- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kedar Jadhav: క్రికెట్కు జాదవ్ వీడ్కోలు
భారత క్రికెట్ మాజీ ఆటగాడు కేదార్ జాదవ్ ఆటకు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల క్రితం చివరిగా టీమ్ఇండియాకు ఆడిన ఈ 39 ఏళ్ల మిడిలార్డర్ బ్యాటర్.. సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు.
పుణె: భారత క్రికెట్ మాజీ ఆటగాడు కేదార్ జాదవ్ ఆటకు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల క్రితం చివరిగా టీమ్ఇండియాకు ఆడిన ఈ 39 ఏళ్ల మిడిలార్డర్ బ్యాటర్.. సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘‘కెరీర్ ఆసాంతం ఎంతో మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రిటైర్ అయినట్లు భావించండి’’ అని 2020లో మహేంద్రసింగ్ ధోని మాదిరిగానే జాదవ్ ట్వీట్ చేశాడు. 2015 రాంచీలో శ్రీలంకపై వన్డేతో అరంగేట్రం చేసిన జాదవ్.. చివరిగా 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్పై వన్డే రూపంలో ఆఖరి మ్యాచ్ ఆడాడు. జాదవ్ 73 వన్డేలు, 9 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు సహా 1389 పరుగులు చేసిన అతడు.. ఆఫ్ స్పిన్ బౌలింగ్తో 27 వికెట్లు కూడా తీశాడు. టీ20ల్లో 122 పరుగులే చేశాడు. 2017లో ఇంగ్లాండ్పై పుణెలో జరిగిన వన్డేలో 76 బంతుల్లోనే 120 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. ఈ మ్యాచ్లో 351 పరుగుల ఛేదనలో భారత్ 63/4తో కష్టాల్లో ఉన్నప్పుడు.. కోహ్లి (122)తో కలిసి అయిదో వికెట్కు 200 పరుగులు జత చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ వారసుడెవరు?
ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్.. మళ్లీ ఇప్పుడు భారత్ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్బై చెప్పాడు రోహిత్ శర్మ. -
అంతా కలలాగే..
టీ20 ప్రపంచకప్ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు. -
ఆ రోజు నన్నాపింది రోహితే
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
వందలో మరో చిరుత
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. -
వింబుల్డన్ ఛాంపియన్కు చెక్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది. -
క్వార్టర్స్లో ఫ్రాన్స్
ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు యూరో 2024 క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. -
భారత జట్టులో సాయి, జితేష్
యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. -
పారిస్ ఒలింపిక్స్లో జ్యోతి!
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్ కోటాలో జ్యోతి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.