- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Virat-Rohit: రోహిత్-విరాట్ నిర్ణయంతో షాక్ అయ్యా.. వారిని భర్తీ చేయడం సవాలే: స్టార్ పేసర్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్బై చెప్పేశారు. అయితే, ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతోపాటు వారి సహచరులను కూడా షాక్కు గురి చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ను (T20 World Cup 2024) రెండోసారి కైవసం చేసుకొని 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత్ తెరదించింది. కప్ గెలిచామన్న సంతోషంలో ఉన్న అభిమానులకు షాక్ ఇచ్చేలా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికేశారు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 76 పరుగులు చేసిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఒక్కసారిగా ఇద్దరు టాప్ ప్లేయర్లు వీడ్కోలు పలకడంతో వారి స్థానాలు ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. కోహ్లీ, రోహిత్ లేని లోటును పూరించడం చాలా కష్టమని వెటరన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ (Shami) వ్యాఖ్యానించాడు. వారిద్దరూ తీసుకున్న నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపాడు.
‘‘టీ20ల నుంచి రోహిత్ (Rohit Sharma), విరాట్ వీడ్కోలు చెబుతారని అస్సలు అనుకోలేదు. భారత క్రికెట్ను పటిష్ఠమైన స్థితిలో ఉంచారు. గత 16 ఏళ్లుగా అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను అలరించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనే అత్యున్నత శిఖరాలకు చేరారు. ఇద్దరూ ఒక్కసారిగా గుడ్బై చెప్పడం మాత్రం షాక్కు గురి చేసింది. క్రీడల్లో ఇలా జరగడం సహజమే. ఒకరు వెళ్తుంటే.. మరొకరు వస్తుంటారు. కానీ, వీరిద్దరి స్థానాలను భర్తీ చేయడం మాత్రం అనుకున్నంత సులువు కాదు. మేనేజ్మెంట్కు కఠిన సవాల్ తప్పదు. లక్ష్యాన్ని సాధించిన తర్వాత వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురి చేసే సందర్భం. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన వీరిద్దరికీ ధన్యవాదాలు చెబుతున్నా. ఎన్నో రికార్డులను బ్రేక్ చేశారు. టీ20 ప్రపంచ కప్ను రెండోసారి దక్కించుకున్నందుకు భారత జట్టులోని ప్రతీ ఆటగాడికి శుభాకాంక్షలు. చివరి వరకూ పట్టువిడవకుండా విజేతగా అవతరించడం అభినందనీయం’’ అని షమీ వ్యాఖ్యానించాడు.
విరాట్ అద్భుతం చేశాడు: సిద్ధూ
‘‘ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్తో భారత జట్టు విజయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక పాత్ర పోషించాడు. 150 కోట్ల భారతీయులు సగర్వంగా తలెత్తుకొనేలా చేశాడు. ఫామ్లో లేడని విమర్శలు వచ్చినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాడు. ఫైనల్లో 76 పరుగులు చేశాడు. ఇతర మ్యాచుల్లో 38, 24 పరుగులు చేసినప్పుడు కూడా రన్రేట్ పడిపోకుండా చూశాడు. దిగ్గజంగా గుర్తుండిపోవడం ఖాయం. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు’’ అని భారత మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సిద్ధూ ప్రశంసించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి. -
‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
ఇటీవల టీమ్ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్ అనుభవించారు. -
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. -
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
-
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
-
వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న