- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IND vs ENG: బ్యాటర్ల దూకుడు.. బౌలర్ల విజృంభణ.. భారత్ విజయం.. ఇవిగో వీడియోలు!
ఇంగ్లాండ్ను చిత్తు చేయడంలో టీమ్ఇండియా బ్యాటర్లతోపాటు బౌలర్ల కృషి ఉంది. ఇక ఫీల్డింగ్లోనూ మెరుపులతో అదరగొట్టేశారు.
ఇంటర్నెట్ డెస్క్: షాకింగ్ డెలివరీలతో బుమ్రా అదరగొట్టాడు. అక్షర్, కుల్దీప్ తామేం తక్కువ కాదంటూ సత్తా చాటారు. తన బ్యాటింగ్ను అనుసరించండని కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతోనే చెప్పాడు. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు భారత జట్టు ఎదుట భలే ఛాన్స్ వచ్చింది. టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) రెండో సెమీస్లో ఇంగ్లాండ్పై విజయం సాధించిన టీమ్ఇండియా ఫైనల్కు చేరింది. బ్యాటింగ్, బౌలింగ్తోపాటు ఫీల్డింగ్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి గెలిచింది. ఆ వీడియోల సమాహారం మీ కోసం..
చివరి వికెట్ దక్కిందిలా..
ఆర్చర్ను ఔట్ చేసిన బుమ్రా భారత్కు విజయం అందించాడు. అంపైర్ ఔట్ ఇచ్చినా.. ఇంగ్లాండ్ డీఆర్ఎస్కు వెళ్లింది. సమీక్షలో భారత్కు అనుకూలంగా ఫలితం వచ్చింది. ఇంగ్లాండ్ ఓడి ఇంటిముఖం పట్టింది.
సిక్స్ కొట్టి.. ఔటైన విరాట్
ప్రస్తుత ప్రపంచ కప్లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్తో మ్యాచ్లో సిక్స్ కొట్టి ఊపులోకి వచ్చాడని అంతా భావించారు. కానీ, ఆ తర్వాత బంతికే బౌల్డ్గా పెవిలియన్కు చేరాడు.
కెప్టెన్సీ ఇన్నింగ్స్ అంటే ఇదీ..
రోహిత్ శర్మ అదరగొట్టేస్తున్నాడు. కెప్టెన్గా ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. ఆసీస్పై 92 పరుగులు చేసిన అతడు.. ఇంగ్లాండ్పైనా అర్ధశతకం (57) చేసి ప్రత్యర్థి ఎదుట మంచి లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు.
ఒకే ఓవర్లో రెండు సిక్స్లు.. రెండు వికెట్లు
క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హార్దిక్ పాండ్య రెండు సిక్స్లు కొట్టాడు. మరో భారీ షాట్కు యత్నించి సామ్ కరన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన శివమ్ దూబె (0) గోల్డెన్ డక్ అయి పెవిలియన్కు చేరాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ను ఔట్ చేసిన అక్షర్ పటేల్
అప్పటివరకు దూకుడుగా ఆడిన జోస్ బట్లర్ను ఔట్ చేసిన అక్షర్ పటేల్ భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. లెగ్సైడ్ వేసిన బంతిని ఆడబోయి వికెట్ కీపర్కు బట్లర్ క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. టీమ్ఇండియా పైచేయి సాధించింది.
బుమ్రా రాక్.. ఫిల్ సాల్ట్ షాక్
బుమ్రా బౌలింగ్ చేస్తుంటే.. ఎంతటి బ్యాటరైనా జాగ్రత్తగా ఆడాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వికెట్ సమర్పించడమే తరువాయి. ఇదే అనుభవం ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్కు ఎదురైంది. బుమ్రా వేసిన ఇన్స్వింగర్ను ఆడబోయి క్లీన్బౌల్డయ్యాడు.
రివర్స్ స్వీప్ వేస్తే.. డగౌట్కే
అంతకుముందు బంతినే రివర్స్ స్వీప్ చేసి బౌండరీగా మలిచాడు. మరోసారి అదే షాట్ను ఆడేందుకు ప్రయత్నించిన ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఔటవక తప్పలేదు. కుల్దీప్ బౌలింగ్లో ఇలా జరిగిపోయింది. స్టంప్స్నే లక్ష్యంగా చేసుకుని కుల్దీప్ బౌలింగ్ సాగింది.
భారత్ సూపర్ ఫీల్డింగ్.. ఇద్దరు రనౌట్
భారత జట్టు ఫీల్డర్లు అద్భుతం చేశారు. కీలకమైన రెండు వికెట్లను రనౌట్ రూపంలో పడగొట్టారు. తొలుత లివింగ్స్టోన్ ఈవిధంగా ఔట్ కాగా.. కాసేపటికే అదిల్ రషీద్ పెవిలియన్కు చేరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
మన అమ్మాయిలూ గెలిచేశారు!
దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది -
ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Dravid: టీమ్ఇండియా కోచ్ పదవి నుంచి దిగిపోయిన రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక నిరుద్యోగినన్నాడు. -
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
ఈ సీజన్ అనంతరం ఐపీఎల్కు వీడ్కోలు పలికిన దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సరికొత్త అవతారంలో ఆర్సీబీకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. -
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
బెరిల్ హరికేన్ ఎఫెక్ట్ టీమ్ఇండియాపై పడింది. ఈ హరికేన్ కారణంగా భారత జట్టు స్వదేశానికి ఆలస్యంగా రానుంది. -
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
జులై నెలాఖరులో టీమ్ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు కొత్త హెడ్ కోచ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
ఈ టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. -
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంపై అతడి సతీమణి ఎమోషనల్ అయ్యారు. అటు భార్య అనుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. -
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
T20 World Cup: తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్నకు సంబంధించిన వార్తను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత్ను కొనియాడుతూనే.. కీలక మ్యాచ్లో తడబడే అలవాటును దక్షిణాఫ్రికా కొనసాగించిందంటూ రాసుకొచ్చాయి. -
ఎందుకింత ఉద్వేగం!
దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్ మాత్రం దక్కడం లేదు. సెమీస్లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం. -
రూ.125 కోట్లు.. ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. -
ఈ కప్ అందరిదీ
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది. -
ఈ ప్రపంచకప్ వేరయా..
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. -
జకోవిచ్ సాధిస్తాడా?
సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) అదరగొట్టారు. జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్ రజత పతకంతో మెరిశాడు. -
స్నేహ్కు 8 వికెట్లు
భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
జడేజా కూడా టాటా
భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్ బాటలో మరో సీనియర్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు టాటా చెప్పాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. -
సంక్షిప్తవార్తలు(6)
తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు డిస్నీ+హాట్స్టార్లో భారీస్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది.