- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Riyan-Abhishek: పరాగ్ స్పెషల్.. అభిషేక్ ఆనందం.. జింబాబ్వే టూర్ వేళ యువ భారత్ ముచ్చట్లు
టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. జింబాబ్వే పర్యటనకు భారత ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ జట్టును అక్కడికి పంపించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ముగిసిన తర్వాత భారత జట్టు మరో ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధమైంది. జింబాబ్వేతో శనివారం నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ఇండియా (ZIM vs IND) ఆటగాళ్లు కొందరు జింబాబ్వేకి బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో అంతర్జాతీయ క్రికెట్ ఆడని క్రికెటర్లు నలుగురు ఉన్నారు. వారే అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, తుషార్ దేశ్పాండే. వీరిలో రియాన్, అభిషేక్, తుషార్ జింబాబ్వేకి పయనం కాగా.. మిగతా ఇద్దరూ కాస్త ఆలస్యంగా జట్టుతోపాటు చేరతారు. ఈ సందర్భంగా తమకు టీమ్ నుంచి పిలుపు రావడంపై స్పందించారు. ఆ వీడియోను బీసీసీఐ (BCCI) తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
అప్పటికే నా పేరంట్స్ ఇంటర్వ్యూలతో బిజీ: అభిషేక్
‘‘జట్టుకు ఎంపికైన తర్వాత శుభ్మన్ గిల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. చాలా ఆనందమేసింది. ఫస్ట్ టైమ్ టీమ్కు సెలెక్ట్ కావడంతో ఇంటర్వ్యూలు ఇచ్చా. కానీ, నేను ఇంటికి వెళ్లేటప్పటికే నా పేరంట్స్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అది చూసి చాలా గర్వపడ్డా. క్రికెట్ ఆడటం ప్రారంభించిన తొలి రోజు నుంచే.. టీమ్ఇండియాకు ఆడటం కలగాపెట్టుకొన్నా. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తీవ్రంగా శ్రమించా. జింబాబ్వే పర్యటనకు వెళ్తానని అనుకోలేదు’’ అని అభిషేక్ (Abhishek Sharma) తెలిపాడు.
జట్టే కొత్త.. అంతా పాతవాళ్లే: రియాన్
‘‘నేను భారత జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. కానీ, టీమ్లోని అందరితోనూ ఆడిన అనుభవం ఉంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రయాణం చేయాలని కలలు కన్నా. చాలా ఏళ్లు క్రికెట్ ఆడినప్పటికీ ఇప్పటికి పిలుపువచ్చింది. భారత జట్టు జెర్సీని ధరించడం భలేగా ఉంది. ఈ ఉత్సాహంలో పాస్పోర్టు, నా ఫోన్లు మరిచిపోయా. వాటిని పోగొట్టుకోలేదు కానీ ఎక్కడ పెట్టానో గుర్తుకు రాలేదు. ఇప్పుడు దొరికాయి. అస్సాం నుంచి వచ్చిన ఓ కుర్రాడికి ఇలాంటి ఛాన్స్ రావడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక జింబాబ్వేతో నాకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది. నా తొలి మ్యాచ్ను అక్కడ ఆడబోతున్నా. అయితే, ఆ కనెక్షన్ ఏంటనేది సీక్రెట్’’ అని రియాన్ (Riyan Parag) వ్యాఖ్యానించాడు. అండర్-19 వరల్డ్ కప్ 2018 టోర్నీలో జింబాబ్వేపై రియాన్ తన తొలి మ్యాచ్ ఆడాడు. కానీ, బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్లో మాత్రం ఒక్క వికెట్ పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ - కోహ్లీ బదులు వీళ్లే.. ఇంట్రెస్టింగ్గా మూడో ప్లేయర్ స్థానం?
