- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Team India- Modi: నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకొని స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియా గురువారం ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ఆ విశేషాలతో కూడిన వీడియోను పీఎంవో తాజాగా విడుదల చేసింది.
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో (T20 WorldCup) భారత్ విజయఢంకా మోగించింది. ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను (South Africa) కోలుకోలేని దెబ్బకొట్టి కప్ను సొంతం చేసుకుంది. గురువారం స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్ ఇండియాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. దిల్లీలో దిగిన తర్వాత రోహిత్ సేన.. ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయింది. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించిన ప్రధాని.. టోర్నీ విశేషాలను తెలుసుకున్నారు. వారితోనే అల్పాహారం చేసి.. సరదాగా వారిని ప్రశ్నిస్తూ ఉత్సాహం నింపారు. ఆ విశేషాలతో కూడిన వీడియోను పీఎంవో తాజాగా విడుదల చేసింది.
టోర్నీ ప్రారంభం నుంచి కోహ్లీ ఎదుర్కొన్న ఒడుదొడుకులతోపాటు, ఫైనల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ గురించి మోదీ ఆరా తీశారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో జట్టుకు, తన నైపుణ్యానికి న్యాయం చేయలేనేమో అనిపించిందని చెప్పిన కోహ్లీ... కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ వల్లే చివరి వరకు స్వేచ్ఛగా ఆడగలిగానని అన్నాడు. ప్రారంభం నుంచి తక్కువ పరుగులకే ఔటవుతున్నా.. తనపై నమ్మకం ఉంచి.. చివరి మ్యాచ్ వరకు కొనసాగించారని చెప్పాడు.
‘విరాట్.. ఈ టోర్నీలో తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యారు కదా.. మీరేమంటారు?’ అని ప్రశ్నించగా.. కోహ్లీ బదులిస్తూ..‘‘ ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజు జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు నాకెంతో ప్రత్యేకం. టోర్నీలో నేను జట్టుకు ఎంత చేయాలనుకున్నానో.. అంత చేయలేకపోయాను. ఇదే విషయాన్ని ఒకానొక దశలో కోచ్ ద్రవిడ్కు చెప్పేశాను. ‘జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వే అండగా నిలుస్తావన్న నమ్మకం నాకుంది’ అని ఆయన ధైర్యం చెప్పారు. రోహిత్ శర్మతోనూ ఇదే విషయాన్ని చెప్పా. ఫైనల్ మ్యాచ్లో ఇద్దరం కలిసి ఓపెనర్స్గా వెళ్తున్నప్పుడు.. నాపై నాకే నమ్మకం కుదరలేదు. కానీ, తొలి ఓవర్లో మూడు బౌండరీలు బాదేసరికి కొంచెం ధైర్యం వచ్చింది.’’ అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ప్రారంభంలోనే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో కోహ్లీ.. 75 పరుగులతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
అందుకే మట్టి తిన్నా: రోహిత్
అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మతో పిచ్ మట్టి రుచి ఎలా ఉందని సరదాగా ప్రశ్నించారు. అసలు ఎందుకు అలా మట్టి నోట్లో వేసుకున్నారు? అని అడగ్గా.. ఆ పిచ్ అద్భుత విజయాన్ని అందించి పెట్టిందని, ఆ క్షణాలను కలకాలం గుర్తుంచుకునేందుకే అక్కడి మట్టిని తిన్నానని రోహిత్ చెప్పుకొచ్చాడు. ‘‘ విజయం కోసం మేమెంతో కష్టపడ్డాం. ఆ క్షణాల కోసం ఎంతోకాలం వేచి చూశాం. కొన్నిసార్లు చివరి వరకు వచ్చాం. కానీ, ముందుకెళ్లలేకపోయాం. కానీ, ఈసారి అందరి ఆకాంక్ష నెరవేరింది. ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన పిచ్ను, ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలనే అక్కడి మట్టిని నోట్లో వేసుకున్నాను’’ అని రోహిత్ బదులిచ్చాడు.
దాని వెనక రహస్యం?: మోదీ
మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం రోహిత్ కప్ను అందుకునేందుకు కాస్త ప్రత్యేకంగా నడుచుకుంటూ వెళ్లడం, జట్టు సభ్యులు కూడా అతడిని అనుకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనిపైనా మోదీ ఆరా తీశారు. దీని వెనకున్న రహస్యమేంటని సరదాగా ప్రశ్నించారు. అందులో రహస్యమేమీ లేదని, కాస్త వైవిధ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా చేశామని రోహిత్ బదులిచ్చాడు. దీనిపై స్పందించిన మోదీ.. ఇది చాహల్ సలహాయేనా? అని మళ్లీ అడిగారు. నవ్వేసిన రోహిత్.. చాహల్, కుల్దీప్ ఇలా చేయమని సలహా ఇచ్చారని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితం ఎంతో విలువైంది.. డ్రగ్స్ బారిన పడి దాన్ని నాశనం చేసుకోవద్దు: పీవీ సింధు
జీవితం ఎంతో విలువైందని.. డ్రగ్స్ బారిన పడి దాన్ని నాశనం చేసుకోవద్దని ప్రముఖ బ్యామ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సూచించారు.
-
సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే లక్ష్యం 235
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
నా పరిస్థితే వేరు.. దేశవాళీలో ఆడమనడం సమంజసంగా అనిపించలేదు: ఇషాన్
ఆరు నెలలుగా చాలా కుంగుబాటుకు గురైనట్లు ఇషాన్ కిషన్ వెల్లడించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఉద్వాసన మొదలు జాతీయ జట్టులో చోటు కోల్పోవడం వరకు ప్రతిదీ బాధపెట్టిందని తెలిపాడు. -
ద్రవిడ్కు ‘భారతరత్న’ ఇవ్వడమే సముచితం: సునీల్ గావస్కర్
భారత్ టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో రోహిత్తోపాటు జట్టులోని సభ్యులు ఎంత కష్టపడ్డారో.. కోచ్గా రాహుల్ ద్రవిడ్ శ్రమ కూడా అంతే కీలకం. -
భారత కోచ్గా గంభీర్! ఈడెన్ గార్డెన్స్లో ఫేర్వెల్ వీడియో షూట్
టీమ్ ఇండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో ఆ రేసులో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ముందున్నట్లు తెలుస్తోంది. -
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
ఇటీవల టీమ్ఇండియాతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
భారత జెర్సీని ధరించే అవకాశం వస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. అయితే, యువ క్రికెటర్ నితీశ్కు పిలుపు వచ్చినా.. గాయం కారణంగా జింబాబ్వే సిరీస్కు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న రెండో టీ20 ప్రపంచ కప్ను రోహిత్ శర్మ అందించాడు. వచ్చే ఏడాది మరో రెండు కీలక లక్ష్యాలు హిట్మ్యాన్ ముంగిట ఉన్నాయి. -
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
టెన్నిస్ క్రీడాకారుల ఆన్లైన్ ప్రైవసీని కాపాడేందుకు వింబుల్డన్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘ఏఐ’ని పరిచయం చేశారు. -
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల్లో ఏకంగా 2 కోట్ల లైక్స్ను సొంతం చేసుకొంది. -
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు వేడుకను భార్య సాక్షి, మిత్రులతో కలిసి చేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. -
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా రిషభ్ పంత్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. -
యువ భారత్ బోల్తా
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది. -
పోర్చుగల్ షూటౌట్
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్షిప్ను ఓటమితో ముగించాడు. -
రజావత్ సంచలనం
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలన విజయం సాధించాడు. -
ఇంగ్లాండ్ గట్టెక్కింది
ఫుట్బాల్లో స్విట్జర్లాండ్తో పోరంటే ఇంగ్లాండ్ను ఫేవరెట్గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్షిప్ గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్లో ఆ జట్టు ఫేవరెట్గానే బరిలోకి దిగింది. -
స్వైటెక్కు షాక్
వింబుల్డన్లో పెద్ద సంచలనం! టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్సీడ్కు కజకిస్థాన్ అన్సీడెడ్ ప్లేయర్ యూలియా పుటిన్సెవా చెక్ పెట్టింది. -
నేను ఆ తరహా కాదు
టీమ్ఇండియా కోచ్గా తాను కెప్టెన్ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. -
వినేశ్కు స్వర్ణం
గ్రాండ్ప్రి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్ ఆరోపణ
-
‘నివేదికను హిండెన్బర్గ్ ముందే లీక్ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’
-
సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు
-
రిషికేశ్లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు