- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 World Cup: ‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
T20 World Cup: తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్నకు సంబంధించిన వార్తను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత్ను కొనియాడుతూనే.. కీలక మ్యాచ్లో తడబడే అలవాటును దక్షిణాఫ్రికా కొనసాగించిందంటూ రాసుకొచ్చాయి.
దిల్లీ: టీ20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై అంతర్జాతీయ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన తరుణంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కంగు తినిపించిన టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత కప్పు సొంతం చేసుకుందంటూ కథనాలు రాసుకొచ్చాయి. అనూహ్య మలుపులు తిరిగిన మ్యాచ్.. అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసినట్లు గుర్తుచేశాయి. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురై విజయం ముందు తలొంచినట్లు పేర్కొన్నాయి. భారత జట్టు సమష్టిగా రాణించి తమ అద్భుతమైన నైపుణ్యాలతో కప్పును ఎగరేసుకుపోయిందని పలు పత్రికలు కొనియాడాయి.
‘గేరు మార్చి భారత్కు కప్పు అందించిన కోహ్లీ’ అంటూ లండన్లోని సండే టైమ్స్ కథనం పేర్కొంది. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించలేని దక్షిణాఫ్రికా మరోసారి అదే ధోరణిని కొనసాగించిందంటూ రాసుకొచ్చింది. ‘ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరై భారత్కు కప్పు అందజేసిన దక్షిణాఫ్రికా’ అంటూ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. ‘ఒత్తిడిలోనూ రాణించి కప్పు గెలిచిన భారత్’ అంటూ ఆస్ట్రేలియాకు చెందిన ‘క్రికెట్.కామ్.ఏయూ’ మ్యాచ్ రిపోర్టును రాసింది. కీలక మ్యాచ్లలో చేతులెత్తేసే పరంపరను సౌతాఫ్రికా కొనసాగించిందని విశ్లేషించింది. కోహ్లీ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది. సరైన సమయంలో కోహ్లీ రాణించాడంటూ అతడిపై ఫాక్స్ క్రికెట్ ప్రశంసలు కురిపించింది. టోర్నమెంట్ ఆసాంతం ఇబ్బందిపడినప్పటికీ.. కీలక మ్యాచ్లో మాత్రం ఆదుకున్నాడని విశ్లేషించింది.
పాకిస్థాన్కు చెందిన డాన్ పత్రిక భారత జట్టు విజయోత్సాహాలకు సంబంధించిన ఫొటోను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. కోహ్లీ ఆటతీరును కొనియాడింది. ఆ దేశానికి చెందిన పలువురు మాజీ క్రికెటర్లు టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్శర్మ కెప్టెన్సీని షాహిద్ అఫ్రిది కొనియాడారు. కప్పు గెలవడానికి అతడు పూర్తి అర్హుడని ప్రశంసించారు.
ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనంలో మాత్రం కొంత భిన్నమైన స్వరం ధ్వనించింది. భారత విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ‘‘టీ20 ప్రపంచకప్లో భారత్ను టాప్లో నిలబెట్టిన దక్షిణాఫ్రికా తడబాటు’’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ‘‘ప్రపంచ క్రికెట్ దిగ్గజం భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్లో అన్నీ అనుకూలించాయి. దక్షిణాఫ్రికా కుప్పకూలడం, అంపైర్ల నిర్ణయాలతో ఎట్టకేలకు రోహిత్ సేన కప్పు గెలిచింది’’ అంటూ సిడ్నీ మార్నింగ్ పత్రిక రాసుకొచ్చింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. కీలక సూపర్-8 మ్యాచ్లో భారత టీమ్ ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అలవోక విజయాన్ని నమోదు చేసింది. దీన్ని జీర్ణించుకోలేకే టీమ్ఇండియాపై ఆ పత్రిక అక్కసు వెళ్లగక్కిందని క్రీడానిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
కోచ్గా ఇన్నింగ్స్ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. -
అమ్మాయిలూ చుట్టేశారు
భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి.. అనంతరం స్వల్ప ఛేదనను కొట్టేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమ్ఇండియాదే పైచేయి. -
అల్కరాస్ శుభారంభం
మూడో సీడ్ అల్కరాస్ వింబుల్డన్లో శుభారంభం చేశాడు. అయిదోసీడ్ మెద్వెదెవ్, ఎనిమిదో సీడ్ రూడ్ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తొమ్మిదో సీడ్ సకారి ముందంజ వేసింది. -
గుకేశ్ పోరు సింగపూర్లో
సొంతగడ్డపై డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్ ఆశలు ఫలించలేదు. -
కోహ్లి లేకుండా ఐసీసీ ప్రపంచకప్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సత్తా చాటినప్పటికీ అంతకుముందు విఫలమవడంతో కోహ్లీని 12 మంది సభ్యుల జట్టుకు ఐసీసీ ఎంపిక చేయలేదు. -
ఆర్సీబీతోనే కార్తీక్.. కానీ కొత్తగా
వచ్చే ఏడాది ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్టుతో కలిసి దినేశ్ కార్తీక్ కనిపించనున్నాడు. అదేంటీ.. ఈ సీజన్ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు కదా. -
నా కెరీర్ ముగించాలనే కుట్ర
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లోని లోపాలు ఎత్తి చూపినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని, రెజ్లింగ్లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారని భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ఆరోపించాడు. -
క్వార్టర్స్లో ఇంగ్లాండ్, స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్తో ఇంగ్లాండ్ త్రుటిలో పరాజయం తప్పించుకుంది. -
శ్రీలంకతో సిరీస్లో కొత్త కోచ్ బాధ్యతలు
శ్రీలంకతో సిరీస్లో భారత జట్టు కొత్త చీఫ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ నెలలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తాడని చెప్పాడు. -
పారిస్ డైమైండ్ లీగ్ నుంచి నీరజ్ ఔట్
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్కు దూరమయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బందిపడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. -
కోర్టులోనే కుప్పకూలి..
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్ జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
‘లక్ష్య’ అథ్లెట్లకు గోపీచంద్ అభినందనలు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లను బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ గోపీచంద్ అభినందించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్ కటౌట్కు అదిరిపోయే సీన్స్
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,150 ఎగువన నిఫ్టీ
-
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రూ.50 లక్షలు తీసుకుని మోసం
-
భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!
-
తమ్ముడు వైకాపా సర్పంచి.. అన్న తుళ్లూరు సీఐ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM