- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
కొత్త సవాల్ను అధిగమించాం
ప్రపంచ బ్యాడ్మింటన్లో ఎదురవుతున్న కొత్త సవాల్ను అధిగమించినట్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం తెలిపింది.
దిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్లో ఎదురవుతున్న కొత్త సవాల్ను అధిగమించినట్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం తెలిపింది. ఇటీవల తరచుగా కొరియా, ఇండోనేసియా ప్రత్యర్థులు షటిల్ను స్పిన్ చేస్తూ, దూరంగా సంధిస్తూ సర్వ్ చేస్తూ భారత నం.1 జోడీని ఇబ్బందిపెడుతున్నారు. పారిస్ ఒలింపిక్స్కు ముందు ఈ సవాల్కు పరిష్కారం కనుగొన్నట్లు సాత్విక్- చిరాగ్ జంట పేర్కొంది. ‘‘సర్వ్ వైవిధ్యాలు కొత్త సవాళ్లే. కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. అలాంటి సర్వ్లను స్వీకరించడానికి కొంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ సవాల్ను ఛేదించాం. ఏం చేయాలో మాకు తెలుసు. అందుకు అనుగుణంగా సాధన చేస్తున్నాం. ఒలింపిక్స్లో అలాంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం’’ అని చెప్పింది. పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధతపై మాట్లాడుతూ.. ‘‘టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న అనుభవం పారిస్కు ఎంతగానో పనికొస్తుంది. అత్యున్నత స్థాయిలో ఆడటం వల్ల ఒత్తిడిని తట్టుకోవడం, ఏకాగ్రతను కాపాడుకోవడం, పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకోవడం నేర్చుకున్నాం. ఒలింపిక్స్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యున్నత వేదికలో ఆడిన అనుభవం ఇప్పటికే సాధించాం. ఒలింపిక్స్లో తొలిసారి ఆడుతున్నప్పుడు చేసే పొరపాట్లు ఇప్పుడు ఉండవు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలవడం కూడా మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఒలింపిక్స్ సమీపిస్తున్నకొద్దీ మా సన్నాహం మరింత జోరందుకుంది. ప్రతి విభాగాన్ని సానబెడుతున్నాం. పారిస్ కోర్టులో అడుగుపెట్టినప్పుడు అత్యుత్తమంగా ఆడాలని భావిస్తున్నాం. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం మేం మంచి లయతో ఉన్నాం. శారీరక, మానసిక ఫిట్నెస్ కూడా ప్రధానం. ఒలింపిక్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని సాత్విక్, చిరాగ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ కూడా అందరిలాంటోడే..’
తన సోదరుడు హార్దిక్ పాండ్య టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. -
ఇక కుర్రాళ్ల సమయం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. -
చరిత్ర మారలేదు
గత 36 ఏళ్లలో ప్రపంచకప్ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు. -
భారత్ జోరుకు కళ్లెం
దక్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్ఇండియాను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్లో బదోసా
స్పెయిన్ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్లో ప్రవేశించింది. -
సెమీస్లో అర్జెంటీనా
కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్తో ఈక్వెడార్ను ఓడించింది. -
టీమ్ఇండియాకు ఇంకో రూ.11 కోట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. -
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రెడిట్ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.