- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Team India: పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే!
రోహిత్ సేనకు అభిమానుల బ్రహ్మరథం
జనసంద్రమైన ముంబయి
ముంబయి
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ సాధించి గురువారం స్వదేశంలో దిగిన భారత క్రికెట్ జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబయిలో జరిగిన విజయయాత్రలో వేలాది మంది రోడ్డు పక్కనే నిలిచి తమ హీరోలను చూసి పులకరించిపోయారు. వారి సందడితో ముంబయి తీర ప్రాంతమంతా వెలిగిపోయింది. అరుపులతో దద్ధరిల్లిపోయింది.
సంద్రం.. జనసంద్రం
దిల్లీ నుంచి ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయానికి వచ్చిన భారత జట్టుకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. కెనాన్ సెల్యూట్ (విమానంపై అటు ఇటు వాటర్ ఇంజన్లతో నీళ్లు గుమ్మరించడం)తో విమానాశ్రయ సిబ్బంది భారత జట్టుకు ఆహ్వానం పలికారు. ఎయిర్పోర్టు బయట కూడా అభిమానులు భారీగా నిలిచి భారత జట్టును ఆహ్వానించారు. అక్కడ నుంచి నారిమన్ పాయింట్కు వచ్చిన టీమ్ఇండియా.. 7.30కు ఓ ప్రత్యేకమైన ఓపెన్ బస్సులో విజయయాత్రను షురూ చేసింది. ఈ యాత్ర సాగిన మెరైన్డ్రైవ్ రోడ్డు జన సంద్రాన్ని తలపించింది. అభిమానులు తమ క్రికెట్ స్టార్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో హోరెత్తించారు. రోహిత్.. రోహిత్... కోహ్లి.. కోహ్లి అంటూ ఊగిపోయారు. అభిమానులకు అభివాదం చేస్తూ టీమ్ఇండియా ముందుకు కదిలింది. ఒకవైపు వర్షం.. మరోవైపు పూల వర్షంతో భారత జట్టు తడిసిపోయింది. బస్సుపైన కూర్చున్న టీమ్ఇండియా ఆటగాళ్లు జాతీయ జెండా చేతబూని ముందుకు సాగారు. కప్ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఒకవైపు వేలాది మంది అభిమానులు వెంటరాగా విజయోత్సవ ర్యాలీ సందడిగా సాగింది. పని దినం కావడంతో కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ స్తంభించిపోయింది.
భారత జెర్సీలో మరో తార
భారత క్రికెట్ జట్టు జెర్సీలో మరో తార చేరింది. పొట్టి ఫార్మాట్లో ఆడేటప్పుడు 2007 టీ20 ప్రపంచకప్ విజయానికి చిహ్నంగా ఒకే స్టార్ ఉండే జెర్సీని టీమ్ఇండియా ఆటగాళ్లు ధరించేవాళు.్ల కానీ తాజాగా రోహిత్ సేన మరో కప్ గెలవడంతో భారత జెర్సీలో రెండు తారలు వచ్చాయి. ఈ విజయం తర్వాత భారత జట్టు సొంతగడ్డపై అడుగుపెట్టిన నేపథ్యంలో ‘ఇండియా ఛాంపియన్స్’ పేరుతో ఉన్న కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. ఈ ఫొటోను వికెట్కీపర్ సంజు శాంసన్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఈ టీషర్ట్లో బీసీసీఐ లోగోపైన ప్రపంచకప్ విజయాలకు సూచికగా రెండు స్టార్లు కనిపిస్తున్నాయి. 2007లో మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీమ్ఇండియా తొలి టీ20 ప్రపంచకప్ నెగ్గిన సంగతి తెలిసిందే.
రూ.125 కోట్ల బహూకరణ
విజయయాత్ర అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి వచ్చారు. వారిని చూసేందుకు అభిమానులకు అవకాశం ఇవ్వడంతో స్టేడియం మొత్తం నిండిపోగా వేలాది మంది బయట ఉండిపోయారు. వర్షం కురుస్తున్నా తిండి, నీళ్లూ లేకుండా కూడా ఫ్యాన్స్ స్టేడియంలోనే నిరీక్షించారు. టీమ్ఇండియా స్టేడియం చేరుకున్నాక.. జాతీయ గీతం ఆలపించారు. ఆ సమయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. తమకు ఎంతో మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది. ముందే ప్రకటించినట్లుగా టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానాను అందించింది.
రోహిత్ను అలా ఎప్పుడూ చూడలేదు: ప్రపంచకప్ సాధించడంతో జట్టులోని అంతా ఉద్వేగానికి గురయ్యారని కోహ్లి వివరించాడు. ‘‘గత పదిహేనేళ్లుగా రోహిత్ ఇంత ఉద్వేగానికి గురి కావడాన్ని చూడలేదు. విజేతగా నిలిచి పెవిలియన్కు వెళుతున్నప్పుడు రోహిత్తో పాటు నాకూ కన్నీళ్లు ఆగలేదు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు సచిన్తో పాటు సీనియర్లు ఉద్వేగానికి గురైనప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ అనుభవం ఇప్పుడు తెలుస్తోంది’’ అని కోహ్లి అన్నాడు.
హార్దిక్కు నీరాజనం
ఐపీఎల్లో రోహిత్ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికై విఫలం కావడంతో అభిమానుల నుంచి హేళనలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యకు ఈసారి భిన్నమైన అనుభవం ఎదురైంది. ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన అతడికి వాంఖడె స్టేడియంలో అభిమానులు నీరాజనం పట్టారు. హార్దిక్కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. అతడితో ఫొటో దిగడానికి ఎగబడ్డారు.
బార్బడోస్ నుంచి దిల్లీకి
ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు.. బార్బడోస్లో తుపాను కారణంగా అయిదు రోజులు అక్కడే నిలిచిపోయింది. బుధవారం ప్రత్యేక విమానంలో బయల్దేరి వచ్చింది. ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 ప్రపంచకప్ పేరుతో ఉన్న ఈ ప్రత్యేక విమానం.. 16 గంటలు ఏకధాటిగా ప్రయాణించి గురువారం ఉదయం 6 గంటలకు దిల్లీలోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది. భారత జట్టు వస్తుందన్న సమాచారం ముందే ఉండడంతో అభిమానులతో విమానాశ్రయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. రోహిత్, కోహ్లి, కోచ్ రాహుల్ ద్రవిడ్ పోస్టర్స్తో ఉన్న ప్లకార్డులు పట్టుకున్న అభిమానులు టీమ్ఇండియాను చూడగానే గట్టిగా అరుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారితో కరచాలనం చేసేందుకు.. ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. క్రికెటర్లకు భాంగ్రా నృత్యాలతో స్వాగతం పలికారు. వారితో కలిసి రోహిత్, హార్దిక్, సూర్యకుమార్, పంత్ కూడా నృత్యం చేశారు. ‘‘ఈ క్షణం కోసం 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. భారత్ ప్రపంచకప్ గెలవడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది’’ అని దిల్లీ ఎయిర్పోర్టులో ఉదయం 4.30 నుంచి ఎదురు చూసిన అభిమాని తెలిపాడు.
రెండు గంటలు ఆలస్యంగా: విమానాశ్రయం నుంచి పటిష్ట భద్రత మధ్య హోటల్కు చేరిన తర్వాత భారత జట్టు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జైషాతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసింది. ఆటగాళ్లను అభినందించిన ప్రధాని వారితో చాలాసేపు మాట్లాడారు. ప్రధానితో అల్పాహారం ముగించిన తర్వాత భారత జట్టు మధ్యాహ్నం 3.45 తర్వాత దిల్లీ నుంచి ముంబయికి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ ర్యాలీ ఆరంభం కావాల్సి ఉండగా.. రా.7.30కు ముంబయిలోని మెరైన్డ్రైవ్లో ఈ యాత్ర షురూ అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితం ఎంతో విలువైంది.. డ్రగ్స్ బారిన పడి దాన్ని నాశనం చేసుకోవద్దు: పీవీ సింధు
జీవితం ఎంతో విలువైందని.. డ్రగ్స్ బారిన పడి దాన్ని నాశనం చేసుకోవద్దని ప్రముఖ బ్యామ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సూచించారు.
-
సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే లక్ష్యం 235
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
నా పరిస్థితే వేరు.. దేశవాళీలో ఆడమనడం సమంజసంగా అనిపించలేదు: ఇషాన్
ఆరు నెలలుగా చాలా కుంగుబాటుకు గురైనట్లు ఇషాన్ కిషన్ వెల్లడించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఉద్వాసన మొదలు జాతీయ జట్టులో చోటు కోల్పోవడం వరకు ప్రతిదీ బాధపెట్టిందని తెలిపాడు. -
ద్రవిడ్కు ‘భారతరత్న’ ఇవ్వడమే సముచితం: సునీల్ గావస్కర్
భారత్ టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో రోహిత్తోపాటు జట్టులోని సభ్యులు ఎంత కష్టపడ్డారో.. కోచ్గా రాహుల్ ద్రవిడ్ శ్రమ కూడా అంతే కీలకం. -
భారత కోచ్గా గంభీర్! ఈడెన్ గార్డెన్స్లో ఫేర్వెల్ వీడియో షూట్
టీమ్ ఇండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో ఆ రేసులో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ముందున్నట్లు తెలుస్తోంది. -
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
ఇటీవల టీమ్ఇండియాతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
భారత జెర్సీని ధరించే అవకాశం వస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. అయితే, యువ క్రికెటర్ నితీశ్కు పిలుపు వచ్చినా.. గాయం కారణంగా జింబాబ్వే సిరీస్కు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న రెండో టీ20 ప్రపంచ కప్ను రోహిత్ శర్మ అందించాడు. వచ్చే ఏడాది మరో రెండు కీలక లక్ష్యాలు హిట్మ్యాన్ ముంగిట ఉన్నాయి. -
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
టెన్నిస్ క్రీడాకారుల ఆన్లైన్ ప్రైవసీని కాపాడేందుకు వింబుల్డన్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘ఏఐ’ని పరిచయం చేశారు. -
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల్లో ఏకంగా 2 కోట్ల లైక్స్ను సొంతం చేసుకొంది. -
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు వేడుకను భార్య సాక్షి, మిత్రులతో కలిసి చేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. -
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా రిషభ్ పంత్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. -
యువ భారత్ బోల్తా
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది. -
పోర్చుగల్ షూటౌట్
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్షిప్ను ఓటమితో ముగించాడు. -
రజావత్ సంచలనం
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలన విజయం సాధించాడు. -
ఇంగ్లాండ్ గట్టెక్కింది
ఫుట్బాల్లో స్విట్జర్లాండ్తో పోరంటే ఇంగ్లాండ్ను ఫేవరెట్గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్షిప్ గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్లో ఆ జట్టు ఫేవరెట్గానే బరిలోకి దిగింది. -
స్వైటెక్కు షాక్
వింబుల్డన్లో పెద్ద సంచలనం! టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్సీడ్కు కజకిస్థాన్ అన్సీడెడ్ ప్లేయర్ యూలియా పుటిన్సెవా చెక్ పెట్టింది. -
నేను ఆ తరహా కాదు
టీమ్ఇండియా కోచ్గా తాను కెప్టెన్ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. -
వినేశ్కు స్వర్ణం
గ్రాండ్ప్రి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నివేదికను హిండెన్బర్గ్ ముందే లీక్ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’
-
సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు
-
రిషికేశ్లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు
-
‘కల్కి’ మరో రికార్డు.. కమల్హాసన్ డైలాగ్పై సాయిమాధవ్ ఏమన్నారంటే?
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!
-
సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే లక్ష్యం 235