- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Gulbadin Naib: ‘ఫేక్ ఇన్జూరీ’ ఆరోపణలు.. గుల్బాదిన్పై చర్యలు ఉంటాయా? ఐసీసీ రూల్స్ ఏంటంటే?
అఫ్గానిస్థాన్ క్రికెటర్ గుల్బాదిన్ నైబ్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అతడు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) అఫ్గానిస్థాన్ తొలిసారి సెమీస్కు దూసుకొచ్చింది. సూపర్-8 స్టేజ్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ను ఓడించి నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే, బంగ్లాదేశ్తో పోరు సందర్భంగా అఫ్గాన్ ఆటగాడు గుల్బాదిన్ నైబ్ (Gulbadin Naib) తొడ కండరాలు తిమ్మిరి ఎక్కినట్లు ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఆ తర్వాత తమ జట్టు విజయం సాధించిన సంబరాల్లో మాత్రం యాక్టివ్గా ఉండటం గమనార్హం. అయితే, మ్యాచ్ను ఆలస్యం చేసేందుకు అతడు ‘ఫేక్ ఇన్జూరీ’ డ్రామా ఆడాడని.. నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ వచ్చింది. కొందరు మాజీలు కూడా అతడిది ‘ఆస్కార్’ యాక్టింగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దానికి గుల్బాదిన్ కూడా సమాధానం ఇచ్చాడు. ఒకవేళ గాయం నిజం కాదని తేలితే మాత్రం అతడిపై ఐసీసీ బ్యాన్ విధించే అవకాశం లేకపోలేదు. మరి ఈ రూల్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం..
దురుద్దేశంతో కావాలనే సమయం వృథా చేసేందుకు ప్రయత్నిస్తే ఆర్టికల్ 2.10.7 లెవల్ 1 లేదా 2 నేరానికి పాల్పడినట్లు ఐసీసీ భావిస్తుంది. ఉల్లంఘన నిజమని తేలితే మ్యాచ్ ఫీజ్లో 100 శాతంతోపాటు రెండు డీ మెరిట్ పాయింట్లను జరిమానాగా విధిస్తుంది. ఒక ఏడాదిలో ప్లేయర్ ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు ఉంటే ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నుంచి వేటు పడుతుంది. వీటికి అదనంగా బౌలర్ లేదా ఫీల్డర్ ఇలా ఫేక్ ఇన్జూరీ (Fake Injury) అని సమయాన్ని వృథా చేసినప్పుడు ఆర్టికల్ 41.9 ప్రకారం.. ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో ఇస్తారు. ఫీల్డ్ అంపైర్దే తుది నిర్ణయం ఉంటుంది. అయితే, బంగ్లా-అఫ్గాన్ మ్యాచ్లో ఇలా జరగలేదు. సోషల్ మీడియాలో అతడిపై విమర్శలు వచ్చినప్పటికీ.. ఇప్పటి వరకు ఐసీసీ (ICC)కి మాత్రం అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మ్యాచ్ రిఫరీ కూడా దీనిపై ఇప్పటికైతే విచారణ చేపట్టాలని అడగలేదని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఇది అంగీకారం కాదు: మాజీలు
మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో మ్యాచ్ను కాసేపు ఆపుదామనే ఉద్దేశంతో గుల్బాదిన్ ఇలా చేయడం సరైంది కాదని క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తెలిపాడు. ‘‘కోచ్ నుంచి సందేశం వచ్చింది. కాసేపటికే ఫస్ట్స్లిప్లో ఉన్న గుల్బాదిన్ అవసరం లేకపోయినా మైదానంలో పడిపోయాడు. ఇదెంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు’’ అని డౌల్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మరో మాజీ క్రికెటర్ పోమీ ఎంబంగ్వా ‘‘ఆస్కార్, ఎమ్మీ’’ అవార్డులంటూ కామెంట్ చేశాడు. అశ్విన్ (Ashwin) కూడా అద్భుతమైన యాక్టింగ్ అంటూ పోస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా పట్టేస్తాయ్..: నైబ్
సోషల్ మీడియాతోపాటు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో గుల్బాదిన్ నైబ్ ఓ పోస్టు పెట్టాడు. వారందరికీ కౌంటర్గా షేర్ చేయడం గమనార్హం. ‘‘నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు లేదా బాధతో ఉన్నప్పుడు ఒక్కోసారి కండరాలు పట్టేయడం జరుగుతుంటుంది’’ అని గుల్బాదిన్ పోస్టు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి రోజు ఆట పూర్తి.. భారత్ మహిళల రికార్డు స్కోరు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా తొలిరోజు ఆటముగిసింది. భారత్ మహిళా జట్టు 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. -
ఫైనల్కు వర్షం ముప్పు.. రిజర్వ్డే నాడూ మ్యాచ్ జరగకపోతే.. నిబంధనలు ఎలా ఉన్నాయ్..?
ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. -
నమ్మడం.. నడిపించడం.. ఇదే రోహిత్ మార్క్ కెప్టెన్సీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. -
భారత్ సుదీర్ఘ నిరీక్షణకు తెర పడనుందా?.. సఫారీలకు తొలి టైటిలా..?
టీ20 ప్రపంచకప్ ముగింపు దశకు వచ్చేసింది. సూపర్-8, సెమీస్లను దాటేసి ఫైనల్ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. -
వారెవ్వా.. అదిరిపోయే ధోనీ న్యూ లుక్ చూశారా?
MS dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ న్యూ హెయిర్స్టైల్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
‘ఒకరి కోసం కప్ గెలవాలి’.. నేను ఇలాంటివి అస్సలు నమ్మను: ద్రవిడ్
టీ20 ప్రపంచకప్లో రెండోసారి విజేతగా నిలవాలని టీమ్ఇండియా ఎదురుచూస్తోంది. ఇప్పుడా అవకాశం వచ్చింది. పొట్టి కప్ 2024లో ఫైనల్కు చేరింది. -
దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో ఏకైక టెస్టు.. భారత ఓపెనర్ల సరికొత్త రికార్డు
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు దూకుడుగా ఆడుతోంది. -
భారత్ విజయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అక్కసు.. పిచ్పై ప్రేలాపనలు..!
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెన్ వాన్ గయాన పిచ్పై చేసిన ప్రేలాపనలకు భారత సీనియర్, మాజీ ఆటగాళ్లు బలంగా కౌంటర్ ఇచ్చారు. -
రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్గా రికార్డు
సెమీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి భారత్ ఫైనల్కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్తో రాణించాడు. -
బ్యాటర్ల దూకుడు.. బౌలర్ల విజృంభణ.. భారత్ విజయం.. ఇవిగో వీడియోలు!
ఇంగ్లాండ్ను చిత్తు చేయడంలో టీమ్ఇండియా బ్యాటర్లతోపాటు బౌలర్ల కృషి ఉంది. ఇక ఫీల్డింగ్లోనూ మెరుపులతో అదరగొట్టేశారు. -
ఆ ఒక్క ట్రిక్ పాటించా.. వికెట్లు సాధించా: అక్షర్ పటేల్
భారత విజయంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ముగ్గురు డేంజరస్ బ్యాటర్లు బట్లర్, బెయిర్స్టో, మొయిన్ అలీ వికెట్లు పడగొట్టాడు. -
రోహిత్ శర్మ భావోద్వేగం.. ‘కమాన్ మ్యాన్ చీర్స్’ అన్న విరాట్ కోహ్లీ!
టీమ్ఇండియా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. అయితే, సెమీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన తర్వాత రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. -
కోహ్లీకి ఫామ్ సమస్యే కాదు.. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడు: రోహిత్ శర్మ
ఇంగ్లాండ్పై ఘన విజయంతో భారత్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. శనివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. -
వావ్ రిషభ్ పంత్.. సూపర్ స్టంపింగ్.. వీడియో వైరల్
ఇంగ్లాండ్తో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుతమైన స్టంపింగ్ చేశాడు.
-
రోహిత్ హిట్టింగ్.. అక్షర్ టర్నింగ్.. మ్యాచ్ హైలైట్స్ అదుర్స్
టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు టీమ్ఇండియా దూసుకుపోయింది. సెమీస్లో ఇంగ్లాండ్ను అలవోకగా చిత్తు చేసి మూడోసారి టైటిల్ రేసులో నిలిచింది.
-
దెబ్బకు దెబ్బ
గుర్తుందా 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్! ఇంగ్లాండ్కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఒక్కటంటే ఒక్క వికెట్ కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రోహిత్సేనకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది ఇంగ్లిష్ జట్టు. -
ఎన్నాళ్లో వేచిన విజయం
ఓ అద్భుత ప్రస్థానానికి అనుకోని ముగింపు. పాపం.. అఫ్గానిస్థాన్! సంచలన ప్రదర్శనతో, పోరాటపటిమతో అంచనాలను అమాంతం పెంచేసి క్రికెట్ ప్రపంచం దృష్టినంతా తనవైపే తిప్పేసుకున్న ఈ జట్టు.. సెమీఫైనల్లో చతికిల పడింది. -
పోర్చుగల్కు షాక్.. నాకౌట్కు జార్జియా
యూరో కప్లో సంచలనం. గురువారం గ్రూప్- ఎఫ్ మ్యాచ్లో అగ్రశ్రేణి జట్టు పోర్చుగల్కు షాకిచ్చిన జార్జియా నాకౌట్కు అర్హత సాధించింది. 2-0 తేడాతో రొనాల్డో జట్టుపై జార్జియా నెగ్గింది. ఇప్పటికే పోర్చుగల్ రౌండ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
కౌంటీల్లో రహానె
టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె మరోసారి ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడబోతున్నాడు. ఈ సీజన్ కోసం అతనితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు లీసెస్టర్షైర్ క్లబ్ గురువారం ప్రకటించింది. -
జోరు కొనసాగిస్తారా!
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం సఫారీలతో ఆరంభమయ్యే ఏకైక టెస్టులోనూ అదరగొట్టాలని హర్మన్ప్రీత్ బృందం బరిలో దిగుతోంది. -
గుకేశ్ శుభారంభం
సూపర్బెట్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్ శుభారంభం చేశాడు. గురువారం తొలి రౌండ్లో బోగ్డాన్ డానియల్ (రొమేనియా)పై అతడు విజయం సాధించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తొలి రోజు ఆట పూర్తి.. భారత మహిళల రికార్డు స్కోరు
-
‘హనుమాన్’తో మొదలై.. ‘కల్కి’తో ముగిసి: టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్టు
-
ఫైనల్కు వర్షం ముప్పు.. రిజర్వ్డే నాడూ మ్యాచ్ జరగకపోతే.. నిబంధనలు ఎలా ఉన్నాయ్..?
-
దిల్లీ ఎయిర్పోర్టు ఘటన.. నాటి పౌర విమానయానశాఖ మంత్రి ఏమన్నారంటే
-
జలమయంగా దిల్లీ: ఎంపీని ఎత్తుకొని వచ్చి.. కారులో కూర్చోబెట్టి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM