- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ICC T20I Rankings: నంబర్ వన్గా హార్దిక్ పాండ్య.. 12 స్థానాలు ఎగబాకిన బుమ్రా
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య (Hardik Pandya) అగ్ర స్థానంలో నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో నంబర్ వన్గా నిలిచాడు. ప్రపంచ కప్లో బంతితో, బ్యాట్తో అదరగొట్టిన పాండ్య రెండు స్థానాలు మెరుగుపర్చుకుని శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగ (222 పాయింట్లు)తో కలిసి హార్దిక్ అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో ఆల్రౌండర్ల కేటగిరీలో నంబర్ వన్గా నిలిచిన తొలి భారత క్రికెటర్గా హార్దిక్ రికార్డు సృష్టించాడు. ఇక తాజా ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో మార్కస్ స్టాయినిస్ (ఆస్ట్రేలియా), సికిందర్ రజా (జింబాబ్వే), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఒక్కో స్థానం మెరుగై వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అఫ్గానిస్థాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ నాలుగు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోయాడు.
హార్దిక్ పాండ్య ఈ పొట్టి కప్లో ఆరు ఇన్నింగ్స్ల్లో 151.57 స్ట్రైక్ రేట్తో 144 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. 8 మ్యాచ్ల్లో 7.64 ఎకానమీ రేటుతో 11 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో (3/20) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ను ఔట్ చేసి భారత్ రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్లో భారత్ గెలిచిన తర్వాత పాండ్య భావోద్వేగానికి గురయ్యాడు.
బుమ్రా 12.. అర్ష్దీప్ 13
బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియా ఏడు స్థానాలు ఎగబాకి రెండో స్థానం దక్కించుకున్నాడు. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ ఒక స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానంలో, కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు మెరుగై ఎనిమిదో స్థానంలో నిలిచారు. టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు. 2020 చివర నుంచి బుమ్రాకిదే బెస్ట్ ర్యాంకు. పొట్టి కప్లో 17 వికెట్లు పడగొట్టిన అర్ష్దీప్ సింగ్ నాలుగు స్థానాలు మెరుగై 13వ స్థానం దక్కించుకున్నాడు. అర్ష్దీప్కు టీ20 కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంకు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి. -
‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
ఇటీవల టీమ్ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్ అనుభవించారు. -
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. -
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!