- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Bumrah: బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం..
ఇంటర్నెట్డెస్క్: ‘‘బ్యాటర్లు మ్యాచ్లు గెలిపిస్తే.. బౌలర్లు టోర్నమెంట్లను అందిస్తారు’’ ఇది క్రికెట్ సర్కిల్స్లో తరచు వినిపించే నానుడి. పొట్టి ప్రపంచకప్లో ఇదే నిజమని తేలింది. సాధారణంగా ఈ ఫార్మాట్ బ్యాటర్లది. కానీ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు మాత్రం టీమ్ ఇండియా ఏస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను వరించింది. పోనీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీశాడా..? అంటే కాదు.. అతడి కంటే ముందు స్థానాల్లో అర్ష్దీప్, ఫరూఖీ ఉన్నారు. మరి బుమ్రాను ఈ అవార్డు ఎలా వరించింది అంటే పొదుపైన బౌలింగ్.
పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే పొదుపరిగా..
భారత్ స్క్వాడ్లో అతడు ఉంటే ప్రత్యర్థికి కొన్ని ఓవర్లు కోతపడినట్లే. ఎందుకంటే అతడు వేసే తూటాల్లాంటి బంతుల్లో సగం ఆడలేక బ్యాటర్లు చేతులెత్తేస్తారు. పొట్టి ప్రపంచకప్ ఎడిషన్లో కనీసం 20 ఓవర్లు వేసిన వారిలో అత్యంత పొదుపైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే. సాధారణంగా టీ20ల్లో బౌలర్కు 6 ఎకానమీ ఉంటే గొప్ప. అలాంటిది బుమ్రాకు 4.17. అంటే ప్రత్యర్థులను ఏ స్థాయిలో ముప్పుతిప్పలు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో 8 మ్యాచ్ల్లో 178 బంతులు వేయగా.. వాటిల్లో 110 డాట్ బాల్సే. ఇక 124 పరుగులే ఇచ్చాడు. వీటిల్లో రెండు మెయిడిన్లు. 15 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్స్లో డాట్బాల్స్తో మ్యాచ్ను తిప్పేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత పొదుపైన బౌలర్గా నిలిచాడు.
ప్రత్యేకమైన యాక్షన్..
షార్ట్ రనప్తో జస్సీ బౌలింగ్ యాక్షన్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. అతడు దానిని టీవీల్లో చూసి స్వయంగా నేర్చుకొన్నాడు. ఎవరూ చెప్పింది కాదు. బుమ్రా తండ్రి ఏడేళ్ల వయస్సులోనే చనిపోవడంతో తల్లి దల్జిత్ అతడిని పెంచింది. ఆమె అహ్మదాబాద్ వద్ద వస్త్రపుర్లోని నిర్మాన్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్. ఆ పాఠశాల కోచ్లు కిశోర్ త్రివేది, కెతుల్ పురోహిత్ నెట్స్లో బుమ్రా బౌలింగ్ యాక్షన్ చూశారు. అతడికి శిక్షణ ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మారు. కేవలం లైన్అండ్లెంగ్త్పై అతడు దృష్టిపెడితే చాలని భావించారు. బౌలింగ్ యాక్షన్ మార్చవద్దని మాత్రం సలహా ఇచ్చారు. శిక్షణలో అతడి యార్కర్లు మరింత పదును తేలాయి. అప్పట్లో ఐపీఎల్ ఆటగాడు సిద్ధార్థ్ నుంచి సూచనలు లభించాయి. స్థానిక టోర్నమెంట్లలో గంటకు 140 కిమీ వేగంతో అదరగొట్టడం మొదలుపెట్టాడు.
అమ్మకు ఇష్టం లేకపోయినా..
తల్లి దల్జిత్కు మాత్రం జస్సీ క్రికెట్ ఆడటం అంటే ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ, కోచ్ త్రివేది, పురోహిత్ నచ్చజెప్పారు. దీంతో రెండేళ్లపాటు క్రికెట్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం కఠినంగా సాధన చేసిన బుమ్రా 19 ఏళ్ల వయస్సులో నాటి ముంబయి ఇండియన్ కోచ్ జాన్రైట్ కంటపడ్డాడు. తమ లీగ్ జట్టుకు ఎంపిక చేశారు.
కానీ, అతడు జిల్లా అండర్-19 జట్టుకు మాత్రం రిజర్వుగానే ఎంపికయ్యాడు. అతడి విభిన్న బౌలింగ్ యాక్షన్ కారణంగా బెంచ్కు పరిమితం చేశారు. ఎట్టకేలకు ఓ మ్యాచ్లో అవకాశం రావడంతో ఏకంగా ఏడు వికెట్లు సాధించినట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన అనిల్పటేల్ వెల్లడించారు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఐపీఎల్లో ముంబయి తరఫున ఆర్సీబీపై పోరుకు బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్లోనే విరాట్ సహా ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత సీజన్కు అతడిని ముంబయి కొనసాగించింది. అందరు ఆటగాళ్లు రంజీ ఆడి తర్వాత లీగ్లోకి వస్తారు. కానీ, జస్సీ లీగుల్లోకి వచ్చాక రంజీ జట్టుకు ఆడాడు.
2015-16లో విజయ్ హజారే ట్రోఫీలో ఓ అంపైర్ జస్సీ బౌలింగ్ యాక్షన్పై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. దీంతో గుజరాత్ టీమ్ మేనేజ్మెంట్ అతడికి అండగా నిలిచింది. కొన్నాళ్లకే టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో సభ్యుడయ్యాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. మూడు ఫార్మాట్లలో కలిపి 397 వికెట్లు సాధించాడు. మొత్తం 13,271 బంతులు వేసి..8,379 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఒరిజనల్ అలానే ఉంది..
బుమ్రా టీమ్ ఇండియాకు అపురూపమైన బౌలర్. అతడి బౌలింగ్ యాక్షన్ మార్చేందుకు ఏ కోచ్ యత్నించలేదు. బంతి వేయడానికి ముందు తొలుత కొంత నడిచి.. ఆ తర్వాత రనప్ అందుకోవడం అతడిశైలి. ‘‘నేను మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాను. అప్పట్లో బౌండరీ చాలా చిన్నదిగా ఉండేది. అందుకే నేను మరీ ఎక్కువ రనప్ తీసుకోను. బంతి వేసే సమయంలో తొలుత నడిచేవాడిని కాదు.. పరుగుపైనే దృష్టిపెట్టేవాడిని. కానీ, రన్ కోసం అనవసరంగా చాలా శక్తి వేస్ట్ చేసుకొంటున్నా అని ఆ తర్వాత అనిపించింది. ఈ విషయం నాకు ఎవరూ చెప్పలేదు. అలా యాక్షన్లో మార్పులు చేసుకొన్నాను’’ అని ఓ సందర్భంగా వెల్లడించాడు.
మొదట్లోనే వికెట్లు తీసి ప్రత్యర్థులను కట్టడి చేయడం.. డెత్ ఓవర్లలో వారికి ఊపిరాడనీయకుండా చేయడం బుమ్రా స్టైల్. ఇప్పటికీ టీమ్ ఇండియా, లీగ్ల్లో అతడికి బౌలింగ్పై ఎవరూ ఎక్కువ సలహాలు ఇవ్వరు. అతడి వ్యూహం ప్రకారమే బౌలింగ్ చేసే స్వేచ్ఛను ఇస్తారు. తాజాగా టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఇదే విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. దటీజ్ బూమ్ బూమ్ బుమ్రా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన అమ్మాయిలూ గెలిచేశారు!
దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది -
ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Dravid: టీమ్ఇండియా కోచ్ పదవి నుంచి దిగిపోయిన రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక నిరుద్యోగినన్నాడు. -
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
ఈ సీజన్ అనంతరం ఐపీఎల్కు వీడ్కోలు పలికిన దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సరికొత్త అవతారంలో ఆర్సీబీకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. -
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
బెరిల్ హరికేన్ ఎఫెక్ట్ టీమ్ఇండియాపై పడింది. ఈ హరికేన్ కారణంగా భారత జట్టు స్వదేశానికి ఆలస్యంగా రానుంది. -
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
జులై నెలాఖరులో టీమ్ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు కొత్త హెడ్ కోచ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
ఈ టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. -
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంపై అతడి సతీమణి ఎమోషనల్ అయ్యారు. అటు భార్య అనుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. -
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
T20 World Cup: తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్నకు సంబంధించిన వార్తను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత్ను కొనియాడుతూనే.. కీలక మ్యాచ్లో తడబడే అలవాటును దక్షిణాఫ్రికా కొనసాగించిందంటూ రాసుకొచ్చాయి. -
ఎందుకింత ఉద్వేగం!
దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్ మాత్రం దక్కడం లేదు. సెమీస్లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం. -
రూ.125 కోట్లు.. ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. -
ఈ కప్ అందరిదీ
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది. -
ఈ ప్రపంచకప్ వేరయా..
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. -
జకోవిచ్ సాధిస్తాడా?
సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) అదరగొట్టారు. జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్ రజత పతకంతో మెరిశాడు. -
స్నేహ్కు 8 వికెట్లు
భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
జడేజా కూడా టాటా
భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్ బాటలో మరో సీనియర్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు టాటా చెప్పాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. -
సంక్షిప్తవార్తలు(6)
తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు డిస్నీ+హాట్స్టార్లో భారీస్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!
-
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే..: మెలానియా ఏం చేయనున్నారు!
-
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్
-
ఆరోజు భయపడ్డాం.. ఈరోజు సాధించాం: వైరలవుతోన్న నాగ్ అశ్విన్ పోస్ట్..
-
దిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ.. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
-
‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?