- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Jasprit Bumrah: తన పేరిట నకిలీ ఖాతా.. జస్ప్రీత్ బుమ్రా సతీమణి ఆగ్రహం!
తన పేరిట ఫేక్ అకౌంట్ను సృష్టించడంపై భారత జట్లు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రోఫీతో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కుటుంబం దిగిన ఫొటోలు ఓ నకిలీ ఖాతా ద్వారా నెట్టింట వైరల్గా మారాయి. తన పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించడంపై బుమ్రా సతీమణి సంజనా గణేశన్ (Sanjana Ganesan) తీవ్రంగా స్పందించారు. సమాచారాన్ని దొంగలించారంటూ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఫైర్ అయ్యారు.
‘‘మా కుటుంబం ఫొటోలు, సమాచారాన్ని దొంగలించి అచ్చం నా ఖాతా లాంటి మరో ఫేక్ అకౌంట్ను సృష్టించారు. వెంటనే దీన్ని తొలగించండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. ఆమె పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
సూర్య క్యాచ్ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా
కాగా.. టీ20 ప్రపంచ కప్లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన సంజనా భర్తపై ఎమోషనల్ పోస్టు చేశారు. ‘‘భారత్ జట్టు పడిన శ్రమను చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. ఈ విజయంతో భారత్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఇక నా భర్త బుమ్రా పడిన శ్రమ స్ఫూర్తిదాయకం. మీరు నా వాడని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
సముద్ర జీవులపై రోహిత్ సతీమణి పోస్టు..
హరికేన్ ప్రభావంతో బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా.. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితిపై కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే (Ritika Sajdeh) స్పందించారు. హరికేన్ సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం చూపడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సముద్ర జీవుల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి బార్బడోస్లోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!
చివరిసారిగా 1991-92 సీజన్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. ఆ తర్వాత నాలుగు లేదా మూడు టెస్టుల్లోనే తలపడుతూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో ఢీకొట్టుకోనున్నాయి. -
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి. -
‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
ఇటీవల టీమ్ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్ అనుభవించారు. -
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. -
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
-
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
-
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
-
మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం
-
రివ్యూ: వెబ్సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?