- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IND Vs ENG Semifinal: అలా ఆడడంపైనే మా దృష్టి.. ఇంగ్లాండ్తో సెమీస్పై కెప్టెన్ రోహిత్
IND Vs ENG Semifinal: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్-2లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో అనుసరించే వ్యూహాల సహా పలు అంశాలపై కెప్టెన్ రోహిత్ మాట్లాడాడు.
జార్జ్టౌన్: టీ20 ప్రపంచకప్ కీలక దశకు చేరుకుంది. నేడు జరగనున్న సెమీస్-2లో ఇంగ్లాండ్తో తలపడేందుకు భారత్ (IND Vs ENG Semifinal) సిద్ధమైంది. 2022 సెమీస్లోనూ ఇంగ్లాండ్తోనే ఆడిన భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. దీంతో భారత్పై ఈసారి తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. కూల్గా ఉంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడడంపైనే దృష్టి సారించామని మీడియా సమావేశంలో తెలిపాడు.
పరిస్థితులేమీ మారలేదు..
చివరి వరల్డ్కప్లో ఇంగ్లాండ్తో తలపడినప్పటితో పోలిస్తే పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ లేదని రోహిత్ (Rohit Sharma) అన్నాడు. 2014 తర్వాత ఆడిన ఐసీసీ టోర్నీల్లో భారత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ఒత్తిడితో పాటు అదృష్టం కలిసిరాకపోవడం కూడా కారణమని వివరించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరగబోయే సెమీస్ను ఒక సాధారణ మ్యాచ్లాగే భావించనున్నట్లు తెలిపాడు. ఏ సందర్భంలో ఆడుతున్నాం? మున్ముందు పరిస్థితేంటి? అనే అంశాలను అసలు పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరికీ ఇది సెమీ-ఫైనల్ గేమ్ అని తెలిసినప్పటికీ.. దాని గురించి పదే పదే ఆలోచించబోమని వివరించాడు. జట్టులో ప్రతిఒక్కరూ ఇదే ధోరణితో ఉన్నారని వెల్లడించాడు. అతిగా ఆలోచించడం వల్ల ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించాడు.
అలా అయితే సరైన నిర్ణయాలు తీసుకోలేం..
‘‘జట్టుగా మేం బాగా ఆడుతున్నాం. సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఒకరి విజయాన్ని మరొకరం ఎంజాయ్ చేస్తున్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం చేస్తూ వచ్చిందే ఇప్పుడూ అనుసరిస్తాం. కొన్ని సందర్భాల్లో మేం ఒత్తిడికి గురైన మాట వాస్తవమే. కానీ, దాన్నుంచి వేగంగా బయటకొచ్చాం. బహుశా ఏం జరుగుతుందో అని పెద్దగా ఆలోచించకపోవడమే అందుకు కారణం. అతిగా ఆలోచించడం వల్ల ఫీల్డ్లో సరైన నిర్ణయాలు తీసుకోలేం. అందుకే ఫీల్డ్లో ఏం చేయాలనే విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండడం చాలా ముఖ్యం. ఇప్పటికే ఈ విషయంపై ప్లేయర్లతో తగినంత చర్చ జరిగింది’’ అని రోహిత్ వివరించాడు.
ఫైనల్కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా.. అఫ్గాన్పై అలవోక విజయం
ప్లేయర్ల నిర్ణయమే..
‘‘ఆట ఎలా సాగుతుందనేది చివరగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇలా చెప్పడం బోరింగ్గానే ఉన్నప్పటికీ.. వాస్తవం మాత్రం అదే. ఎలా ఆడాలన్నది ఆయా ప్లేయర్ల అనుభవంపై ఆధారపడి ఉంటుంది. రివర్స్ స్వీప్ ఆడాలా? యార్కర్లు సంధించాలా? బౌన్సర్లు వేయాలా.. అనేది ఆయా ప్లేయర్లు, వాళ్ల నిర్ణయాలను బట్టి ఉంటుంది’’ అని రోహిత్ (Rohit Sharma) తెలిపాడు.
కూల్గా ఉంటా..
‘‘గత కెప్టెన్లతో పోలిస్తే ఎలా వ్యవహరించబోతున్నారని అంబటి రాయుడు అడిగిన ప్రశ్నకు రోహిత్ (Rohit Sharma) ఈ సందర్భంగా బదులిచ్చాడు. ‘‘ఫీల్డ్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది నేనే. కూల్గా ఉండడం చాలా ముఖ్యం. ఏళ్లుగా అదే చేస్తున్నా. కానీ, కొన్నిసార్లు సహనం కోల్పోవాల్సి వస్తుంటుంది. దాని వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. ఈసారి అలా కాకుండా చూసుకుంటా’’ అని రోహిత్ వివరించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ప్లేయర్లంతా చాలా విశ్వాసంతో ఆడారని తెలిపాడు. బ్యాటర్లు, బౌలర్లు తమ ప్రణాళికలను చక్కగా అమలు చేశారన్నాడు. అదే ఆటతీరును ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామని వెల్లడించాడు.
2022 సెమీస్లో ఇలా..
గత టీ20 ప్రపంచకప్ సెమీస్లోనూ ఇంగ్లాండ్తోనే ఆడిన భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తయింది. ఆ మ్యాచ్లో మొదట భారత్ 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య (63), కోహ్లి (50) రాణించారు. జోర్డాన్ (3/43) భారత్ను దెబ్బకొట్టాడు. ఛేదనలో టీమ్ఇండియా బౌలర్లు తేలిపోవడంతో ఇంగ్లాండ్ ఒక్క వికెట్టూ కోల్పోకుండా 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్ (80 నాటౌట్), హేల్స్ (86 నాటౌట్) జట్టును గెలిపించారు. అప్పుడు లేని బుమ్రా, జడేజా, కుల్దీప్తో ఇప్పుడు టీమ్ఇండియా బౌలింగ్ దుర్భేద్యంగా మారింది. బ్యాటింగ్లోనూ లోతు పెరిగింది. అప్పటి హేల్స్, స్టోక్స్, వోక్స్ ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో లేరు. అయినా పటిష్ఠంగానే ఉన్న ప్రత్యర్థిని అత్యుత్తమ ఆటతీరుతో అడ్డుకోవాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
టీ20 ప్రపంచ కప్ సంగ్రామం తుది పోరుకు వేళైంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టైటిల్ వేట జరగనుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. -
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. -
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
రెండోసారి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకొనే అద్భుతమైన అవకాశం టీమ్ఇండియాకు వచ్చింది. దక్షిణాఫ్రికాతో కీలక పోరు జరగనుంది. -
మ్యాచ్ను ‘బ్రాడ్కాస్టింగ్’ గెలిపించదు కదా..: మైకెల్ వాన్కు గంగూలీ కౌంటర్
టీ20 ప్రపంచ కప్లో భారత్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తట్టుకోలేకపోతున్నాడు. టీమ్ఇండియా విజయాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానికి మాజీ క్రికెటర్లు గట్టిగా బదులిచ్చారు. -
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
టీమ్ఇండియా సారథి రోహిత్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రా నుంచి మాజీ క్రికెటర్ల వరకు రోహిత్ నాయకత్వం గురించి ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
టైటిల్ను దక్కించుకోవాలని రెండు జట్లు సిద్ధం.. కానీ, వరుణుడు కూడా ఆడేస్తానంటూ పలకరింపులు.. ఇప్పుడు బార్బడోస్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. -
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
రాహుల్ ద్రవిడ్ కోసం కప్ గెలవాలనే ట్రెండింగ్పై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
టెస్టు క్రికెట్లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
-
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు
-
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ
-
ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు