Hardik Pandya: విడాకుల రూమర్స్‌ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్‌

టీమ్‌ఇండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 04 Jul 2024 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ (Natasa Stankovic) నుంచి విడిపోతున్నాడంటూ గత కొద్దికాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నటాషా తాజాగా పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం. నిరుత్సాహపడతాం. అలాంటివేళ ఎవరూ తోడుగా లేరని బాధ పడనవసరం లేదు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. దానిగురించి భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది’’ అంటూ నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు. ఇటీవల నటాషా తన ఇన్‌స్టా ఖాతాలో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించారు. కేవలం కుమారుడితో ఇద్దరూ ఉన్న చిత్రాలను మాత్రమే ఉంచడంతో విడాకుల రూమర్స్‌ మొదలయ్యాయి.

కోహ్లీ ‘ఫిట్‌నెస్‌’ చూశాక.. పోటీపడలేమనుకున్నా: సూర్యకుమార్

కాగా.. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో భారత విజయంలో హార్దిక్‌ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే.. పాండ్య ప్రదర్శనపై నటాషా ఇప్పటివరకు స్పందించలేదు. ఆయనకు సంబంధించిన ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. దీంతో వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకుంటారని వస్తున్న వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని