Poll Result: రోహిత్‌ - కోహ్లీ బదులు వీళ్లే.. ఇంట్రెస్టింగ్‌గా మూడో ప్లేయర్‌ స్థానం?

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్‌ ఇండియాకు రోహిత్‌ శర్మ - విరాట్‌ కోహ్లీలా నిలిచే ఆ ఇద్దరు ఎవరంటే? ఈనాడు.నెట్‌ పాఠకులు చెప్పిన సమాధానం ఇదీ..

Updated : 04 Jul 2024 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రోహిత్‌ - కోహ్లీ వీడ్కోలు.. మరి ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?’ అంటూ ఈనాడు.నెట్‌ తీసుకొచ్చిన పోల్‌కు విశేష స్పందన వచ్చింది. ఒకరోజు పాటు జరిగిన ఓటింగ్‌లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. అయితే మూడో స్థానం కోసం జరిగిన హోరాహోరీ ఓటింగ్‌లో వచ్చిన అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

టీమ్‌ ఇండియాలో కింగ్‌ కోహ్లీ (Virat Kohli), హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ (Rohit Sharma) వారసత్వాన్ని శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ ముందుకు నడిపిస్తారని పాఠకులు అభిప్రాయపడ్డారు. వీరిద్దరి తర్వాత ఎవరు అనేది తెలిపే మూడో స్థానం కోసం కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడిచింది. ఆఖరికి యువ ఓపెనర్‌ అభిషేక్‌కే మూడో స్థానం దక్కింది. 

ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే? 

  • యశస్వి జైస్వాల్‌ - 66.7 శాతం
  • శుభ్‌మన్‌ గిల్‌ - 58.3
  • అభిషేక్‌ శర్మ - 24.7
  • కేఎల్‌ రాహుల్‌ - 21.7
  • రుతురాజ్‌ గైక్వాడ్‌ - 17.9
  • ఇషాన్‌ కిషన్‌ - 5.5
  • సాయి సుదర్శన్‌ - 4.1
  • దేవదత్‌ పడిక్కల్‌ - 1
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని