- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ZIM vs IND: జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ జట్టు జింబాబ్వేతో ఐదు టీ20ల(ZIM vs IND) సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పుడంటే జింబాబ్వే గొప్ప ప్రదర్శన చేయడం లేదు కానీ గతంలో ‘పసికూన’గా ఉంటూనే అద్భుతాలు సృష్టించిన చరిత్ర ఉంది. అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లతో బలమైన జట్లకూ గట్టిపోటీనిచ్చేది. జింబాబ్వే-భారత్ ఇప్పటి వరకు మూడు ద్వైపాక్షిక సిరీసుల్లో తలపడ్డాయి. మొత్తం 8 టీ20లు ఇరు జట్ల మధ్య జరిగాయి. ఆరు మ్యాచుల్లో భారత్ గెలిచింది. రెండింట్లో జింబాబ్వే విజయం సాధించింది.
2010లో తొలిసారి..
జింబాబ్వేతో వారి సొంతమైదానాల్లో భారత్ ((Team India) తొలిసారి 2010లో రెండు టీ20ల సిరీస్ ఆడింది. టీమ్ఇండియానే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. సురేశ్ రైనా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. రోహిత్, విరాట్ కూడా జట్టులో సభ్యులే. తొలి మ్యాచ్లో యూసఫ్ పఠాన్ (37*) అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడు. ఇక రెండో మ్యాచ్లోనూ సురేశ్ రైనా (72*) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కాయి. ఈ సిరీస్లో జింబాబ్వే నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు.
సిరీస్ సమం..
దాదాపు ఐదేళ్ల తర్వాత జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు భారత్ వెళ్లింది. 2015లో మళ్లీ రెండు టీ20ల సిరీస్ జరిగింది. ఈసారి గట్టి పోటీనిచ్చింది. చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేయడం గమనార్హం. ఈ సిరీస్కు అజింక్య రహానె కెప్టెన్గా వ్యవహరించాడు. తొలి మ్యాచ్లో భారత్ 179 పరుగులను నిర్దేశించగా.. జింబాబ్వే 124 పరుగులకే పరిమితమైంది. అక్షర్ పటేల్ (3/17) అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక రెండో మ్యాచ్లో జింబాబ్వే సూపర్ విక్టరీ సాధించి భారత్ను మట్టికరిపించింది. 146 పరుగుల టార్గెట్ను ఛేదించడంలో టీమ్ఇండియా విఫలమైంది.అప్పటి జట్టులోని సభ్యుడు సికందర్ రజా ఇప్పుడు జింబాబ్వే సారథిగా బరిలోకి దిగుతున్నాడు.
మూడో సిరీస్.. భారత్దే
భారత్-జింబాబ్వే జట్ల మధ్య మూడో సిరీస్ 2016లో జరిగింది. ధోనీ (MS Dhoni) నాయకత్వంలో మూడు టీ20ల సిరీస్ను టీమ్ఇండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అనూహ్యంగా తొలి మ్యాచ్లోనే జింబాబ్వే గెలిచి షాక్ ఇచ్చేలా కనిపించింది. రెండో టీ20లో భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే కుదేలైంది. బరిందర్ శ్రాన్ (4/10) దెబ్బకు ఆతిథ్య జట్టు 99/9కే పరిమితమైంది. నిర్ణయాత్మక మూడో టీ20లో జింబాబ్వే నుంచి పోటీ ఎదురైంది. కేదార్ జాదవ్ (58) రాణించడంతో తొలుత భారత్ ఆరు వికెట్లకు 138 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే కూడా 135/6 స్కోరు చేసింది. కొద్ది తేడాతో మ్యాచ్తోపాటు సిరీస్ను కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2022లో..
టీ20 ప్రపంచ కప్ 2022 (T20 World Cup) ఎడిషన్లో జింబాబ్వేపై భారత్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత భారత్ 186/5 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (61*: 25 బంతుల్లో) విజృంభించాడు. అనంతరం జింబాబ్వే 115 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ (3/22) జింబాబ్వే పతనంలో కీలక పాత్ర పోషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ - కోహ్లీ బదులు వీళ్లే.. ఇంట్రెస్టింగ్గా మూడో ప్లేయర్ స్థానం?
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీలా నిలిచే ఆ ఇద్దరు ఎవరంటే? ఈనాడు.నెట్ పాఠకులు చెప్పిన సమాధానం ఇదీ.. -
విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్
టీమ్ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. -
ప్రధాని మోదీకి టీమ్ఇండియా ‘జెర్సీ’ బహూకరణ.. నంబర్ ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీని పొట్టి కప్ విజేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు భారత జెర్సీని అందించారు. మోదీతో భేటీ కావడంపై క్రికెటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
స్వదేశానికి టీమ్ఇండియా.. భారత స్టార్లు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారంటే?
టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమ్ఇండియా స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నారు. -
మొన్న ఆర్మీ ట్రైనింగ్.. ఇప్పుడు పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్పై ట్రోలింగ్
పాకిస్థాన్ క్రికెట్ మేనేజ్మెంట్ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆర్మీ ట్రైనింగ్ అంటూ హంగామా చేసి పొట్టి కప్లో దారుణ పరాభవంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. -
కోహ్లీ ‘ఫిట్నెస్’ చూశాక.. పోటీపడలేమనుకున్నా: సూర్యకుమార్
ఫిట్నెస్ విషయంలో విరాట్ను అందుకోవడం చాలా కష్టమని భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. -
ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ
వరల్డ్ కప్తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు అపూర్వ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
వరల్డ్ కప్తో కెప్టెన్ రోహిత్ డ్యాన్స్ అదుర్స్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డ్యాన్స్తో అలరించాడు. వరల్డ్ కప్తో టీమ్ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయం బయట అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ వేశాడు.
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
పొట్టి కప్ను నెగ్గిన భారత ఆటగాళ్లు ఎట్టకేలకు స్వదేశానికి చేరారు. వారికి ఘనస్వాగతం లభించింది. దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు, అధికారుల మధ్య ప్లేయర్లు డ్యాన్సులతో కాసేపు హంగామా చేశారు. -
1983 TO 2024.. టీమ్ఇండియా ‘ప్రపంచ కప్’ల సంబురం
తొలిసారి 1983లో వన్డే ప్రపంచ కప్ను గెలిచిన టీమ్ఇండియా.. తాజాగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేసి సగర్వంగా ఇంటికి తిరిగొచ్చింది.
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
T20 World Cup: 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం దిల్లీలో అడుగు పెట్టిన రోహిత్ సేన.. అక్కడే ప్రధానితో సమావేశం కాబోతోంది. -
ఆల్రౌండర్ నం.1 హార్దిక్
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. -
అదరగొట్టిన అల్కరాస్
టైటిల్ ఫేవరెట్ మూడో సీడ్ కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. అతను అలవోకగా మూడో రౌండ్ చేరాడు. అయిదో సీడ్ మెద్వెదెవ్ రెండో రౌండ్ను అధిగమించగా.. ఎనిమిదో సీడ్ రూడ్కు ఫోగ్నిని షాకిచ్చాడు. -
క్వార్టర్స్లో తుర్కియే
తొలి నిమిషంలో గోల్.. ఆఖరి సెకన్లలో అద్భుత సేవ్తో తుర్కియే యూరో కప్ ఫుట్బాల్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఆ జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. -
కొత్త సవాల్ను అధిగమించాం
ప్రపంచ బ్యాడ్మింటన్లో ఎదురవుతున్న కొత్త సవాల్ను అధిగమించినట్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం తెలిపింది. -
మార్చి 1న భారత్, పాక్ పోరు!
అసలు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందో లేదో తెలియదు, జరిగితే టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్థాన్లో భారత్ పర్యటిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు గానీ.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ముహూర్తం ఖరారైపోయింది. -
అది తప్పుకోవడం కాదు
పారిస్ డైమండ్ లీగ్ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్పష్టత ఇచ్చాడు. -
బాయ్కాట్కు మళ్లీ క్యాన్సర్
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ రెండోసారి గొంతు క్యాన్సర్ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
మోదీవే అసత్య ప్రకటనలు.. చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
-
అందుకే భోలే బాబాను ఇంకా అరెస్టు చేయలేదు: పోలీసులు
-
‘నీట్ను రద్దు చేయొద్దు’ - సుప్రీం కోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు
-
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
-
జగన్ జైలుకు పోయే సమయం ఆసన్నమైంది: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి