Nandini: ‘లక్ష్య’ నందినికి స్వర్ణం

ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్‌ (ఆంధ్రప్రదేశ్‌) అదరగొట్టారు. జాతీయ అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్‌ రజత పతకంతో మెరిశాడు.

Published : 01 Jul 2024 04:14 IST

శ్రీనివాస్‌కు రజతం

పంచకుల (హరియాణా): ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్‌ (ఆంధ్రప్రదేశ్‌) అదరగొట్టారు. జాతీయ అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్‌ రజత పతకంతో మెరిశాడు. ఆదివారం ముగిసిన మహిళల హెప్టాథ్లాన్‌లో నందిని (5806 పాయింట్లు) అగ్రస్థానం కైవసం చేసుకుంది. 100 మీటర్ల హర్డిల్స్‌ (988 పాయింట్లు), హైజంప్‌ (783), షాట్‌పుట్‌ (831), 200 మీ (944), లాంగ్‌జంప్‌ (804), జావెలిన్‌ త్రో (610), 800 మీ (846)లో నందిని సత్తాచాటింది. పురుషుల 200 మీటర్ల పరుగును 20.95 సెకన్లలో పూర్తిచేసిన శ్రీనివాస్‌ ద్వితీయ స్థానంలో నిలిచాడు. అనిమేష్‌ కుజుర్‌ (20.65 సె- ఒడిషా) స్వర్ణం సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని