- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20WC 2024-MS DHONI: నా హార్ట్రేట్ పెరిగిపోయింది.. బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్: ఎంఎస్ ధోనీ
భారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. టీమ్ఇండియాకు వరల్డ్ కప్ను అందించిన మూడో సారథిగా రోహిత్ చరిత్రలో నిలిచిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్ను (T20 World Cup) నెగ్గిన తర్వాత భారత్కు రెండో కప్ దక్కడానికి 17 ఏళ్లు పట్టింది. రోహిత్ కెప్టెన్సీలో పొట్టి కప్ను టీమ్ఇండియా ఒడిసిపట్టింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ విజయం సాధించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తొలిసారి టీ20 ప్రపంచకప్ అందించిన ‘కెప్టెన్ కూల్’ ధోనీ (MS Dhoni) ఏమని స్పందించాడనేది ఆసక్తికరమే కదా! భారత విజయం సాధించిన తర్వాత అతడు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఇప్పుడది వైరల్గా మారిపోయింది.
‘‘వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్. ఈ మ్యాచ్ సమయంలో నా హార్ట్ రేట్ పెరిగిపోయింది. నిశ్శబ్దంగా ఉంటూనే విజేతగా నిలిచారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి కుర్రాళ్ల నుంచి ఫలితం రాబట్టడం అద్భుతం. వరల్డ్ కప్ను (T20 World Cup 2024) స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్ బాయ్స్. విలువ కట్టలేని బహుమతిని పుట్టిన రోజుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని ధోనీ పోస్టు పెట్టాడు. జులై 7న ధోనీ బర్త్డే. దానిని ప్రస్తావిస్తూ అలా పెట్టాడని అభిమానులు కామెంట్లు పెట్టారు. దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇది కూడా ‘తలా’ కోసమే అన్నట్లుగా నెట్టింట చర్చ మొదలైంది. ఎందుకంటే ధోనీ జెర్సీ నెంబర్ 7.
నాలుగో స్టార్ తోడైంది: సచిన్
‘‘ప్రతి స్టార్ భారత్ (team India) విజయం సాధించడంలో కృషి చేశారు. జెర్సీని చూసి దేశం గర్వపడేలా చేశారు. పిల్లలు కూడా తాము క్రికెటర్లం కావాలనే కలకు ముందడుగు వేసేలా ఈ విజయం చరిత్రలో నిలుస్తుంది. భారత్ నాలుగో స్టార్ను సాధించింది. రెండో టీ20 ప్రపంచ కప్ను సాధించడం అభినందనీయం. విండీస్లో 2007లో వన్డే ప్రపంచ కప్లో వైఫల్యంతో ఒడిదొడుకులను చూసిన భారత క్రికెట్ 2024 పొట్టి కప్ను గెలవడంతో పవర్హౌస్గా మారింది. నా స్నేహితుడు ద్రవిడ్ నేతృత్వంలో కప్ను చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది’’ అని సచిన్ (Sachin) పోస్టు చేశాడు. ఇప్పటికే వన్డే ప్రపంచ కప్ 1983, 2011, టీ20 ప్రపంచ కప్ 2007 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకింత ఉద్వేగం!
దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్ మాత్రం దక్కడం లేదు. సెమీస్లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం. -
రూ.125 కోట్లు.. ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. -
ఈ కప్ అందరిదీ
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది. -
ఈ ప్రపంచకప్ వేరయా..
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. -
జకోవిచ్ సాధిస్తాడా?
సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) అదరగొట్టారు. జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్ రజత పతకంతో మెరిశాడు. -
స్నేహ్కు 8 వికెట్లు
భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
జడేజా కూడా టాటా
భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్ బాటలో మరో సీనియర్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు టాటా చెప్పాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. -
సంక్షిప్తవార్తలు(6)
తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు డిస్నీ+హాట్స్టార్లో భారీస్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది.