T20 WC 2024 Final: విశ్వవిజేత.. భారత్‌కు దక్కిన ప్రైజ్‌మనీ ఎంతంటే?

టీ20ప్రపంచ కప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. మన జట్టుకు భారీ మొత్తంలోనే ప్రైజ్‌మనీ దక్కింది.

Updated : 30 Jun 2024 09:48 IST

ఇంటర్నెట్ డెస్క్: పదకొండేళ్ల తర్వాత భారత్‌ ఖాతాలోకి ఐసీసీ ట్రోఫీ చేరింది. చివరిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2007 పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రోహిత్‌ కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024)లో విశ్వవిజేతగా భారత్‌ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. విజేత భారత్‌కు, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు భారీ మొత్తంలోనే ప్రైజ్‌మనీ దక్కింది. సెమీస్‌లో నిష్క్రమించిన జట్లకూ ఐసీసీ ప్రైజ్‌మనీని అందించింది. 

ప్రైజ్‌మనీ వివరాలు (దాదాపు) ఇలా.. 

  • విజేత: భారత్‌కు రూ. 20.50 కోట్లు
  • రన్నరప్‌: దక్షిణాఫ్రికాకు రూ. 10.60 కోట్లు
  • సెమీఫైనలిస్టులు: ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌కు చెరో రూ. 6.50 కోట్లు 
  • సూపర్‌-8కు చేరిన 12 జట్లు: ఒక్కో టీమ్‌కు రూ. 2 కోట్లు
  • 13 నుంచి 20వ స్థానంలోని ఒక్కో టీమ్‌కు రూ.1.90 కోట్లు
  • ప్రతి జట్టు విజయం సాధించిన మ్యాచ్‌కు అదనంగా రూ. 26 లక్షలు 
  • టీ20 ప్రపంచ కప్‌ ప్రైజ్‌మనీ మొత్తం విలువ రూ. 93.80 కోట్లు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని