- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rohit sharma: ఆటగాళ్లను అర్థం చేసుకోవడం కీలకం
జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు చెప్పేది వినడం.. వారిని అర్థం చేసుకోవడం చాలా కీలకమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్శర్మ అన్నాడు.
దిల్లీ: జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు చెప్పేది వినడం.. వారిని అర్థం చేసుకోవడం చాలా కీలకమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్శర్మ అన్నాడు. వన్డే ప్రపంచకప్లో రోహిత్ సారథ్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. నాయకుడి పాత్రను సమర్థంగా పోషిస్తూ జట్టులోని ప్రతి ఒక్కరి నుంచి మంచి ఫలితాలు రాబడుతున్నాడు. ‘‘ఆటగాళ్ల నిర్వహణ విషయంలో వ్యక్తిగతంగా ఒకొక్కరిని అర్థం చేసుకోవడం.. వారి అవసరాలు తెలుసుకోవడం అత్యంత కీలకం. వారి ఇష్టాయిష్టాలు కనుక్కోవాలి. టీమ్ గేమ్ అంటే ఒక్కరు, ఇద్దరు లేదా కొందరు కాదు.. జట్టులోని ప్రతి ఒక్కరూ భాగమే. ఛాంపియన్షిప్, పెద్ద టోర్నీలు గెలవాలంటే ప్రతి ఒక్కరు తమ పాత్ర పోషించాలి. అందుకోసం అందరినీ మానసికంగా అత్యుత్తమ స్థితిలో ఉంచాలి. ప్రతి ఒక్కరి మాట వినాలి.వారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. నేనెప్పుడూ అదే పనిచేస్తా’’ అని రోహిత్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాకు రూ. 125 కోట్ల నజరానా.. ఎవరికి ఎంతంటే?
టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ సాధించడంతో బీసీసీఐ (BCCI) రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంలో స్పష్టత వచ్చింది. -
రెండో మ్యాచ్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో అభిషేక్ తన సొంత బ్యాట్ వాడలేదు. -
బాలీవుడ్ నటితో పెళ్లి.. స్పందించిన కుల్దీప్ యాదవ్
Kuldeep Yadav: తన పెళ్లి విషయంలో త్వరలో అందరికీ శుభవార్త చెప్పనున్నట్లు టీమ్ఇండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్ తెలిపాడు. కాన్పూర్లో ఆయనకు ఘన స్వాగతం లభించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. -
102కు కూలిన జట్టే 100 తేడాతో..
ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. యువ భారత్ బలంగా పుంజుకుంది. జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన శుభ్మన్ బృందం.. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. -
ఛాంపియన్ల వేదిక
చెరుకూరి రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అండర్-8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రేరణగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ బ్రాండ్ అంబాసిడర్ పుల్లెల గోపీచంద్ అన్నారు. -
బ్రెజిల్ ఔట్.. సెమీఫైనల్లో ఉరుగ్వే
కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో బ్రెజిల్కు షాక్ తగిలింది. క్వార్టర్ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓటమితో ఆ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. నిర్ణీత సమయంలో 0-0తో స్కోరు సమమైన ఈ మ్యాచ్లో ఉరుగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-2తో గెలిచి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
క్వార్టర్స్లో అల్కరాస్
టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. జోరు కొనసాగిస్తూ ఈ మూడో సీడ్ ఆటగాడు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అల్కరాస్ 6-3, 6-4, 1-6, 7-5తో హాంబర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. -
రెండో టీ20 వరుణుడిది
భారత మహిళల జట్టుకు నిరాశ. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓడిన హర్మన్ప్రీత్ బృందం.. రెండో టీ20లో గెలిచి లెక్క సమం చేయాలని అనుకున్నా వరుణుడు అడ్డుపడ్డాడు. -
సెమీస్లో నెదర్లాండ్స్
నెదర్లాండ్స్ జట్టు యూరో 2024 సెమీఫైనల్కు దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో వెనుకబడ్డా పుంజుకున్న ఆ జట్టు.. 2-1తో తుర్కియేపై విజయం సాధించింది. పోరును నెదర్లాండ్స్ మెరుగ్గానే ఆరంభించింది. -
సంక్షిప్త వార్తలు (3)
కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. భారత వర్ధమాన ఆటగాడు ప్రియాన్షు రజావత్కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రజావత్ 17-21, 10-21తో అలెక్స్ లేనియెర్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు.