- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IND vs ZIM: జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్.. భారత జట్టులో పలు మార్పులు
జింబాబ్వేతో త్వరలో జరగనున్న ఐదు టీ20 సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లకు భారత జట్టులో పలు మార్పులు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, జింబాబ్వే మధ్య జులై 6 నుంచి 14 వరకు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం శుభ్మన్ గిల్ సారథ్యంలో బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, మొదటి రెండు టీ20ల కోసం భారత జట్టులో పలు మార్పులు చేశారు. సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను తీసుకున్నారు. బెరిల్ హరికేన్ ప్రభావంతో రెండు రోజులుగా భారత ప్రపంచ కప్ బార్బడోస్లో చిక్కుకుపోయింది. అందులో శాంసన్, దూబె, యశస్వి ఉన్నారు.
బార్బడోస్లో వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగుపడడంతో టీమ్ఇండియా స్వదేశం రావడానికి బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు బార్బడోస్ నుంచి భారత్కు ప్రత్యేక విమానం బయలుదేరనుంది. అదేరోజు సాయంత్రం 7.45 గంటలకు దిల్లీకి ఆటగాళ్లు చేరుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జింబాబ్వేతో మూడో టీ20కి ముందు శాంసన్, దూబె, యశస్వి జట్టుతో కలవనున్నారు. మరోవైపు, ఈ ఐదు టీ20 సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వేకు బయల్దేరింది. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించనున్నాడు.
జింబాబ్వేతో మొదటి రెండు టీ20లకు భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్0, హర్షిత్ రాణా.
చివరి మూడు టీ20లకు
శుభ్మన్ గిల్(కెప్టెన్), జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (కీపర్), ధ్రువ్ జురెల్ (కీపర్), శివమ్ దూబె, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే.
భారత్.. జింబాబ్వే టూర్ షెడ్యూల్
- తొలి టీ20 (జులై 6)
- రెండో టీ20 (జులై 7)
- మూడో టీ20 (జులై 10)
- నాలుగో టీ20 (జులై 13)
- ఐదో టీ20 (జులై 14)
- ఈ మ్యాచ్లన్నీ హరారే వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత ఆటగాళ్లతో ఓపెన్ బస్ పరేడ్.. ఎక్కడంటే?
టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్ను సాధించింది. దీంతో భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. -
పరాగ్ స్పెషల్.. అభిషేక్ ఆనందం.. జింబాబ్వే టూర్ వేళ యువ భారత్ ముచ్చట్లు
టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. జింబాబ్వే పర్యటనకు భారత ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ జట్టును అక్కడికి పంపించింది. -
స్వదేశానికి టీమ్ఇండియా.. ప్రధాని మోదీతో ప్లేయర్ల భేటీ ఎప్పుడంటే?
టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమ్ఇండియా (Team India) మరికొన్ని గంటల్లో భారత్కు చేరుకోనుంది. స్వదేశానికి వచ్చిన కాసేపటికే భారత ఆటగాళ్లు ప్రధాని మోదీని కలవనున్నారు. -
తన పేరిట నకిలీ ఖాతా.. జస్ప్రీత్ బుమ్రా సతీమణి ఆగ్రహం!
తన పేరిట ఫేక్ అకౌంట్ను సృష్టించడంపై భారత జట్లు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫైనల్ను చివరివరకూ చూశా.. భారత్ బ్రాండ్ క్రికెట్ అద్భుతం: పాక్ పేసర్
పొట్టి కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. భారత్ విజయంపై పాక్ మాజీలు కొందరు అక్కసు వెళ్లగక్కగా.. ఆ జట్టు పేసర్ మాత్రం అభినందనలు తెలిపాడు. -
నంబర్ వన్గా హార్దిక్ పాండ్య.. 12 స్థానాలు ఎగబాకిన బుమ్రా
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య (Hardik Pandya) అగ్ర స్థానంలో నిలిచాడు. -
రోహిత్-విరాట్ నిర్ణయంతో షాక్ అయ్యా.. వారిని భర్తీ చేయడం సవాలే: స్టార్ పేసర్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్బై చెప్పేశారు. అయితే, ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతోపాటు వారి సహచరులను కూడా షాక్కు గురి చేసింది. -
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన వేళ.. ఆ స్థానాన్ని భర్తీ చేసే ఇద్దరు ఎవరు? మీ మాట పోల్లో ఓటేసి చెప్పండి. -
సూర్య క్యాచ్ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ను భారత్ రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో చివరి ఓవర్లో అద్భుతమైన క్యాచ్తో సూర్య టీమ్ఇండియాకు కప్ను అందించాడు. -
కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
ఫామ్ కోల్పోయినప్పుడు ఆటగాడికి కెప్టెన్ నుంచి మద్దతు లభిస్తే.. తిరిగి పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో ధోనీ, రోహిత్ సక్సెస్ కావడం గమనార్హం. -
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
పదకొండేళ్లప్పుడు భారత్ ఓడిపోవడం చూసిన ఓ కుర్రాడు.. రెండు ప్రపంచ కప్లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్. -
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
వరల్డ్ కప్లో మ్యాచ్ ఆడేందుకు ప్రతి ఆటగాడూ ఉత్సాహం చూపిస్తాడు. ఇక పెద్ద జట్టుతో మ్యాచ్ అంటే సిద్ధంగా ఉంటారు. కానీ, బంగ్లాదేశ్ బౌలర్ మాత్రం అతి నిద్రతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. -
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. -
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
రోహిత్ వారసుడెవరు?
ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్.. మళ్లీ ఇప్పుడు భారత్ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్బై చెప్పాడు రోహిత్ శర్మ. -
అంతా కలలాగే..
టీ20 ప్రపంచకప్ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు. -
వింబుల్డన్ ఛాంపియన్కు చెక్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది. -
క్వార్టర్స్లో ఫ్రాన్స్
ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు యూరో 2024 క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. -
భారత జట్టులో సాయి, జితేష్
యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. -
పారిస్ ఒలింపిక్స్లో జ్యోతి!
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్ కోటాలో జ్యోతి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అలా కూర్చొని.. ఇలా రికార్డులు నెలకొల్పి: ప్రభాస్పై నాగ్ అశ్విన్ పోస్ట్
-
భారత ఆటగాళ్లతో ఓపెన్ బస్ పరేడ్.. ఎక్కడంటే?
-
అసెంబ్లీ గేటు కూడా తాకలేవంటే.. పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారు: పవన్
-
బాధితులకు న్యాయం చేయలేనప్పుడు పదవి శాశ్వతం కాదు: ఎమ్మెల్యే కొలికపూడి
-
తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి
-
పరాగ్ స్పెషల్.. అభిషేక్ ఆనందం.. జింబాబ్వే టూర్ వేళ యువ భారత్ ముచ్చట్లు