- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
వింబుల్డన్ ఛాంపియన్కు చెక్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది.
తొలి రౌండ్లోనే వొండ్రుసోవా ఔట్
జకోవిచ్, రిబకినా ముందంజ
లండన్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది. కెరీర్లో మూడోసారి మాత్రమే గ్రాండ్స్లామ్ టోర్నీ మెయిన్డ్రాలో ఆడుతున్న ప్రపంచ 83వ ర్యాంకర్ జెస్సికా.. 67 నిమిషాల్లోనే ఛాంపియన్కు చెక్ పెట్టింది. ఈ క్రమంలో అయిదు బ్రేక్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. ఏడు అనవసర తప్పిదాలు చేసిన వొండ్రుసోవా ఓటమి కొనితెచ్చుకుంది. వొండ్రుసోవా ఓపెన్ శకంలో వింబుల్డన్ తొలి రౌండ్లోనే ఓడిన రెండో డిఫెండింగ్ ఛాంపియన్. 1994లో జర్మనీ తార స్టెఫీగ్రాఫ్ ఇలాగే ఓడిపోయింది. మరోవైపు నాలుగోసీడ్ రిబకినా (కజకిస్థాన్) ముందంజ వేసింది. తొలి రౌండ్లో ఆమె 6-3, 6-1తో రూస్ (రొమేనియా)ను ఓడించింది. ఈ క్రమంలో మూడు ఏస్లు కొట్టడంతో పాటు అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది. అయిదోసీడ్ జెస్సికా పెగులా (అమెరికా) కూడా రెండో రౌండ్ చేరింది. ఆమె 6-2, 6-0తో మరో అమెరికా అమ్మాయి క్రూగర్ను చిత్తు చేసింది. బుర్సా (స్పెయిన్), సిగ్మండ్ (జర్మనీ), వాంగ్ (చైనా) కూడా తొలి రౌండ్ను అధిగమించారు.టైటిల్పై గురిపెట్టిన ఇగా స్వైటెక్ (పోలెండ్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఈ టాప్సీడ్ 6-3, 6-4తో కెనిన్ (అమెరికా)ను ఓడించింది. ఇంకో మ్యాచ్లో బౌల్టర్ (బ్రిటన్) 7-6 (8-6), 7-5తో మారియా (జర్మనీ)పై నెగ్గింది.
జకో శుభారంభం: గాయం తర్వాత పునరాగమనం చేసిన మాజీ నంబర్వన్ నొవాక్ జకోవిచ్ వింబుల్డన్లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఏడుసార్లు ఛాంపియన్ 6-1, 6-2, 6-2తో కొప్రికా (చెక్)ను తేలిగ్గా ఓడించాడు. దాదాపు రెండు గంటల్లో ముగిసిన ఈ పోరులో జకో ఎక్కడా ఇబ్బందిపడలేదు. దూకుడుగా ఆడిన అతడు ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో 10 ఏస్లు కూడా కొట్టాడు. నాలుగోసీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఏడోసీడ్ హర్కాజ్ (పోలెండ్) కూడా రెండో రౌండ్ చేరారు. జ్వెరెవ్ 6-2, 6-4, 6-2తో కార్బాలెస్ (స్పెయిన్)పై.. హర్కాజ్ 5-7, 6-4, 6-3, 6-4తో అల్బోట్ (మాల్దోవా)పై నెగ్గారు. మరోవైపు ఆరోసీడ్ రుబ్లెవ్ (రష్యా)కు షాక్ తగిలింది. అతడు 4-6, 7-5, 2-6, 6-7 (5-7)తో కొమ్సనా (అర్జెంటీనా) చేతిలో కంగుతిన్నాడు. తొమ్మిదోసీడ్ డిమినర్ (ఆస్ట్రేలియా), నిషిక (జపాన్), పాప్యిరిన్ (ఆస్ట్రేలియా) కూడా ముందంజ వేశారు.
నగాల్ ఔట్: భారత స్టార్ సుమిత్ నగాల్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అతడు 2-6, 6-3, 3-6, 4-6తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై పోరాడి ఓడాడు. తొలి సెట్ చేజార్చుకున్నా.. పట్టుదలగా ఆడిన నగాల్ రెండో సెట్ గెలిచి మ్యాచ్లో నిలిచాడు. కానీ తర్వాతి రెండు సెట్లలోనూ సత్తా చాటినా కీలక సమయాల్లో తడబడి ఓటమివైపు నిలిచాడు. 4 డబుల్ ఫాల్ట్స్ చేయడం.. ఏడుసార్లు సర్వీస్ కోల్పోవడం నగాల్ను ముంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.