- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rahul Dravid: ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.
బ్రిడ్జ్టౌన్: గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. అప్పుడు రోహిత్ ఆపడం వల్లే ఈ రోజు టీ20 ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదించగలుగుతున్నానని, ఇందుకు తాను అతడికి కృతజ్ఞుడినని రాహుల్ అన్నాడు. ప్రపంచకప్ విజయంతో కోచ్ పదవికి వీడ్కోలు పలికిన నేపథ్యంలో చివరగా టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూంలో జట్టు సభ్యులనుద్దేశించి రాహుల్ మాట్లాడాడు.
‘‘రోహిత్.. నవంబర్లో నాకు ఫోన్ చేసి నన్ను కొనసాగమని అన్నందుకు ధన్యవాదాలు. భారత జట్టులోని ప్రతి సభ్యుడితో కలిసి పని చేయడం ఒక గౌరవం. కానీ నా కోసం ఎంతో సమయం వెచ్చించిన రోహిత్కు ప్రత్యేక కృతజ్ఞతలు. మేమిద్దరం ఎంతో మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు అభిప్రాయాలు కలిశాయి. కొన్నిసార్లు కలవలేదు. ఇక ప్రపంచకప్ విజయానుభూతులను జట్టులో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. పరుగులు, వికెట్లు కాదు.. అనుభూతులే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఈ జట్టు చూపించిన పోరాట తత్వానికి, స్థిరత్వానికి నేను గర్విస్తా. గత కొన్నేళ్లలో కొన్ని విజయాలకు అత్యంత చేరువగా వెళ్లి విఫలం కావడం బాధ కలిగించింది. కానీ ఇప్పుడు ఆ గీత దాటాం. ప్రతి ఒక్కరూ ఈ విజయం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, మిగతా కుటుంబ సభ్యులు కూడా త్యాగాల్లో భాగమయ్యారు. ఇప్పుడు తిరిగెళ్లి వారితో సమయాన్ని ఆస్వాదించండి. నా పట్ల, నా బృందం పట్ల మీరంతా చూపించిన గౌరవం, ప్రేమాభిమానులకు కృతజ్ఞుడిని. ఒక గొప్ప జట్టు వెనుక విజయవంతమైన సంస్థ భాగస్వామ్యం ఎంతో ఉంటుంది. బీసీసీఐ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించాలి’’ అని ద్రవిడ్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
తాజా వార్తలు (Latest News)
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి