- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బాయ్కాట్కు మళ్లీ క్యాన్సర్
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ రెండోసారి గొంతు క్యాన్సర్ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది.
లండన్: ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ రెండోసారి గొంతు క్యాన్సర్ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది. ‘‘రెండోసారి క్యాన్సర్ను జయించాలంటే మంచి వైద్యంతోపాటు కాస్త అదృష్టం ఉండాలని గత అనుభవంతో నాకు అర్థమైంది. శస్త్రచికిత్స విజయవంతమైనా.. క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశముంటుందని ప్రతి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికీ తెలుసు’’ అని బాయ్కాట్ అన్నాడు. 83 ఏళ్ల బాయ్కాట్ తొలిసారి 2002లో క్యాన్సర్ బారిన పడ్డాడు. చాలా రోజులు పోరాడి కోలుకున్నాడు.
ఆడ్వాణీ శుభారంభం
రియాద్: ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ ఆడ్వాణీ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో ఆడ్వాణీ 4-2తో ఆంగ్ ఫ్యో (మయన్మార్)పై విజయం సాధించాడు. రెండో పోరులో 4-3తో యుటపప్ పక్పోజ్ (థాయ్లాండ్)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచిన 38 ఏళ్ల ఆడ్వాణీ హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నాడు.
ప్రజ్ఞానంద, గుకేశ్లకు డ్రా
బుకారెస్ట్: గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు మరో డ్రా ఎదురైంది. ఏడో రౌండ్లో తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్న డియాచ్ బోగ్దాన్ (రొమేనియా)తో అతను పాయింట్లు పంచుకున్నాడు. ఈ గేమ్ 38 ఎత్తుల్లో ముగిసింది. నవంబరులో ప్రపంచ ఛాంపియన్షిప్ ఆడబోతున్న దొమ్మరాజు గుకేశ్.. మ్యాగ్జిమ్ వాచియెర్ (ఫ్రాన్స్)తో గేమ్ను డ్రా చేసుకున్నాడు. మరో మూడు రౌండ్లు మిగిలివున్న ఈ టోర్నీలో కరువానా (అమెరికా) 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గుకేశ్ (3.5), అలీ రెజా (3.5) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
జింబాబ్వేలో భారత జట్టు
హరారె: కెప్టెన్ శుబ్మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారత యువ జట్టు జింజాబ్వే చేరుకుంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఈనెల 6న ప్రారంభంకానుంది. గిల్ అమెరికా నుంచి రాగా.. మిగతా జట్టంతా ముంబయి నుంచి బయల్దేరి హరారెలో అడుగుపెట్టింది. ‘‘టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్ను స్వాగతిస్తున్నాం’’ అని ‘ఎక్స్’లో జింబాబ్వే క్రికెట్ బోర్డు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ కూడా అందరిలాంటోడే..’
తన సోదరుడు హార్దిక్ పాండ్య టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. -
ఇక కుర్రాళ్ల సమయం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. -
చరిత్ర మారలేదు
గత 36 ఏళ్లలో ప్రపంచకప్ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు. -
భారత్ జోరుకు కళ్లెం
దక్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్ఇండియాను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్లో బదోసా
స్పెయిన్ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్లో ప్రవేశించింది. -
సెమీస్లో అర్జెంటీనా
కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్తో ఈక్వెడార్ను ఓడించింది. -
టీమ్ఇండియాకు ఇంకో రూ.11 కోట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. -
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రెడిట్ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.