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీలా నిలిచే ఆ ఇద్దరు ఎవరంటే? ఈనాడు.నెట్ పాఠకులు చెప్పిన సమాధానం ఇదీ.. -
విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్
టీమ్ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. -
ప్రధాని మోదీకి టీమ్ఇండియా ‘జెర్సీ’ బహూకరణ.. నంబర్ ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీని పొట్టి కప్ విజేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు భారత జెర్సీని అందించారు. మోదీతో భేటీ కావడంపై క్రికెటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
స్వదేశానికి టీమ్ఇండియా.. భారత స్టార్లు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారంటే?
టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమ్ఇండియా స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నారు. -
మొన్న ఆర్మీ ట్రైనింగ్.. ఇప్పుడు పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్పై ట్రోలింగ్
పాకిస్థాన్ క్రికెట్ మేనేజ్మెంట్ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆర్మీ ట్రైనింగ్ అంటూ హంగామా చేసి పొట్టి కప్లో దారుణ పరాభవంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. -
కోహ్లీ ‘ఫిట్నెస్’ చూశాక.. పోటీపడలేమనుకున్నా: సూర్యకుమార్
ఫిట్నెస్ విషయంలో విరాట్ను అందుకోవడం చాలా కష్టమని భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. -
ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ
వరల్డ్ కప్తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు అపూర్వ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
వరల్డ్ కప్తో కెప్టెన్ రోహిత్ డ్యాన్స్ అదుర్స్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డ్యాన్స్తో అలరించాడు. వరల్డ్ కప్తో టీమ్ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయం బయట అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ వేశాడు.
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
పొట్టి కప్ను నెగ్గిన భారత ఆటగాళ్లు ఎట్టకేలకు స్వదేశానికి చేరారు. వారికి ఘనస్వాగతం లభించింది. దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు, అధికారుల మధ్య ప్లేయర్లు డ్యాన్సులతో కాసేపు హంగామా చేశారు. -
1983 TO 2024.. టీమ్ఇండియా ‘ప్రపంచ కప్’ల సంబురం
తొలిసారి 1983లో వన్డే ప్రపంచ కప్ను గెలిచిన టీమ్ఇండియా.. తాజాగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేసి సగర్వంగా ఇంటికి తిరిగొచ్చింది.
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
T20 World Cup: 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం దిల్లీలో అడుగు పెట్టిన రోహిత్ సేన.. అక్కడే ప్రధానితో సమావేశం కాబోతోంది. -
ఆల్రౌండర్ నం.1 హార్దిక్
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. -
అదరగొట్టిన అల్కరాస్
టైటిల్ ఫేవరెట్ మూడో సీడ్ కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. అతను అలవోకగా మూడో రౌండ్ చేరాడు. అయిదో సీడ్ మెద్వెదెవ్ రెండో రౌండ్ను అధిగమించగా.. ఎనిమిదో సీడ్ రూడ్కు ఫోగ్నిని షాకిచ్చాడు. -
క్వార్టర్స్లో తుర్కియే
తొలి నిమిషంలో గోల్.. ఆఖరి సెకన్లలో అద్భుత సేవ్తో తుర్కియే యూరో కప్ ఫుట్బాల్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఆ జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. -
కొత్త సవాల్ను అధిగమించాం
ప్రపంచ బ్యాడ్మింటన్లో ఎదురవుతున్న కొత్త సవాల్ను అధిగమించినట్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం తెలిపింది. -
మార్చి 1న భారత్, పాక్ పోరు!
అసలు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందో లేదో తెలియదు, జరిగితే టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్థాన్లో భారత్ పర్యటిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు గానీ.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ముహూర్తం ఖరారైపోయింది. -
అది తప్పుకోవడం కాదు
పారిస్ డైమండ్ లీగ్ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్పష్టత ఇచ్చాడు. -
బాయ్కాట్కు మళ్లీ క్యాన్సర్
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ రెండోసారి గొంతు క్యాన్సర్ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
మోదీవే అసత్య ప్రకటనలు.. చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
-
అందుకే భోలే బాబాను ఇంకా అరెస్టు చేయలేదు: పోలీసులు
-
‘నీట్ను రద్దు చేయొద్దు’ - సుప్రీం కోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు
-
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
-
జగన్ జైలుకు పోయే సమయం ఆసన్నమైంది: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి