- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 WC 2024 Final: ఫైనల్ను చివరివరకూ చూశా.. భారత్ బ్రాండ్ క్రికెట్ అద్భుతం: పాక్ పేసర్
పొట్టి కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. భారత్ విజయంపై పాక్ మాజీలు కొందరు అక్కసు వెళ్లగక్కగా.. ఆ జట్టు పేసర్ మాత్రం అభినందనలు తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో (T20 World Cup 2024) దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ రెండోసారి విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ను సఫారీ జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలిచింది. పొట్టి కప్ ఫైనల్లో టీమ్ఇండియా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిందని పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. యూఎస్ఏ, భారత్ చేతిలో ఓటమితో పాక్ గ్రూప్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.
‘‘ఫైనల్ మ్యాచ్ మొత్తం చూశా. చాలా ఆస్వాదించా. రెండు జట్లూ అద్భుతంగా ఆడాయి. అయితే, ఒత్తిడిని తట్టుకొని ఏ జట్టు రాణిస్తుందో, అదే విజేతగా నిలుస్తుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే జరిగింది. భారత్ తన బ్రాండ్ క్రికెట్తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. కప్ను అందుకొనేందుకు దాయాది దేశానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. టీ20 ప్రపంచకప్లో బలమైన జట్లే తలపడ్డాయి. మేం కూడా చాలా పొరపాట్లు చేశాం. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మరింత శ్రమిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయనడంలో సందేహమే లేదు’’ అని షహీన్ వ్యాఖ్యానించాడు.
జట్టులో రాజకీయాలపై రిజ్వాన్ స్పందన
జట్టు ఎంపిక నుంచి ఆటగాళ్ల మధ్య సరైన సంబంధాలు లేవని వస్తున్న ఆరోపణలపై పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఫేవరెట్గా బరిలోకి దిగిన తమ జట్టు తొలి దశలోనే నిష్క్రమించడంతో రాజకీయాలు ఎక్కువయ్యాయనే విమర్శలూ వచ్చాయని పేర్కొన్నాడు. ‘‘జట్టులో రాజకీయాలు ఉండటంతో ప్రదర్శన దారుణంగా ఉందని రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయని గుసగుసలు విన్నాం. మా మధ్య ఏమైనా ఉంటే వరల్డ్ కప్ ముందు మ్యాచుల్లోనూ ఓడిపోవాలి కదా. ఇదే జట్టుతో మేం గతంలో సెమీస్, ఫైనల్స్కు కూడా చేరాం. అయితే, ట్రోఫీలను గెలవలేదనేది మాత్రం వాస్తవమే. అంచనాలను అందుకోవడంలో మేం విఫలమయ్యాం. ఆటగాడు ఎవరైనా సరే.. విమర్శలు ఎదుర్కోకపోతే విజయవంతం కాలేడు. టీ20 ప్రపంచకప్లో అభిమానులను నిరాశపరిచాం. మా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి’’ అని రిజ్వాన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!
చివరిసారిగా 1991-92 సీజన్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. ఆ తర్వాత నాలుగు లేదా మూడు టెస్టుల్లోనే తలపడుతూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో ఢీకొట్టుకోనున్నాయి. -
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి. -
‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
ఇటీవల టీమ్ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్ అనుభవించారు. -
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. -
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
-
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
-
మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం
-
రివ్యూ: వెబ్సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?
-
డెవిల్ను నియంత్రించాం.. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదు: చంద్రబాబు