- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Modi-Rohit Sharma: రోహిత్.. పిచ్ మట్టి రుచి ఎలా ఉంది?: మోదీ
టీ20 ప్రపంచకప్లో విజయం సాధించి స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సరదా ప్రశ్నలు అడుగుతూ మోదీ నవ్వులు పూయించారు.
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) సాధించిన విజయోత్సాహంతో స్వదేశంలో అడుగుపెట్టింది టీమ్ఇండియా. ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆటగాళ్లకు (Team India) అపూర్వ స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో దిల్లీలో దిగిన రోహిత్ (Rohit Sharma) సేన.. నేరుగా ప్రధాని మోదీ (PM Modi) నివాసానికి వెళ్లారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించిన ప్రధాని.. టూర్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచకప్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. క్లిష్టపరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా తట్టుకున్నారంటూ వాకబు చేశారు.
ఒక్కొక్కర్నీ సరదాగా పలకరిస్తూ.. పలు ప్రశ్నలతో నవ్వులు పూయించారు. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత సంతోషం పట్టలేకపోయిన రోహిత్.. గ్రౌండ్లో అలాగే బోర్లా పడుకొని లేచి.. ఆ తర్వాత పిచ్పై ఉన్న చిన్న మట్టిని రెండుసార్లు నోట్లో వేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని గుర్తు చేసుకున్న ప్రధాని ‘ రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?’ అంటూ ప్రశ్నించారు. ఫైనల్ మ్యాచ్లో ప్రారంభంలోనే భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముందుగానే క్రీజులోకి వచ్చి మంచి స్కోరు చేయడం ఎలా అనిపించిందని అక్షర్ పటేల్ను అడిగారు. సాధారణంగా ఆరేడు స్థానాల్లో బ్యాటింగ్కు దిగే అక్షర్ పటేల్.. ఫైనల్ మ్యాచ్లో మూడో డౌన్లో క్రీజులోకి వచ్చి ఒక ఫోర్, 4 సిక్సర్ల సాయంతో 47 కీలక పరుగులతో రాణించాడు.
ఫైనల్ మ్యాచ్లో చివరి ఐదు ఓవర్లలోనే విజయం తారుమారైంది. దక్షిణాప్రికా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో టీమ్ ఇండియా అభిమానులంతా దాదాపు ఆశలు వదులుకున్నారు. ఆ దశలో బంతి అందుకున్న బుమ్రా తక్కువ పరుగులు ఇచ్చి సఫారీ బ్యాటర్ల మీద ఒత్తిడి పెంచాడు. ఆ ఓవర్ వేసే సమయంలో బుమ్రా మనసులో ఏం మెదిలిందో! అంటూ మోదీ వాకబు చేశారు. టోర్నీ సాంతం హార్దిక్ పాండ్య ఆటతీరుపై ఆరా తీసిన ప్రధాని.. దక్షిణాఫ్రికా 16 పరుగులు చేయాల్సిన తరుణంలో చివరి ఓవర్ ఒత్తిడిని ఎలా తట్టుకున్నావ్?అని ప్రశ్నించారు. బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్తో.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ను అభినందిస్తూ.. ఆ ఏడు సెకన్ల సమయాన్ని మోదీ మళ్లీ గుర్తు చేసుకున్నారు. ప్రధాని ప్రశ్నలకు ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జింబాబ్వేతో టీ20 సిరీస్.. టీమ్ ఇండియా ఆటగాళ్ల జెర్సీపై ఒకే స్టార్.. కారణమిదే
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాళ్ల జెర్సీపై ఒక స్టార్ మాత్రమే ఉంది. ఇటీవల రెండో టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ఇండియా జింబాబ్వేతో మ్యాచ్లో ఒకే స్టార్ ఉన్న జెర్సీని ధరించింది. -
తొలి టీ20లో జింబాబ్వే విజయం
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా హరారే (Harare) వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
నువ్వు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.. మైకెల్ వాన్కు రవిశాస్త్రి గట్టి కౌంటర్
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వాహకులు భారత్కు అనుకూలంగా వ్యవహరించారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. -
ఫైనల్ మ్యాచ్ వేదికపై ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలు.. బదులిచ్చిన బీసీసీఐ
భారత్లో జరగనున్న ఐసీసీ ప్రధాన టోర్నీల ఫైనల్ మ్యాచ్లకు ముంబయి వేదిక కావాలని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కోరడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. -
ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య
గత ఆరు నెలల కాలంలో ఎన్నో హెచ్చుతగ్గులను చవిచూశానని ప్రధాని మోదీతో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్య (Hardik Pandya) వెల్లడించారు. -
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
Shubman Gill: అంతర్జాతీయ టీ20ల్లో తాను ఓపెనర్గా ఉండాలనుకుంటున్నట్లు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ చెప్పారు. జింబాబ్వేతో మ్యాచ్లోనూ తాను ఓపెనింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
‘హార్దిక్ కూడా అందరిలాంటోడే..’
తన సోదరుడు హార్దిక్ పాండ్య టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. -
ఇక కుర్రాళ్ల సమయం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. -
చరిత్ర మారలేదు
గత 36 ఏళ్లలో ప్రపంచకప్ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు. -
భారత్ జోరుకు కళ్లెం
దక్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్ఇండియాను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్లో బదోసా
స్పెయిన్ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్లో ప్రవేశించింది. -
సెమీస్లో అర్జెంటీనా
కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్తో ఈక్వెడార్ను ఓడించింది. -
టీమ్ఇండియాకు ఇంకో రూ.11 కోట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. -
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రెడిట్ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.