- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rohit Sharma: మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
ఇంటర్నెట్డెస్క్: రోహిత్కు బ్యాటింగ్లో అందరికంటే కొంచెం ఎక్స్ట్రా టైం ఉంటుందంటారు.. అందుకే షాట్లు కచ్చితంగా ఉండి బంతి బౌండరీ దాటేస్తుంది. అలానే కెప్టెన్సీలో కూడా అతడికి కొంచెం దూరదృష్టి ఎక్కువ. అందరికీ అస్పష్టత ఉన్న అంశాల్లో కూడా అతడు కచ్చితమైన అభిప్రాయానికి రాగలడు. అందుకే కేవలం 12 నెలల్లోనే 3 ఐసీసీ ప్రపంచ ట్రోఫీల (టెస్టు, వన్డే, టీ20) ఫైనల్స్కు జట్టును తీసుకెళ్లగలిగాడు. ఇది సాధారణమైన విషయం ఏమాత్రం కాదు. ఇక టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి అంచుల్లోకి వెళ్లిన భారత్ను తన వ్యూహ చతురతతో గెలిపించాడు. ఈ టీమ్ ఎంపిక నుంచి మైదానంలో ప్లాన్ల వరకు చాల భిన్నంగా అతడు వర్క్ చేశాడు. ఈ పొట్టి ప్రపంచకప్ సాధించడంలో అతడి ముద్ర స్పష్టంగా కనిపించింది.
జట్టు ఎంపికలో లోతైన వ్యూహం..
టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్లో కదా.. బౌలింగ్ పిచ్లు ఉంటాయని చాలా మంది విశ్లేషకులు భావించారు. కానీ, రోహిత్ పట్టుబట్టి నలుగురు స్పిన్నర్లను(కుల్దీప్, చాహల్, అక్షర్, జడేజా) ఎంపిక చేశాడు. అదేంటీ అని అప్పట్లో చాలా మంది పెదవి విరిచారు. నాడు దీనిపై రోహిత్ స్పందిస్తూ మ్యాచ్లు మొదలయ్యాక ఇది అర్థమవుతుందని చెప్పి ఊరుకొన్నాడు. అక్షర్ పటేల్ అవసరమా అని ప్రశ్నించిన వారూ ఉన్నారు. నాడు హిట్మ్యాన్ లాజిక్ చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు టోర్నీ ముగిసే సరికి ఐదు మ్యాచ్ల్లో కుల్దీప్ 10 వికెట్లు తీయగా అక్షర్ కూడా 8 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. సెమీస్లో ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సొంతం చేసుకున్నాడు. అటు బ్యాటింగ్లో కీలకమైన పరుగులు చేశాడు.
ఎదురు దాడికి నేతృత్వం..
పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రత్యర్థి బౌలింగ్ దళంపై మొదటి నుంచి ఎదురుదాడి చేసి కకావికలం చేయడం చాలా కీలకం. ఇలాంటి వ్యూహంతో 1996లో జయసూర్యను వాడి శ్రీలంక వన్డే ప్రపంచకప్ కొట్టింది. అలానే 2003లో ఆసీస్.. గిల్క్రిస్ట్, రికీపాంటింగ్లను రంగంలోకి దింపి విశ్వవిజేత అయింది. వారందరినీ మించిన హార్డ్ హిట్టర్ రోహిత్. అతడే ఇప్పుడు నాయకత్వం వహిస్తుండటంతో ఎదురుదాడి బాధ్యతలు కూడా స్వీకరించాడు. 2023 వన్డే ప్రపంచకప్లో ఏకంగా 594 పరుగులు చేశాడు. టోర్నీలో రెండో అత్యధిక రన్స్ అవే. ఆ సీజన్లో అలా కలిసొచ్చి బాదాడు అనుకోవడానికి అవకాశం లేకుండా.. 2024 టీ20 ప్రపంచకప్లో 257 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్గా కింగ్ కోహ్లీతో కలిసి బరిలోకి దిగాడు. ఫైనల్స్ వరకు కింగ్ ఫామ్ను అందుకో లేకపోయినా.. ఆ ప్రభావం జట్టుపై పడకుండా ప్రత్యర్థి బౌలర్లను కకావికలం చేశాడు. సూపర్-8 దశలో హిట్మ్యాన్ ధాటికి ఆసీస్ బౌలర్లు బంతి వేయడానికి భయపడ్డారనడం అతిశయోక్తి కాదు. ప్రతి మ్యాచ్లో అతడు జట్టుకు బ్యాటింగ్ టోన్ సిద్ధం చేసి ఇచ్చాడు.
అపజయాల నుంచి నేర్చుకొని.. నవంబర్ లెక్కలు సరిచేసి..
గతంలో నవంబర్ నెలలో భారత్ ఎదుర్కొన్న రెండు భారీ పరాజయాలకు రోహిత్ ఈ సారి రివెంజ్ తీర్చుకొన్నాడు. 2022 పొట్టి ప్రపంచకప్ సెమీస్ నవంబర్ 10న జరిగింది. ఈ మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ 10 వికెట్ల విజయం సాధించింది. ఇదే అతడి కెప్టెన్సీలో టర్నింగ్ పాయింట్గా నిలిచిందని సహచరుడు దినేశ్ కార్తిక్ వెల్లడించాడు. నాటి నుంచి తానే బ్యాటింగ్లో టాప్గేర్ వేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలిపాడు. ఆ నియంత్రణతో కూడిన దూకుడును ఇప్పటికీ కొనసాగించాడు. ఫలితంగా సెమీస్లో ఇంగ్లిష్ బౌలర్లను చితక్కొట్టాడు. ఆ మ్యాచ్ అనంతరం అతడు భావోద్వేగానికి గురికావడానికి అదే కారణం కావొచ్చు.
2023 నవంబర్ 19న జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్పై ఆసీస్ విజయం సాధించింది. దీనికి తోడు ఈ పొట్టికప్ సూపర్-8 కీలక మ్యాచ్కు ముందు ఆ జట్టు సారథి మిచెల్ మార్ష్ మాట్లాడుతూ ‘ఓడించడానికి భారత్కు మించిన జట్టు లేదు’ అని మానసిక యుద్ధానికి తెరతీశాడు. దీనిని హిట్మ్యాన్ వ్యక్తిగతంగా తీసుకొన్నట్లున్నాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్స్కు ప్రతీకారం తీర్చుకొన్నాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ‘ఇక టోర్నీ నుంచి ఆసీస్ బయటకెళ్లిపోయింది’ అని వ్యాఖ్యానించి కంగారూలకు చురకలేశాడు. టీమ్ఇండియాపై ప్రత్యర్థి జట్లకు మానసిక ఆధిపత్యం రానీయకుండా చూడటం.. ఉన్నదానిని పటాపంచలు చేయడం అతడి శైలిలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆటగాళ్లను వెనుకేసుకొచ్చి..
ఆటలో క్లాస్ శాశ్వతం.. ఫామ్ తాత్కాలికమని రోహిత్ నమ్మాడు. అందుకే జట్టులో ప్రతిభావంతులు ఇబ్బంది పడుతున్న సమయంలో, వారిపై వచ్చే విమర్శలకు తాను అడ్డం పడుతుంటాడు. కోహ్లీ, దూబే, జడేజా విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్లో కూడా రాహుల్, శ్రేయస్ను ఇలానే కాపాడుకొచ్చాడు. పొట్టికప్ ఫైనల్స్ కోసమే కోహ్లీ ‘ది బెస్ట్’ను దాచి పెట్టాడని వాఖ్యానించి తన సహచరుడిలో ఆత్మవిశ్వాసం నింపాడు. కింగ్ కూడా దానిని నిలబెట్టుకొని 76 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను దక్కించుకొన్నాడు. దూబే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఓ పక్క 2024 పొట్టి ప్రపంచకప్ కీలక దశలో అర్ష్దీప్ చెలరేగిపోయి వికెట్లు తీస్తున్న వేళ పాక్ మాజీ ఇంజిమామ్ అతడిపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశాడు. కుర్రాడైన అర్ష్దీప్ మానసిక స్థైర్యాన్ని ఇవి దెబ్బతీస్తాయని గ్రహించాడు. తానే మీడియా ముందుకొచ్చి ఇంజిమామ్కు ‘బుర్ర ఉపయోగించి ఆలోచించు’ అని ఘాటుగా చెప్పాడు. తర్వాత మ్యాచ్ల్లో అర్ష్దీప్ను కొనసాగించాడు. ఫైనల్స్లో ఆదిలో వికెట్ సాధించినా.. కీలకమైన 19వ ఓవర్లో జట్లు ఆశలను నిలబెట్టాడు.
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో దారుణంగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాను అతడు తన డిప్యూటీగా తుది జట్టులోకి తీసుకొన్నాడు. మొదటి మ్యాచ్ నుంచి అవకాశాలు ఇచ్చాడు. పాండ్యా కూడా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐర్లాండ్, పాక్, అమెరికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్పై మ్యాచ్ల్లో తన వంతు కీలక పాత్ర పోషించాడు. ఇక దక్షిణాఫ్రికాపై తుదిపోరులో చెలరేగిపోయి.. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టాడు. ఓ రకంగా చెప్పాలంటే ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్ను బయటకు లాక్కొచ్చాడు. అంతేడుకాదు.. ఫైనల్ ఓవర్ బాధ్యతలు తీసుకొని విజయతీరాలకు చేర్చాడు.
బౌలర్ల వినియోగం..
పిచ్, మైదానం కండీషన్లను అర్థం చేసుకొని బౌలింగ్ దళాన్ని మోహరించడంలో రోహిత్ది ప్రత్యేకమైన శైలి. అమెరికాలో అస్థిరమైన పిచ్లపై ఆడే సమయంలో సిరాజ్కు కూడా అవకాశం కల్పించాడు. దానికి తగిన ఫలితం లభించింది. ఎప్పుడైతే టోర్నీ వెస్టిండీస్కు చేరిందో.. రాణిస్తున్న అర్ష్దీప్ను జట్టులో కొనసాగించి ధారాళంగా పరుగులిచ్చే సిరాజ్ను పక్కనపెట్టాడు. ఆ స్థానంలో కుల్దీప్కు అవకాశం కల్పించాడు. దీంతో జట్టులో ముగ్గురు స్పిన్నర్లయ్యారు. ఈ నిర్ణయం ఫలితం చూపింది. ఇంగ్లాండ్తో మ్యాచ్లో పవర్ ప్లేలోనే అక్షర్ చేతికి బంతి అందించి ఫలితం సాధించాడు. అంతకు ముందు ఆసీస్ మ్యాచ్లో కూడా కుల్దీప్ను వాడి మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్ను నిలదొక్కుకోనీయలేదు. ఇక తురుపు ముక్క అయిన బుమ్రాను కూడా అవసరమైన చోట రంగంలోకి దింపుతున్నాడు. ఫైనల్స్లో ఇది స్పష్టంగా కనిపించింది.
గంటల కొద్దీ డేటాతో కుస్తీ..
డేటాను పూర్తి స్థాయిలో కెప్టెన్గా రోహిత్ నమ్ముతాడు. అతడు గంటల కొద్దీ వీడియోక్లిప్లు, విశ్లేషణలను పరిశీలిస్తాడు. ఈ మొత్తం ఆటగాళ్ల మెదళ్లలో నింపేయడు. తన వద్దే ఉంచుకొని అవసరమైన ఆటగాడికి చెప్పాల్సినంతే చెబుతాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ‘‘నేను డేటా అనాలసిస్ను నమ్ముతాను. కొత్త ట్రెండ్లను అర్థం చేసుకుంటాను. మ్యాచ్ల్లో ఎదురయ్యే వివిధ పరిస్థితులను ఎదుర్కోవడానికి మీటింగ్ రూమ్ల్లో గంటల తరబడి గడుపుతాను’’ అని వెల్లడించాడు. అందుకే అతడు మైదానంలో కూల్గా ఉండగలుగుతున్నాడు. దీనికి తోడు మ్యాచ్పై స్పష్టమైన అవగాహన ముందే ఉండటంతో తన వ్యక్తిగత బ్యాటింగ్పై కెప్టెన్సీ ఒత్తిడి కనిపించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్
టీ20ల నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు పలికేశాడు. పొట్టి కప్ విజేతగా నిలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ స్పందించాడు. -
టీమ్ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియాకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరికి టీమ్ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు తెలిపింది.
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
ఐపీఎల్ సందర్భంగా ఎదురైనా అవమానాలను తట్టుకొని.. వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్య తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. -
గెలుపు సంబురంలో కోహ్లీ.. ఫ్యామిలీకి వీడియో కాల్!
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన ఆనందాన్ని కుటుంబంతో పంచుకున్నాడు.
-
టీమ్ఇండియా గెలుపు సంబరాలు.. అల్లరి పిల్లాడిలా మారిన రాహుల్ ద్రవిడ్!
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం జట్టు సభ్యులతో కలసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.
-
కోహ్లీ డ్యాన్స్.. టీమ్ఇండియా ఆటగాళ్ల జోష్
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం టీమ్ సభ్యుతో కలసి విరాట్ కోహ్లీ చిందేశాడు.
-
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్, విరాట్ విజయ దరహాసం
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ట్రోఫీతో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.
-
రోహిత్ భుజాలపై కుమార్తె.. గుండె నిండా ఆనందం!
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆకర్షించింది.
-
టీమ్ఇండియా దేశ ప్రజలందరినీ గర్వించేలా చేసింది: ఆమిర్ ఖాన్ ప్రశంసలు
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియాకు ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
-
కుటుంబంతో కలిసి బుమ్రా గెలుపు సంబరాలు
టీమ్ఇండియా ఆపద్బాంధవుడు జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటాడు. తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి, ఓ వికెట్ తీసి బుమ్రా గెలుపు వైపు మళ్లించాడు. ట్రోఫీని కైవసం చేసుకున్న అనంతరం బుమ్రా తన కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు.
-
విశ్వవిజేత.. భారత్కు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
టీ20ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమ్ఇండియా విజేతగా నిలిచింది. మన జట్టుకు భారీ మొత్తంలోనే ప్రైజ్మనీ దక్కింది. -
టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో హార్దిక్ స్టైల్ సెలబ్రేషన్స్.. వీడియో!
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ (T20 World Cup)ను ఒడిసి పట్టింది. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్న స్థితిలో.. భారత్ విజయంలో హార్దిక్ కీలకంగా మారాడు. ఈ సంతోషంలో ట్రోఫీని చేతిలో పట్టుకొని హార్దిక్ సరదాగా డ్యాన్స్ చేశాడు.
-
నా హార్ట్రేట్ పెరిగిపోయింది.. బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్: ఎంఎస్ ధోనీ
భారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. టీమ్ఇండియాకు వరల్డ్ కప్ను అందించిన మూడో సారథిగా రోహిత్ చరిత్రలో నిలిచిపోయాడు. -
ఆపద్బాంధవుడు బుమ్రా
జట్టు కష్టాల్లో పడిందా.. ఓటమి కోరల్లో చిక్కుకుందా? అయితే అతనికి బంతి అందించాల్సిందే. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగుతున్నారా? మ్యాచ్ చేజారే పరిస్థితి వచ్చిందా? అయితే అతను బౌలింగ్కు రావాల్సిందే. -
ఉత్కంఠగా టీ20 ప్రపంచకప్ ఫైనల్.. మ్యాచ్ హైలైట్స్ ఇవే!
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ (T20 World Cup)ను అందుకుంది. ఫైనల్ మ్యాచ్ హైలైట్స్ మీకోసం.
-
నిజమే.. ఫైనల్ కోసం దాచుకున్నాడు
ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో విరాట్ కోహ్లిది తిరుగులేని రికార్డు. మిగతా జట్టంతా విఫలమైనా అతను నిలుస్తాడని పేరు. నిరుడు వన్డే ప్రపంచకప్లో కూడా అతను అద్బుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ నుంచి గొప్ప ఫామ్తో టీ20 ప్రపంచకప్లో అడుగు పెట్టడంతో ఈ టోర్నీలో అదరగొడతాడని అనుకున్నారు అభిమానులు. -
విరుచుకుపడుతున్న క్లాసెన్ను పెవిలియన్కు పంపిన హార్దిక్!
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ (T20 World Cup)ను అందుకుంది. 17వ ఓవర్లో క్లాసెన్ను పెవిలియన్కు పంపి హార్దిక్ భారత్ ఆశలకు జీవం పోశాడు. మ్యాచ్ను మలుపు తిప్పిన ఆ వికెట్ మీరూ చూడండి.
-
దక్షిణాఫ్రికా మారలేదు..
వన్డేల్లో అయినా, టెస్టుల్లో అయినా ప్రపంచకప్లో ఫైనల్ చేరిన చరిత్రే లేదు దక్షిణాఫ్రికాకు. నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడికి గురి కావడం వల్లో, దురదృష్టం వెంటాడడం వల్లో ఆ జట్టు నిష్క్రమించడం మామూలే. -
చరిత్రలో నిలిచిపోయే క్యాచ్
2007 టీ20 ప్రపంచకప్లో శ్రీశాంత్ క్యాచ్.. 2011 వన్డే ప్రపంచకప్లో ధోని సిక్సర్.. భారత క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సందర్భాలివి. ఈ ప్రపంచకప్లోనూ అలాంటి చిరస్మరణీయమైన క్యాచ్ను సూర్యకుమార్ అందుకున్నాడు. -
ఇది ద్రవిడ్ చక్దే ఇండియా..
తేలికైన గ్రూపులోనే ఉన్నా.. కనీసం గ్రూప్ దశైనా దాటకుండానే ఓ జట్టు వన్డే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. సారథి గుండె పగిలింది. ఆ తర్వాత ఎంతకాలమో కెప్టెన్గా ఉండలేకపోయాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్
-
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
-
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?
-
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
-
ఎవరిని అడగాలి? తిరిగిరాని ధరణి స్లాట్ రద్దు సొమ్ములు