Ramoji Rao memorial athletics Championship: ఛాంపియన్ల వేదిక
చెరుకూరి రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అండర్-8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రేరణగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ బ్రాండ్ అంబాసిడర్ పుల్లెల గోపీచంద్ అన్నారు.
రామోజీరావు స్మారక చిన్నారుల అథ్లెటిక్స్పై గోపీచంద్
‘లక్ష్య’ దేశానికే ఆదర్శం: రమేశ్
ఈనాడు, హైదరాబాద్
రామోజీరావుకు నివాళి అర్పిస్తున్న ఉమ చిగురుపాటి. చిత్రంలో పుల్లెల గోపీచంద్, నాగపురి రమేశ్
చెరుకూరి రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అండర్-8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రేరణగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ బ్రాండ్ అంబాసిడర్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ప్రతిభాన్వేషణకు ఇది మంచి అవకాశమని తెలిపారు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ- ఈనాడు ‘లక్ష్య’ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో రామోజీరావు స్మారక అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. 469 మంది చిన్నారులు పాల్గొన్న ఈ టోర్నీని గోపీచంద్ ప్రారంభించారు. గ్రాన్యూల్స్ ఇండియా ఫార్మా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమ చిగురుపాటి, ఏఐజీ హాస్పిటల్స్ కార్డియాలజిస్టులు అనూజ్ కపాడియా, ప్రగతి గుర్రం.. భారత జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్, ‘లక్ష్య’ మెంటార్ నాగపురి రమేశ్.. తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘‘తెలంగాణ రాష్ట్ర చిన్నారులకు అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తుండటం సంతోషకరం. అకాడమీలో ఈరోజు కోసం ఎప్పట్నుంచో కల కంటున్నా. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి చాలామంది పిల్లలు చురుగ్గా టోర్నీలో పాల్గొంటున్నారు. తల్లిదండ్రులు ఉత్సాహంగా చిన్నారులను తీసుకొచ్చారు. ప్రతిభావంతుల అన్వేషణకు ఇది మంచి అవకాశం. ఈ టోర్నీ చిన్నారులకు ప్రేరణగా నిలుస్తుంది. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని టోర్నీలు నిర్వహించాలి. అద్భుతమైన ఈ టోర్నీని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని ఆశిస్తున్నా’’ అని తెలిపారు.
రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్లో వివిధ విభాగాల విజేతలు
‘‘ప్రతి చిన్నారికి ఆడుకునే అవకాశం కల్పించడమే ‘లక్ష్య’ ఉద్దేశం. ఈ టోర్నీలో 8, 10, 12 వయో పరిమితి విభాగాల్లో పిల్లలు పాల్గొంటున్నారు. చిన్నారులకు ఉచిత భోజనం, పతకాలు, నగదు బహుమతులు అందిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ‘లక్ష్య’ ద్వారా ఉపకార వేతనాలు ఇస్తున్నాం. అత్యుత్తమ ప్రతిభావంతులకు హైదరాబాద్లో ఉచిత భోజనం, అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందజేస్తున్నాం. ఇప్పటికే ఒలింపిక్స్, ఆసియా స్థాయి క్రీడాకారుల్ని ‘లక్ష్య’ తీర్చిదిద్దింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తున్న ఈనాడుకు కృతజ్ఞతలు. ‘లక్ష్య’ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఎంతోమంది గ్రామీణ, పేద, ప్రతిభావంతుల్ని గుర్తించి వెలుగులోకి తీసుకొస్తుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది’’ అని ద్రోణాచార్య అవార్డీ రమేశ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విండీస్తో రెండో టెస్టు.. తొలి రోజే ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు
ఓడినా.. గెలిచినా ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్లో దూకుడు మంత్రం వదల్లేదు. తాజాగా విండీస్తో రెండో టెస్టులో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గతంలో తన రికార్డునే అధిగమించడం గమనార్హం. -
అలాంటి కెప్టెన్తో పని చేయను.. సెలక్టర్లతో చర్చించిన గంభీర్!
రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో హార్దిక్ పాండ్యను కెప్టెన్గా చేస్తారని భావించారు. కానీ, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టీ20 కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు. -
కుర్రాళ్ల నుంచి తీవ్ర పోటీ.. అప్పుడైనా సంజూ తుది జట్టులో కష్టమే: మిశ్రా
ప్రతిభకు కొదవేం లేని ఆటగాడు సంజూ శాంసన్. టీమ్ఇండియాలో మాత్రం పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. తాజాగా టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. -
అమెరికాలో టీ20 ప్రపంచకప్.. ఐసీసీకి రూ.167 కోట్ల నష్టం!
అమెరికాలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను నిర్వహించడం వల్ల ఐసీసీకి రూ.167 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. -
నేను లక్ష్య ఛేదననే ఇష్టపడతా: భారత క్రికెటర్ స్మృతీ మంధాన
భారత మహిళా జట్టు శ్రీలంకకు చేరుకుంది. శుక్రవారం నుంచి లంక వేదికగా మహిళల ఆసియా కప్ ప్రారంభం కానుంది. -
నాపై నమ్మకం ఉంచారు.. ఆ ఇద్దరి మద్దతును మరువలేను: దూబె
ఆటగాడిపై నమ్మకం ఉంచితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానికి శివమ్ దూబె ప్రత్యక్ష ఉదాహరణ. టీ20 ప్రపంచ కప్ ఆరంభంలో ఇబ్బంది పడిన అతడికి జట్టు మేనేజ్మెంట్ మద్దతుగా నిలిచింది. -
కోహ్లీ.. నాతో 40 నిమిషాలు నిల్చొనే మాట్లాడాడు: శశాంక్ సింగ్
కోహ్లీ ప్రవర్తనపై సీనియర్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలకు యువ ఆటగాడు ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్గా మారింది. ఆ సీనియర్ ఏమన్నాడు? ఈ యువ క్రికెటర్ ఎవరనేది తెలుసుకుందాం. -
శ్రీలంకతో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమ్ఇండియా!
శ్రీలంక పర్యటన కోసం జట్ల ఎంపిక జరుగుతున్న వేళ ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయి. రోహిత్ శర్మ కూడా లంకతో వన్డే సిరీస్ ఆడతాడని తెలుస్తోంది. -
సెహ్వాగ్ను చూసి.. గొప్ప నాయకత్వ పాఠం నేర్చుకొన్నా: గంగూలీ
అత్యుత్తమ నాయకుడిగా ఎదగాలంటే కేవలం జట్టును నడిపించడమే కాకుండా.. ఆటగాళ్ల వ్యక్తిగత బలాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. -
కఠోర శ్రమ ఎప్పటికీ వృథా కాదు..: శ్రీలంక టూర్ వేళ హార్దిక్ పాండ్య పోస్టు
టీమ్ఇండియా పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్గా మారింది. కఠిన పరిస్థితులను ఎదుర్కొని సత్ఫలితాలను సాధించడం ఆనందంగా ఉందన్నాడు. -
వెనకబడిన 157 కి.మీ. పేసర్.. కారణం ఏంటో చెప్పిన బౌలింగ్ కోచ్
భారత జట్టులో నిలకడగా 148+కి.మీ. వేగంతో బంతులు వేసే బౌలర్లు చాలా తక్కువ. కానీ, అలాంటివారు కూడా జట్టులో స్థానం సంపాదించడం కోసం పోరాడాల్సి వస్తోంది. దానికి కారణం లెంగ్త్ను మిస్ కావడమే. -
అథ్లెట్లు 117.. సిబ్బంది 140
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న భారత అథ్లెట్ల సంఖ్య ఖరారైంది. 117 మంది ఈసారి అత్యున్నత క్రీడా వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. -
అమ్మ చెప్పింది..
జ్యోతి ఎర్రాజి. ఒలింపిక్స్లో 100మీ హర్డిల్స్లో పోటీపడనున్న తొలి భారత అథ్లెట్గా ఘనత సాధించనుంది ఈ తెలుగమ్మాయి. -
వీళ్లది ఒలింపిక్ దేశం
వారికంటూ చెప్పుకోవడానికి సొంత దేశం లేదు. గర్వంగా మోయడానికి సొంత జెండా లేదు. వారికి అండగా నిలిచే లక్షలు, కోట్లమంది అభిమానులూ లేరు. -
లంక పర్యటనకు భారత జట్టు ఎంపిక నేడు!
శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్లకు భారత జట్లను గురువారం ప్రకటించే అవకాశముంది. -
జై షా ఐసీసీ ఛైర్మన్ అవుతాడా?
బీసీసీఐ కార్యదర్శి జై షా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవి చేపడతాడా? ఇప్పుడు ఈ అంశమే ఆసక్తి రేకెత్తిస్తోంది. -
అభాకు ఏమైంది
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లెవరో స్పష్టత వచ్చేసింది. -
శౌర్యకు కాంస్యం
ప్రపంచ జూనియన్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్లో భారత ఆటగాడు శౌర్య బవా కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. -
యుఎస్ ఓపెన్లో నాదల్?
టెన్నిస్ దిగ్గజం నాదల్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా, ఆటలో కొనసాగడం కష్టమేనని ఇప్పటికే చెప్పాడు. -
రెండో స్థానంలోనే సూర్య
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. -
నేను భారత్లోనూ వంట చేస్తాను.. దుస్తులు ఉతుక్కుంటాను..: ఉనద్కత్
సోషల్ మీడియాలో తనపై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చాడు జయదేవ్ ఉనద్కత్..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నక్సలిజం సమస్యను మూడేళ్లలో పరిష్కరిస్తాం: ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం
-
‘ఇండియా’ కూటమి ఎంపీ ఎన్నికపై హైకోర్టుకు పన్నీర్ సెల్వం
-
ఇటలీ ప్రధానిపై పోస్టు.. జర్నలిస్టుకు జరిమానా
-
పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. వరదలో చిక్కుకున్న 20 మంది కూలీలు
-
జాన్వీకపూర్కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన నటి
-
తిరుమల అన్నప్రసాద వితరణ కార్మికుల ధర్నా