 మంది విద్యార్థులకు గాయాలు