- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 WC 2024: ‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ కోసం (T20 World Cup 2024) భారత జట్టును ప్రకటించిన తర్వాత వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు టీమ్ సమతూకంగా ఉందని అభినందించగా.. కొందరు ఫామ్లో లేని వారిని ఎందుకు ఎంపిక చేశారంటూ విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా ఐపీఎల్లో పెద్దగా రాణించలేకపోతున్న హార్దిక్ పాండ్య సెలక్షన్పై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. పది మ్యాచుల్లో కేవలం 197 పరుగులు చేసిన పాండ్య 4 వికెట్లను మాత్రమే తీశాడు. అతడినే వైస్ కెప్టెన్గా చేయడం గమనార్హం. తాజాగా వాటిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఐపీఎల్లో ఆడటం.. దేశం కోసం ప్రాతినిధ్యం వహించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. జాతీయజట్టుకు ఆడేటప్పుడు ప్రతీ ఆటగాడు గర్వంగా ఫీలవుతాడు. హార్దిక్ పాండ్య విషయంలోనూ ఇదే ఉంటుంది. ఐపీఎల్లో అతడు చాలా సమస్యలను అధిగమిస్తూ ఉన్నాడు. వాటిని చక్కగా నిర్వహిస్తుండటం అభినందనీయం. వరల్డ్ కప్లో భారత్ తరఫున పాండ్య విదేశాల్లో ఆడనున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి నుంచి పూర్తి భిన్నమైన మైండ్సెట్తో బరిలోకి దిగుతాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హార్దిక్ భాగస్వామ్యం అత్యంత కీలకం కానుంది. తప్పకుండా టీమ్ఇండియా టైటిల్ రేసులో ముందుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో కొన్నిసార్లు అదృష్టమూ కలిసిరావాలి. ఇప్పుడీ టీమ్కు లక్ ఉందని భావిస్తున్నా. 2007 మళ్లీ పునరావృతం కావడం ఖాయం. భారత్కు టీ20 ప్రపంచకప్ వచ్చేయడం తథ్యం. జట్టులోని ప్రతిఒక్కరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఐపీఎల్ తర్వాత మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఒక వారం విరామం లభించనుంది’’ అని గావస్కర్ తెలిపాడు.
కేఎల్ రాహుల్ ఉంటే బాగుండేది: రితేష్ దేశ్ముఖ్
వరల్డ్ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. ఐపీఎల్ 2024 సీజన్లో 400+ స్కోరు చేసిన అతడిని పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ కూడా ఉన్నాడు. రాహుల్ను ఎంపిక చేయకపోవడంపై ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘కేఎల్ రాహుల్ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటే బాగుండేది’’ అని పోస్టు పెట్టాడు.
చాహల్ కోసం ధనశ్రీ వర్మ స్పెషల్ పోస్టు
ఐపీఎల్లో అదరగొడుతున్న యుజ్వేంద్ర చాహల్ చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పుడు వరల్డ్ కప్ ఆడే అవకాశం అతడికి వచ్చింది. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. తొమ్మిది మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. చివరిసారిగా వెస్టిండీస్పై 2023 ఆగస్ట్లో చాహల్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. వరల్డ్ కప్నకు చాహల్ ఎంపిక కావడంపై అతడి భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. ‘‘వెల్కమ్ చాహల్. హీ ఈజ్ బ్యాక్’’ అంటూ న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ భవనం మీద భారత జట్టు పేర్లతో కూడిన ఫొటోను షేర్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా
T20 ప్రపంచకప్ సాధించిన టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. -
ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 190
మూడు టీ20ల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా భారత మహిళల జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. -
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకొని స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియా గురువారం ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ఆ విశేషాలతో కూడిన వీడియోను పీఎంవో తాజాగా విడుదల చేసింది. -
ఇప్పుడు 140+ కోట్ల మంది ఛాంపియన్లే: హార్దిక్ పాండ్య
టీమ్ఇండియా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా అందుకొంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!
చివరిసారిగా 1991-92 సీజన్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. ఆ తర్వాత నాలుగు లేదా మూడు టెస్టుల్లోనే తలపడుతూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో ఢీకొట్టుకోనున్నాయి. -
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి. -
‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
ఇటీవల టీమ్ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్ అనుభవించారు. -
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. -
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
-
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: రేవంత్రెడ్డి
-
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు
-
జూన్లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?