- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20WC 2024: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
ఈ టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసింది. లీగ్ దశ నుంచి ఓటమి ఎరగకుండా వరుస విజయాలు సాధించిన టీమ్ఇండియా (Team India) ఫైనల్ వరకు అదే దూకుడు కొనసాగించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత జట్టు ఏడు పరుగుల తేడాతో ఓడించి 17 ఏళ్ల తర్వాత రెండోసారి పొట్టి కప్ను ముద్దాడింది. ఫైనల్ మ్యాచ్ ముగియడంతో ఈ ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన ఈ జట్టు ప్లేయింగ్ ఎలెవన్లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. ఆసక్తికర విషయం ఏంటంటే ప్రపంచ కప్ రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు నుంచి ఒక్కరికి కూడా ఇందులో చోటు దక్కలేదు. ఐసీసీ జట్టులో 12వ ఆటగాడిగా దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియాను తీసుకున్నారు.
భారత్ నుంచి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ ఐసీసీ టీమ్కు ఎంపికయ్యారు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని ఈ టీమ్లోకి తీసుకోలేదు. అతడు టోర్నీలో వరుస మ్యాచ్ల్లో విఫలమైనా.. టైటిల్ పోరులో అదరగొట్టాడు.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టీ20 వరల్డ్ కప్ 2024
- రోహిత్ శర్మ - పరుగులు: 257, సగటు: 36.71, స్ట్రైక్ రేట్: 156.7, అర్ధశతకాలు: 3
- రహ్మానుల్లా గుర్బాజ్ - పరుగులు: 281, సగటు: 35.12, స్ట్రైక్-రేట్: 124.33, అర్ధశతకాలు: 3
- నికోలస్ పూరన్ - పరుగులు: 228, సగటు: 38.0, స్ట్రైక్-రేట్: 146.15, అర్ధశతకాలు: 1
- సూర్యకుమార్ యాదవ్ - పరుగులు: 199, సగటు: 28.42, స్ట్రైక్-రేట్: 135.37, అర్ధశతకాలు: 2
- మార్కస్ స్టాయినిస్ - పరుగులు: 169, స్ట్రైక్-రేట్: 164.07, వికెట్లు: 10, ఎకానమీ: 8.88
- హార్దిక్ పాండ్య - పరుగులు: 144, స్ట్రైక్-రేట్: 151.57, వికెట్లు: 11, ఎకానమీ: 7.64
- అక్షర్ పటేల్ - పరుగులు: 92, స్ట్రైక్-రేట్: 139.39, వికెట్లు: 9, ఎకానమీ: 7.86
- రషీద్ ఖాన్ - వికెట్లు: 14, సగటు: 12.78, ఎకానమీ: 6.17, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 4/17
- జస్ప్రీత్ బుమ్రా - వికెట్లు: 15, సగటు: 8.26, ఎకానమీ: 4.17, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 3/7
- అర్ష్దీప్ సింగ్ - వికెట్లు: 17, సగటు: 12.64, ఎకానమీ: 7.16, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 4/9
- ఫజల్ హక్ ఫారూఖీ - వికెట్లు: 17, సగటు: 9.41, ఎకానమీ: 6.31, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 5/9
- అన్రిచ్ నోకియా (12వ ఆటగాడు) - వికెట్లు: 15, సగటు: 13.4, ఎకానమీ: 5.74, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 4/7
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. అందుకే పిచ్పై ఉన్న మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పిచ్పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. ఆ మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. -
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
టీ20 ప్రపంచకప్ ట్రోఫీ పట్టుకుని రోహిత్ శర్మతో కలిసి ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) వెల్లడించాడు. -
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
కోచ్గా ఇన్నింగ్స్ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. -
అమ్మాయిలూ చుట్టేశారు
భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి.. అనంతరం స్వల్ప ఛేదనను కొట్టేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమ్ఇండియాదే పైచేయి. -
అల్కరాస్ శుభారంభం
మూడో సీడ్ అల్కరాస్ వింబుల్డన్లో శుభారంభం చేశాడు. అయిదోసీడ్ మెద్వెదెవ్, ఎనిమిదో సీడ్ రూడ్ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తొమ్మిదో సీడ్ సకారి ముందంజ వేసింది. -
గుకేశ్ పోరు సింగపూర్లో
సొంతగడ్డపై డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్ ఆశలు ఫలించలేదు. -
కోహ్లి లేకుండా ఐసీసీ ప్రపంచకప్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సత్తా చాటినప్పటికీ అంతకుముందు విఫలమవడంతో కోహ్లీని 12 మంది సభ్యుల జట్టుకు ఐసీసీ ఎంపిక చేయలేదు. -
ఆర్సీబీతోనే కార్తీక్.. కానీ కొత్తగా
వచ్చే ఏడాది ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్టుతో కలిసి దినేశ్ కార్తీక్ కనిపించనున్నాడు. అదేంటీ.. ఈ సీజన్ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు కదా. -
నా కెరీర్ ముగించాలనే కుట్ర
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లోని లోపాలు ఎత్తి చూపినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని, రెజ్లింగ్లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారని భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ఆరోపించాడు. -
క్వార్టర్స్లో ఇంగ్లాండ్, స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్తో ఇంగ్లాండ్ త్రుటిలో పరాజయం తప్పించుకుంది. -
శ్రీలంకతో సిరీస్లో కొత్త కోచ్ బాధ్యతలు
శ్రీలంకతో సిరీస్లో భారత జట్టు కొత్త చీఫ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ నెలలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తాడని చెప్పాడు. -
పారిస్ డైమైండ్ లీగ్ నుంచి నీరజ్ ఔట్
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్కు దూరమయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బందిపడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. -
కోర్టులోనే కుప్పకూలిన 17 ఏళ్ల షట్లర్
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్ జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
‘లక్ష్య’ అథ్లెట్లకు గోపీచంద్ అభినందనలు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లను బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ గోపీచంద్ అభినందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
-
రెవెన్యూ రికవరీ యాక్ట్తో వైకాపా నేతల అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
-
ఆ యాప్స్లో కరెంట్ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!
-
అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్లో భారతీయులకు జైలు
-
కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష