- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Olympic athletes: భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఒలింపిక్ అథ్లెట్లపై మోదీ
దిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒలింపిక్స్కు వెళ్లే దేశ అథ్లెట్లు గురువారం తనని కలిసిన సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు. ‘‘పారిస్కు వెళ్లే భారత జట్టుతో ముచ్చటించాను. మన అథ్లెట్లు దేశం గర్వించేలా చేస్తారన్న నమ్మకముంది. వారి విజయాలు 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి కావాలి’’ అని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా అథ్లెట్ల వెంట ఉన్నారు. జావెలిన్త్రో స్టార్ నీరజ్ చోప్రా, బాక్సింగ్ ప్రపంచ ఛాంప్ నిఖత్ జరీన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి.సింధులతో మోదీ వర్చువల్గా మాట్లాడి అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు దండి జ్యోతిక శ్రీ, జ్యోతి యర్రాజి కూడా ప్రధానిని కలిసిన బృందంలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల్లో ఏకంగా 2 కోట్ల లైక్స్ను సొంతం చేసుకొంది. -
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు వేడుకను భార్య సాక్షి, మిత్రులతో కలిసి చేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. -
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా రిషభ్ పంత్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. -
యువ భారత్ బోల్తా
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది. -
పోర్చుగల్ షూటౌట్
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్షిప్ను ఓటమితో ముగించాడు. -
రజావత్ సంచలనం
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలన విజయం సాధించాడు. -
ఇంగ్లాండ్ గట్టెక్కింది
ఫుట్బాల్లో స్విట్జర్లాండ్తో పోరంటే ఇంగ్లాండ్ను ఫేవరెట్గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్షిప్ గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్లో ఆ జట్టు ఫేవరెట్గానే బరిలోకి దిగింది. -
స్వైటెక్కు షాక్
వింబుల్డన్లో పెద్ద సంచలనం! టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్సీడ్కు కజకిస్థాన్ అన్సీడెడ్ ప్లేయర్ యూలియా పుటిన్సెవా చెక్ పెట్టింది. -
నేను ఆ తరహా కాదు
టీమ్ఇండియా కోచ్గా తాను కెప్టెన్ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. -
వినేశ్కు స్వర్ణం
గ్రాండ్ప్రి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
-
కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు
-
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
-
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?