- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
PM Modi-Team India: ప్రధాని మోదీకి టీమ్ఇండియా ‘జెర్సీ’ బహూకరణ.. నంబర్ ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీని పొట్టి కప్ విజేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు భారత జెర్సీని అందించారు. మోదీతో భేటీ కావడంపై క్రికెటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) సాధించిన తర్వాత స్వదేశానికి వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister) ప్రత్యేకంగా కలిశారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో భేటీ జరిగింది. ఈ సందర్భంగా క్రికెటర్లను మోదీ అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్పై ప్రశంసలు కురిపించారు. విజేతగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారని స్టార్ ప్లేయర్లనూ కొనియాడారు. భారత క్రికెటర్లతోపాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి వీరిద్దరూ ప్రత్యేకంగా భారత జెర్సీని అందజేశారు. ఇంగ్లిష్లో నమో (NAMO) అని ‘1’వ నంబర్తో కూడిన జెర్సీని మోదీకి బహూకరించారు.
ఈ ఫొటోలను షేర్ చేసిన బీసీసీఐ ‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన క్రికెటర్లు కలిశారు. ఈ సందర్భంగా మీరు (ప్రధాని) అందించిన స్ఫూర్తివంతమైన మాటలను ఆచరణలోకి తీసుకొస్తాం. మీ అమూల్యమైన మద్దతు ఇలానే టీమ్ఇండియాపై ఉండాలని కోరుకుంటున్నాం’’ అని క్యాప్షన్ను జోడించింది. దాదాపు 16 గంటలపాటు విండీస్ నుంచి ప్రయాణించి వచ్చిన భారత ఆటగాళ్లకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే.
గొప్ప గౌరవం: విరాట్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రధాని మోదీని కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’’ అని కోహ్లీ పోస్ట్ పెట్టాడు. అంతకుముందు దిల్లీ విమానాశ్రయం వద్ద ఓ హోటల్లో కోహ్లీ తన కుటుంబ సభ్యులను కలిశాడు. వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మ ‘లవ్’ ఎమోజీతో రిప్లయ్ ఇవ్వడం గమనార్హం.
బుమ్రా కుటుంబంతో మోదీ
భారత జట్టులోని ప్రతి ఒక్కరితో మోదీ ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. ఈ క్రమంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేశన్ కూడా ప్రధానితో సంభాషించారు. అనంతరం బుమ్రా కుమారుడు అంగద్ను ప్రధాని ఎత్తుకొని కాసేపు బుజ్జగించారు. దీనిపై బుమ్రా స్పందిస్తూ.. ‘‘మీ ఆతిథ్యం అద్భుతం. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’’ అని పోస్టు చేశాడు. యుజ్వేంద్ర చాహల్ (Chahal) కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసియా కప్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
జులై 19 నుంచి 28 వరకు మహిళల ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. టీమ్ ఇండియా ఆటగాళ్ల జెర్సీపై ఒకే స్టార్.. కారణమిదే
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాళ్ల జెర్సీపై ఒక స్టార్ మాత్రమే ఉంది. ఇటీవల రెండో టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ఇండియా జింబాబ్వేతో మ్యాచ్లో ఒకే స్టార్ ఉన్న జెర్సీని ధరించింది. -
తొలి టీ20లో జింబాబ్వే విజయం
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా హరారే (Harare) వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
నువ్వు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.. మైకెల్ వాన్కు రవిశాస్త్రి గట్టి కౌంటర్
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వాహకులు భారత్కు అనుకూలంగా వ్యవహరించారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. -
ఫైనల్ మ్యాచ్ వేదికపై ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలు.. బదులిచ్చిన బీసీసీఐ
భారత్లో జరగనున్న ఐసీసీ ప్రధాన టోర్నీల ఫైనల్ మ్యాచ్లకు ముంబయి వేదిక కావాలని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కోరడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. -
ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య
గత ఆరు నెలల కాలంలో ఎన్నో హెచ్చుతగ్గులను చవిచూశానని ప్రధాని మోదీతో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్య (Hardik Pandya) వెల్లడించారు. -
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
Shubman Gill: అంతర్జాతీయ టీ20ల్లో తాను ఓపెనర్గా ఉండాలనుకుంటున్నట్లు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ చెప్పారు. జింబాబ్వేతో మ్యాచ్లోనూ తాను ఓపెనింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
‘హార్దిక్ కూడా అందరిలాంటోడే..’
తన సోదరుడు హార్దిక్ పాండ్య టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. -
ఇక కుర్రాళ్ల సమయం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. -
చరిత్ర మారలేదు
గత 36 ఏళ్లలో ప్రపంచకప్ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు. -
భారత్ జోరుకు కళ్లెం
దక్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్ఇండియాను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్లో బదోసా
స్పెయిన్ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్లో ప్రవేశించింది. -
సెమీస్లో అర్జెంటీనా
కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్తో ఈక్వెడార్ను ఓడించింది. -
టీమ్ఇండియాకు ఇంకో రూ.11 కోట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. -
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రెడిట్ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.