Abhishek Sharma: కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో ఓపెనర్గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న బ్యాటర్ అభిషేక్ శర్మ. ఓపెనర్గా వస్తూ ట్రావిస్ హెడ్తో కలిసి కీలక ఇన్నింగ్స్లు ఆడేస్తున్నాడు. తాజాగా పంజాబ్పై కేవలం 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 41 సిక్స్లు కొట్టి.. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్గా అవతరించాడు. విరాట్ కోహ్లీని (2016లో 38 సిక్సర్లు) అధిగమించాడు. ఈసారి కూడా కోహ్లీ 37 సిక్స్లతో కొనసాగుతున్నాడు. ఇరు జట్లూ నాకౌట్కు చేరుకోవడంతో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్పై ఇన్నింగ్స్కు అభిషేక్ శర్మకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్లో తన ఆటతీరుపై శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఇప్పుడీ ఎడిషన్లో బ్యాటర్లదే హవా. ప్రస్తుతం నాకు మంచి రోజులు నడుస్తున్నాయి. ఈ బ్యాటింగ్ ప్రదర్శనను జట్టు విజయాల కోసం ఉపయోగిస్తున్నా. పంజాబ్తో భారీ లక్ష్యం ఉండటంతో ఎలాగైనా నా కంట్రిబ్యూషన్ ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశా. ఎలాంటి షాట్లు కొట్టాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నా. లారా మా కోచ్గా ఉన్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తీవ్రంగా శ్రమించా. ఇప్పటికీ ఏదైనా సందేహం ఉంటే లారా అందుబాటులోనే ఉంటాడు. చెత్త బంతుల కోసం వెయిట్ చేసి మరీ ఆడుతున్నా. బౌలర్లను కాస్త ఒత్తిడికి గురి చేస్తే ఆ తర్వాత మనం అనుకున్న విధంగా బ్యాటింగ్ చేయొచ్చు. గతి తప్పిన బంతులను ఏమాత్రం ఉపేక్షించను. ఎప్పుడూ మద్దతుగా ఉండే అభిమానులకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఉప్పల్ మైదానం క్యురేటర్, గ్రౌండ్ సిబ్బందిని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. మా శైలికి అనుకూలంగా ఉండేలా పిచ్ను తయారు చేసి ఇచ్చారు’’ అని అభిషేక్ వెల్లడించాడు.
బ్యాక్ఫుట్పై సిక్స్లు ప్రాక్టీస్ చేశా: క్లాసెన్
‘‘ప్రాక్టీస్ సమయంలోనూ నేను సిక్స్లను కొట్టేందుకే శ్రమించా. బ్యాక్ఫుట్పై బంతిని ఎలా స్టాండ్స్లోకి పంపాలి అని సాధన చేశా. ప్రతి మ్యాచ్లో కనీసం ఒకటి లేదా రెండు బౌండరీలను త్వరగా రాబడితే ఒత్తిడి తగ్గిపోతుందని తెలుసు. స్పిన్ బౌలింగ్లో మరింత దూకుడుగా ఆడటానికి కారణం నెట్స్లో ప్రాక్టీస్ చేయడమే. లఖ్నవూ మ్యాచ్ తర్వాత మాకు దాదాపు వారం రోజుల వ్యవధి వచ్చింది. దానిని ఎంతో ఆస్వాదించా. పంజాబ్తో తాజాగా బరిలోకి దిగడానికి ఎంతో తోడ్పడింది. ఇప్పుడు హైదరాబాద్కు ప్లేఆఫ్స్లో ఆడతా. ఆ తర్వాత వరల్డ్ కప్ కోసం మా జట్టుతో చేరనున్నా’’ అని క్లాసెన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాతో టీ20, వన్డే సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్గా జయసూర్య
శ్రీలంక, భారత్ (SL vs IND) మధ్య మరికొన్ని రోజుల్లో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ల్లో మాజీ ఆటగాడు సనత్ జయసూర్య శ్రీలంక జట్టుకు హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. -
టీమ్ఇండియాకు రూ. 125 కోట్ల నజరానా.. ఎవరికి ఎంతంటే?
టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ సాధించడంతో బీసీసీఐ (BCCI) రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంలో స్పష్టత వచ్చింది. -
రెండో మ్యాచ్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో అభిషేక్ తన సొంత బ్యాట్ వాడలేదు. -
బాలీవుడ్ నటితో పెళ్లి.. స్పందించిన కుల్దీప్ యాదవ్
Kuldeep Yadav: తన పెళ్లి విషయంలో త్వరలో అందరికీ శుభవార్త చెప్పనున్నట్లు టీమ్ఇండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్ తెలిపాడు. కాన్పూర్లో ఆయనకు ఘన స్వాగతం లభించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. -
102కు కూలిన జట్టే 100 తేడాతో..
ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. యువ భారత్ బలంగా పుంజుకుంది. జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన శుభ్మన్ బృందం.. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. -
ఛాంపియన్ల వేదిక
చెరుకూరి రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అండర్-8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రేరణగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ బ్రాండ్ అంబాసిడర్ పుల్లెల గోపీచంద్ అన్నారు. -
బ్రెజిల్ ఔట్.. సెమీఫైనల్లో ఉరుగ్వే
కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో బ్రెజిల్కు షాక్ తగిలింది. క్వార్టర్ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓటమితో ఆ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. నిర్ణీత సమయంలో 0-0తో స్కోరు సమమైన ఈ మ్యాచ్లో ఉరుగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-2తో గెలిచి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
క్వార్టర్స్లో అల్కరాస్
టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. జోరు కొనసాగిస్తూ ఈ మూడో సీడ్ ఆటగాడు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అల్కరాస్ 6-3, 6-4, 1-6, 7-5తో హాంబర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. -
రెండో టీ20 వరుణుడిది
భారత మహిళల జట్టుకు నిరాశ. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓడిన హర్మన్ప్రీత్ బృందం.. రెండో టీ20లో గెలిచి లెక్క సమం చేయాలని అనుకున్నా వరుణుడు అడ్డుపడ్డాడు. -
సెమీస్లో నెదర్లాండ్స్
నెదర్లాండ్స్ జట్టు యూరో 2024 సెమీఫైనల్కు దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో వెనుకబడ్డా పుంజుకున్న ఆ జట్టు.. 2-1తో తుర్కియేపై విజయం సాధించింది. పోరును నెదర్లాండ్స్ మెరుగ్గానే ఆరంభించింది. -
సంక్షిప్త వార్తలు (3)
కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. భారత వర్ధమాన ఆటగాడు ప్రియాన్షు రజావత్కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రజావత్ 17-21, 10-21తో అలెక్స్ లేనియెర్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాలుష్యం పెరిగితే.. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు: మంత్రి పొన్నం ప్రభాకర్
-
జెరోదాలో మళ్లీ సాంకేతిక సమస్య.. సోషల్ మీడియా వేదికగా యూజర్ల అసహనం!
-
బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
-
స్కైడాన్స్ చేతికి హాలీవుడ్ ఐకాన్ పారామౌంట్ గ్లోబల్..!
-
ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దు: ఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశం
-
డబ్బులిస్తామని కిడ్నీ మాయం చేసిన వైనం.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు