- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rohit Vs Kohli: కోహ్లీ, రోహిత్లను సరిపోల్చలేం.. సోషల్మీడియా వార్పై కపిల్దేవ్ స్పందన
Kapil Dev: టీమ్ ఇండియాలో కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, కోహ్లీలను సరిపోల్చడం తగదని మాజీ క్రికెటర్ కపిల్దేవ్ అన్నారు. ఎవరి శక్తిసామర్థ్యాలు, ఆట వారివని చెప్పారు.
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో (T20 WorldCup) కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా (SouthAfrica) ఫైనల్కు చేరగా.. ఆ జట్టుతో పోటీ పడేందుకు భారత్ (India), ఇంగ్లాండ్ (England) గురువారం రాత్రి 8 గంటలకు తలపడబోతున్నాయి. ఈక్రమంలో భారత్ జట్టులోని కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)పై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వీరిద్దరి శక్తిసామర్థ్యాలను పోల్చుతూ అభిమానులు సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలో భారత్ మాజీ ఆటగాడు కపిల్దేవ్ స్పందించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వారిద్దరినీ సరిపోల్చడం తగదన్నాడు. ఫిట్నెస్ పరంగా కోహ్లీ అంత బలంగా లేకపోయినా.. ప్రత్యర్థులను ఉతికి ఆరేస్తూ రోహిత్ తన పనిని తాను చేసుకుపోతున్నాడని కితాబిచ్చాడు.
‘‘ కోహ్లీ ఫిట్నెస్ ప్రియుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. జిమ్లో వర్కౌట్లు చేయడానికి చాలా ఇష్టపడతాడు. వాస్తవానికి, అతడి వల్ల సహచర ఆటగాళ్లలోనూ చాలా మార్పు వచ్చింది. రోహిత్ శర్మ మాత్రం జిమ్ అంటే పెద్దగా ఇష్టపడడు. అలాగని ఫిట్నెస్ లేదని కాదు. సులువుగా షాట్లు ఆడగలడు. తాజా టీ20 ప్రపంచకప్ మ్యాచ్ల్లో కోహ్లీ పెద్దగా ప్రదర్శన చేయకపోయినా.. రోహిత్ అద్భుతంగా రాణిస్తున్నాడు కదా. కోహ్లీ 150కేజీలు, 250 కేజీల బరువులు సులువుగా ఎత్తగలడు. అలాగని రోహిత్ కూడా ఎత్తాలని లేదు. ఎవరి ఫిట్నెస్, ఆట వారిది. గ్రౌండ్లో కోహ్లీలా రోహిత్ ఉత్సాహాన్ని ప్రదర్శించలేడు. తన పరిమితుల గురించి అతడికి తెలుసు. ఈ విషయంలో అతడిని మించిన ఆటగాడు లేడు. రోహిత్కు సిక్స్ ప్యాక్ అక్కర్లేదు.. ఒక్క ప్యాక్ ఉన్నా ఈజీగా సిక్సర్లు కొట్టగలడు’’ అని కపిల్ కొనియాడాడు.
రోహిత్ కెప్టెన్సీ సామర్థ్యాలపైనా కపిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమ్ ఇండియాను ఇప్పటివరకు సమర్థంగా నడిపించిన కొద్దిమందిలో రోహిత్ ఒకడని చెప్పాడు. చాలామంది పెద్ద ఆటగాళ్లు టీమ్లోకి వస్తుంటారని, ఎవరు వచ్చినా తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని అన్నాడు. చివరికి కెప్టెన్సీ చేసినా.. అందులోనూ తమకే పేరు ప్రతిష్ఠలు రావాలని కోరుకుంటారని చెప్పారు. కానీ, రోహిత్ మాత్రం జట్టు మొత్తాన్ని సంతోషంగా ఉంచుతున్నాడని కపిల్దేవ్ కితాబిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
టీమ్ఇండియా సారథి రోహిత్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రా నుంచి మాజీ క్రికెటర్ల వరకు రోహిత్ నాయకత్వం గురించి ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
టైటిల్ను దక్కించుకోవాలని రెండు జట్లు సిద్ధం.. కానీ, వరుణుడు కూడా ఆడేస్తానంటూ పలకరింపులు.. ఇప్పుడు బార్బడోస్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. -
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
రాహుల్ ద్రవిడ్ కోసం కప్ గెలవాలనే ట్రెండింగ్పై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
టెస్టు క్రికెట్లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏఐ వాయిస్తో లేడీ మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ
-
ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం
-
విజయవాడ-జగదల్పూర్ హైవేలో మార్పులు కోరాం: మంత్రి తుమ్మల
-
కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!
-
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
-
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం