- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
INDw Vs SAw: మన అమ్మాయిలూ గెలిచేశారు!
దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
చెన్నై: దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్)ను 232/2 స్కోరుతో ఆరంభించిన దక్షిణాఫ్రికా.. 373 పరుగులకు ఆలౌటై భారత్కు 37 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ని టీమ్ఇండియా 9.2 ఓవర్లలో పూర్తి చేసింది. షఫాలీ వర్మ (24*), శుభా సతీష్ (13) పరుగులు చేశారు.
తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 603/6 రికార్డు స్కోరు సాధించి డిక్లేర్డ్ చేసింది. షెఫాలి వర్మ (205; 197 బంతుల్లో 23×4, 8×6) డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. స్మృతి మంధాన (149; 161 బంతుల్లో 27×4, 1×6) మరోసారి సత్తాచాటింది. రిచా ఘోష్ (86; 90 బంతుల్లో 16 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (69; 115 బంతుల్లో 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (55; 94 బంతుల్లో 8×4) కూడా రాణించారు.
ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. మారిజేన్ కాప్ (74), సునే లూస్ (65) మాత్రమే రాణించడంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్లో లారా వోల్వార్ట్ (122), సునే లూస్ (109) శతకాలు బాదగా.. నాడిన్ డిక్లెర్క్ (61) హాఫ్ సెంచరీ సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంది. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు స్నేహ్ రాణా 2, దీప్తి శర్మ 2, రాజేశ్వరి గైక్వాడ్ 2, పూజా వస్త్రాకర్, షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్.. భారత జట్టులో పలు మార్పులు
జింబాబ్వేతో త్వరలో జరగనున్న ఐదు టీ20 సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లకు భారత జట్టులో పలు మార్పులు చేశారు. -
హిట్మ్యాన్తో కోహ్లీ ఫొటో.. రోహిత్ శర్మ తల్లి ఇన్స్టా పోస్టు వైరల్
టీ20 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీ ట్రోఫీతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రోహిత్ తల్లి ఇన్స్టాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్గా మారింది. -
బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్.. బార్బడోస్ నుంచి భారత్కు రానున్న టీమ్ఇండియా
హరికేన్ కారణంగా బార్బడోస్లో చిక్కుకున్న టీమ్ఇండియా బుధవారం భారత్కు చేరుకోనుంది. బీసీసీఐ ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు ప్రయాణించనున్నారు. -
టీ20 ప్రపంచ కప్ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత
2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2026) స్వరూపాన్ని ఐసీసీ ప్రకటించింది. -
ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్
Rahul Dravid: ఆ రోజు రోహిత్ శర్మ నుంచి తనకు ఫోన్కాల్ రాకపోయి ఉంటే.. ఇంతటి ఘన చరిత్రలో తాను భాగం కాకపోయేవాడినని అన్నాడు రాహుల్ ద్రవిడ్. హెడ్ కోచ్గా తన చివరి ప్రసంగంలో ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. అందుకే పిచ్పై ఉన్న మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పిచ్పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. ఆ మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. -
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
టీ20 ప్రపంచకప్ ట్రోఫీ పట్టుకుని రోహిత్ శర్మతో కలిసి ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) వెల్లడించాడు. -
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
కోచ్గా ఇన్నింగ్స్ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. -
అమ్మాయిలూ చుట్టేశారు
భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి.. అనంతరం స్వల్ప ఛేదనను కొట్టేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమ్ఇండియాదే పైచేయి. -
అల్కరాస్ శుభారంభం
మూడో సీడ్ అల్కరాస్ వింబుల్డన్లో శుభారంభం చేశాడు. అయిదోసీడ్ మెద్వెదెవ్, ఎనిమిదో సీడ్ రూడ్ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తొమ్మిదో సీడ్ సకారి ముందంజ వేసింది. -
గుకేశ్ పోరు సింగపూర్లో
సొంతగడ్డపై డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్ ఆశలు ఫలించలేదు. -
కోహ్లి లేకుండా ఐసీసీ ప్రపంచకప్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సత్తా చాటినప్పటికీ అంతకుముందు విఫలమవడంతో కోహ్లీని 12 మంది సభ్యుల జట్టుకు ఐసీసీ ఎంపిక చేయలేదు. -
ఆర్సీబీతోనే కార్తీక్.. కానీ కొత్తగా
వచ్చే ఏడాది ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్టుతో కలిసి దినేశ్ కార్తీక్ కనిపించనున్నాడు. అదేంటీ.. ఈ సీజన్ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు కదా. -
నా కెరీర్ ముగించాలనే కుట్ర
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లోని లోపాలు ఎత్తి చూపినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని, రెజ్లింగ్లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారని భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ఆరోపించాడు. -
క్వార్టర్స్లో ఇంగ్లాండ్, స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్తో ఇంగ్లాండ్ త్రుటిలో పరాజయం తప్పించుకుంది. -
శ్రీలంకతో సిరీస్లో కొత్త కోచ్ బాధ్యతలు
శ్రీలంకతో సిరీస్లో భారత జట్టు కొత్త చీఫ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ నెలలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తాడని చెప్పాడు. -
పారిస్ డైమైండ్ లీగ్ నుంచి నీరజ్ ఔట్
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్కు దూరమయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బందిపడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. -
కోర్టులోనే కుప్పకూలిన 17 ఏళ్ల షట్లర్
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్ జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
‘లక్ష్య’ అథ్లెట్లకు గోపీచంద్ అభినందనలు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లను బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ గోపీచంద్ అభినందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 27 మంది మృతి
-
నీట్పై 26 పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం కోర్టు విచారణ
-
హీనా ఖాన్ నువ్వు వారియర్వి.. నటికి ధైర్యాన్నిచ్చిన సమంత
-
అప్పుడే హెచ్చరికలు.. అంతలోనే బాంబుల మోత.. ఖాన్ యూనిస్లో విధ్వంసం