- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 World Cup: ‘‘ఆదర్శప్రాయమైన విజయం’’.. టీమ్ఇండియాకు ప్రధాని మోదీ ఫోన్
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న సందర్భంగా భారత జట్టును ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లతో ఆయన స్వయంగా మాట్లాడి అభినందించారు.
T20 World Cup | దిల్లీ: టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సమష్టిగా రాణించి విశ్వ వేదికపై దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఆటగాళ్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు టీమ్ఇండియా కృషిని కీర్తిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రికెట్ జట్టును అభినందించిన వారిలో ఉన్నారు. స్వయంగా ఫోన్లో మాట్లాడి మరీ ఆయన తన ఆనందాన్ని ప్లేయర్లతో పంచుకోవడం విశేషం. ‘‘భారత క్రికెట్ జట్టుతో మాట్లాడి, T20 ప్రపంచ కప్లో వారి ఆదర్శప్రాయమైన విజయాన్ని అభినందించాను. టోర్నీ అంతటా వారు అద్భుతమైన నైపుణ్యం, స్ఫూర్తి ప్రదర్శించారు. ప్రతీ క్రీడాకారుడి నిబద్ధత అందరిలో ప్రేరణ నింపుతుంది’’ అంటూ జట్టు సభ్యులతో మాట్లాడిన అనంతరం మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
రోహిత్ శర్మతో స్వయంగా మాట్లాడిన మోదీ.. ఆయన కెప్టెన్సీని కొనియాడారు. తుది మ్యాచ్లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకంగా మారిన కోహ్లీ పాత్రను సైతం ఆయన అభినందించారు. మరోవైపు దాదాపు రెండున్నరేళ్లుగా జట్టు కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ద్రవిడ్ కృషిని సైతం మెచ్చుకున్నారు. భారత క్రికెట్కు చేసిన సేవలకుగానూ ఆయనకు ధన్యవాదాలూ తెలిపారు. ఫైనల్ ఓవర్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్య, చరిత్రలో నిలిచిపోయే క్యాచ్తో విజయాన్ని ఖాయం చేసిన సూర్యకుమార్ యాదవ్ను సైతం ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ద్రవిడ్, రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు.
మీ కెప్టెన్సీతో కొత్త దిశ..
‘‘మీది అద్భుతమైన వ్యక్తిత్వం. మీ దూకుడు మనస్తత్వం, బ్యాటింగ్, కెప్టెన్సీ భారత జట్టుకు కొత్త దిశను అందించాయి. మీ టీ20 కెరీర్ అందరికీ గుర్తుండిపోతుంది. మీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉంది’’ - రోహిత్తో మోదీ సంభాషణ
ప్రేరణనిస్తూనే ఉంటారు..
‘‘మీతో మాట్లాడుతున్నందుకు సంతోషం. ఫైనల్స్లో ఇన్నింగ్స్లా, మీరు భారత బ్యాటింగ్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. మీరు అన్ని ఫార్మాట్లలో మెరిశారు. T20 క్రికెట్ మిమ్మల్ని మిస్సవుతుంది. కానీ, కొత్త తరం ఆటగాళ్లకు మీరు ప్రేరణనిస్తూనే ఉంటారని నేను విశ్వసిస్తున్నాను’’- కోహ్లీతో ప్రధాని
విజయాన్ని తీర్చిదిద్దిన ద్రవిడ్..
‘‘రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన కోచింగ్ ప్రయాణం భారత క్రికెట్ను విజయ తీరాలకు చేర్చింది. ఆయన అచంచలమైన అంకితభావం, వ్యూహాత్మక ప్రణాళికలు, సరైన ప్రతిభను గుర్తించడం వంటి అంశాలు మెరుగైన జట్టు కూర్పుకు ఎంతో దోహదం చేశాయి. టీమ్కు అందించిన సేవలు, రాబోయే తరాల్లో స్ఫూర్తి నింపినందుకు భారత్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రపంచకప్ గెలుపొందిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు’’- రాహుల్ ద్రవిడ్పై మోదీ
తాజా విజయంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ అంతర్జాతీయ టీ20కి వీడ్కోలు చెప్పారు. విశ్వవిజేతగా భారత జట్టును నిలిపిన శుభసందర్భాన వీరు తమ నిర్ణయాలను ప్రకటించారు. మరోవైపు కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం సైతం ముగియనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Dravid: టీమ్ఇండియా కోచ్ పదవి నుంచి దిగిపోయిన రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక నిరుద్యోగినన్నాడు. -
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
ఈ సీజన్ అనంతరం ఐపీఎల్కు వీడ్కోలు పలికిన దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సరికొత్త అవతారంలో ఆర్సీబీకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. -
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
బెరిల్ హరికేన్ ఎఫెక్ట్ టీమ్ఇండియాపై పడింది. ఈ హరికేన్ కారణంగా భారత జట్టు స్వదేశానికి ఆలస్యంగా రానుంది. -
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
జులై నెలాఖరులో టీమ్ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు కొత్త హెడ్ కోచ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
ఈ టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. -
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంపై అతడి సతీమణి ఎమోషనల్ అయ్యారు. అటు భార్య అనుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. -
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
T20 World Cup: తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్నకు సంబంధించిన వార్తను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత్ను కొనియాడుతూనే.. కీలక మ్యాచ్లో తడబడే అలవాటును దక్షిణాఫ్రికా కొనసాగించిందంటూ రాసుకొచ్చాయి. -
ఎందుకింత ఉద్వేగం!
దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్ మాత్రం దక్కడం లేదు. సెమీస్లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం. -
రూ.125 కోట్లు.. ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. -
ఈ కప్ అందరిదీ
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది. -
ఈ ప్రపంచకప్ వేరయా..
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. -
జకోవిచ్ సాధిస్తాడా?
సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) అదరగొట్టారు. జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్ రజత పతకంతో మెరిశాడు. -
స్నేహ్కు 8 వికెట్లు
భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
జడేజా కూడా టాటా
భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్ బాటలో మరో సీనియర్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు టాటా చెప్పాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. -
సంక్షిప్తవార్తలు(6)
తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు డిస్నీ+హాట్స్టార్లో భారీస్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధన్ఖడ్, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!
-
భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అరెస్ట్
-
ఏఎన్యూ వీసీ రాజీనామా.. వర్సిటీలో సంబరాలు
-
సమాచారం కావాలంటే.. ఇక వాట్సప్లో సెర్చ్ చేయొచ్చు!
-
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
-
‘తంగలాన్’ అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్..