- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IND vs SA: భారత్ సుదీర్ఘ నిరీక్షణకు తెర పడనుందా?.. సఫారీలకు తొలి టైటిలా..?
టీ20 ప్రపంచకప్ ముగింపు దశకు వచ్చేసింది. సూపర్-8, సెమీస్లను దాటేసి ఫైనల్ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో ఆ రెండు జట్లు అజేయంగా తుది పోరుకు చేరాయి. ఫైనలిస్టులు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా రావడం ఇదే తొలిసారి. పొట్టి కప్ చరిత్రలోనే మొదటిసారిగా దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరుకోగా.. రెండో కప్ను నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత్ ముంగిట 17 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికే అవకాశం నిలిచింది. ఇరు జట్ల మధ్య శనివారం ఫైనల్ జరగనుంది.
ఇరు జట్లు ఇలా..
- పొట్టి కప్లోని గ్రూప్, సూపర్-8 స్టేజ్లో భారత్ పెద్దగా ఇబ్బంది పడలేదు. సెమీస్లోనూ టఫ్ జట్టుగా భావించిన ఇంగ్లాండ్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు.
- దక్షిణాఫ్రికా పరిస్థితి అలా కాదు. సెమీస్ వరకు హేమాహేమీ టీమ్లతో తలపడి నాకౌట్కు చేరింది. ఇక్కడ మాత్రం పెద్దగా కష్టపడకుండా అఫ్గాన్పై సులువుగానే విజయం సాధించి టైటిల్ కోసం తుది పోరుకు వచ్చింది.
- భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 26 టీ20ల్లో తలపడ్డాయి. టీమ్ఇండియా 14, సౌతాఫ్రికా 11 మ్యాచుల్లో గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. గతేడాది చివర్లలో జరిగిన మ్యాచ్లో 201/7 స్కోరు చేసిన భారత్.. సఫారీ జట్టును 95 రన్స్కే ఆలౌట్ చేసింది.
- టీ20 వరల్డ్కప్ల్లోనూ ఆరుసార్లు తలపడగా.. భారత్ నాలుగింట్లో, దక్షిణాఫ్రికా రెండింట్లో గెలిచాయి. పొట్టి కప్ల్లో టీమ్ఇండియా అత్యధిక స్కోరు 186. అత్యల్ప స్కోరు 118. దక్షిణాఫ్రికా అత్యధిక స్కోరు 172 పరుగులు, అత్యల్పం 116 రన్స్.
- ఈసారి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా టాప్-5లో లేరు. కానీ, ఆ జట్టు సమష్టిగా రాణించి విజయాలు సాధించింది. సూపర్-8లోనే బలమైన విండీస్, ఇంగ్లాండ్ను అలవోకగా చిత్తు చేసింది.
- క్వింటన్ డికాక్ (204) ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. మిగతావారూ తలో చేయి వేసి మద్దతుగా నిలిచారు. మార్క్రమ్, హెండ్రిక్స్, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్తో భారత బౌలర్లకు సవాల్ తప్పదు.
- టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. నోకియా (13), రబాడ (12), షంసీ (11) ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. నోకియా నాలుగు ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు. కొత్త బౌలర్ బార్ట్మన్ కూడా జోరుమీదున్నాడు. మార్క్రమ్ పార్ట్టైమ్ స్పిన్తోనూ ఇబ్బందులే.
- దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంసీ కీలక సమయంలో వికెట్లు తీస్తున్నాడు. విండీస్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉన్నాయని తెలుసు. అతడిని ఎదుర్కోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. మన జట్టులో కుల్దీప్ కూడా ఇలాంటి ప్రదర్శనే చేస్తున్నాడు.
- రోహిత్ మరో 33 పరుగులు చేస్తే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలుస్తాడు. ప్రస్తుతం అతడు 248 పరుగులతో ఉన్నాడు. అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్ (281) ముందున్నాడు.
- టాప్ బౌలర్గా మారాలంటే అర్ష్దీప్ సింగ్కు మరో మూడు వికెట్లు కావాలి. ఫరూఖి 17 వికెట్లతో ఉండగా.. అర్ష్దీప్ 15 వికెట్లు తీశాడు. బుమ్రా 13 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై మరో అద్భుత ప్రదర్శన చేస్తే పెద్ద కష్టమేం కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్స్ రికార్డు.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు!
-
‘ఇది కదా అసలైన గురుదక్షిణ’.. టీమ్ఇండియా విజయంపై ఆనంద్ మహీంద్రా
టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న సందర్భంగా భారత జట్టును ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. -
ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే..
T20 World Cup: తీవ్ర ఉత్కంఠ మధ్య దక్షిణాఫ్రికాపై గెలుపొంది కప్పు కైవసం చేసుకుంది భారత క్రికెట్ టీమ్. ఈ పొట్టి కప్ కోసం జరిగిన తుది మ్యాచ్లో జట్టు అన్ని విభాగాల్లో రాణించింది. ఈ సందర్భంగా బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఎవరికొచ్చిందో చూద్దాం.. -
‘పిచ్’ టేస్ట్.. రోబో వాక్.. సూపర్ ఎండింగ్.. ఫన్ మూమెంట్స్!
దాదాపు పదిహేడేళ్ల తర్వాత భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో సఫారీ జట్టును ఓడించింది. -
కోచ్ ద్రవిడ్కు ఘనంగా వీడ్కోలు పలికిన టీమ్ఇండియా
దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో భారత్ విజయం సాధించి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకుంది. జట్టు గెలుపులో కోచ్ రాహుల్ ద్రవిడ్ది కీలక పాత్ర. కోచ్గా ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో.. మ్యాచ్ అనంతరం ఆయనకు టీమ్ఇండియా ఘనంగా వీడ్కోలు పలికింది.
-
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
కోహ్లీ, రోహిత్ టీ20 రిటైర్మెంట్.. ఇంతకంటే మంచి సందర్భం ఏం ఉంటుంది?: గౌతమ్ గంభీర్
భారత ప్రజలు గర్వించేలా టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ను గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
-
టీ20 ప్రపంచకప్ కైవసం.. కోహ్లీ, రోహిత్ భావోద్వేగం
టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు టీమ్ ఇండియాకు 17 ఏళ్ల నిరీక్షణ తప్పలేదు. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో విజయం సాధించి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకుంది. ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన విజయం దక్కడంతో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు.
-
‘‘ఆదర్శప్రాయమైన విజయం’’.. టీమ్ఇండియాకు ప్రధాని మోదీ ఫోన్
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న సందర్భంగా భారత జట్టును ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లతో ఆయన స్వయంగా మాట్లాడి అభినందించారు. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్
టీ20ల నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు పలికేశాడు. పొట్టి కప్ విజేతగా నిలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ స్పందించాడు. -
టీమ్ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియాకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరికి టీమ్ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు తెలిపింది.
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
ఐపీఎల్ సందర్భంగా ఎదురైనా అవమానాలను తట్టుకొని.. వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్య తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. -
గెలుపు సంబురంలో కోహ్లీ.. ఫ్యామిలీకి వీడియో కాల్!
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన ఆనందాన్ని కుటుంబంతో పంచుకున్నాడు.
-
టీమ్ఇండియా గెలుపు సంబరాలు.. అల్లరి పిల్లాడిలా మారిన రాహుల్ ద్రవిడ్!
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం జట్టు సభ్యులతో కలసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.
-
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..! -
కోహ్లీ డ్యాన్స్.. టీమ్ఇండియా ఆటగాళ్ల జోష్
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం టీమ్ సభ్యుతో కలసి విరాట్ కోహ్లీ చిందేశాడు.
-
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్, విరాట్ విజయ దరహాసం
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ట్రోఫీతో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.
-
రోహిత్ భుజాలపై కుమార్తె.. గుండె నిండా ఆనందం!
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆకర్షించింది.
-
టీమ్ఇండియా దేశ ప్రజలందరినీ గర్వించేలా చేసింది: ఆమిర్ ఖాన్ ప్రశంసలు
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియాకు ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
-
కుటుంబంతో కలిసి బుమ్రా గెలుపు సంబరాలు
టీమ్ఇండియా ఆపద్బాంధవుడు జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటాడు. తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి, ఓ వికెట్ తీసి బుమ్రా గెలుపు వైపు మళ్లించాడు. ట్రోఫీని కైవసం చేసుకున్న అనంతరం బుమ్రా తన కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: రవాణా మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
-
విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్స్ రికార్డు.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు!
-
ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలు: ఈవో రామారావు
-
‘ఇది కదా అసలైన గురుదక్షిణ’.. టీమ్ఇండియా విజయంపై ఆనంద్ మహీంద్రా
-
చనిపోయాక ‘గేట్స్’కు విరాళాలు ఉండవు - వారెన్ బఫెట్
-
స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించిన కేంద్రం