- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
భారత జట్టులో సాయి, జితేష్
యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు.
హర్షిత్ రాణా కూడా
దిల్లీ: యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. టీ20 ప్రపంచకప్ బృందంలో సభ్యులుగా ఉన్న సంజు, దూబె, జైశ్వాల్.. బార్బడోస్లో తుపాను కారణంగా జట్టుతో పాటే అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురు సహా భారత జట్టు మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో భారత్కు పయనమవుతుంది. బుధవారం రాత్రి 7.45 గంటలకు జట్టు భారత్కు చేరుకుంటుంది. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆటగాళ్లను సత్కరిస్తారు. అనివార్య కారణాలతో బీసీసీఐ ముగ్గురు ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసింది. అయితే ప్రపంచకప్కు రిజర్వ్గా వెళ్లిన పేసర్ ఖలీల్ అహ్మద్, బ్యాటర్ రింకూ సింగ్ బార్బడోస్లోనే ఉన్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన ఈ ఇద్దరి స్థానాలకు బీసీసీఐ ప్రత్యమ్నాయాలను ప్రకటించలేదు. ప్రస్తుతం లండన్లో సర్రే తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతున్న సాయి.. వెంటనే జింబాబ్వేకు బయల్దేరనున్నాడు. జులై 6న ప్రారంభమయ్యే సిరీస్లో భారత్, జింబాబ్వే అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి.
తొలి రెండు టీ20లకు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా
జింబాబ్వేకు టీమ్ఇండియా
ముంబయి: అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమ్ఇండియా.. జింబాబ్వేకు బయల్దేరింది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారత జట్టు మంగళవారం పయనమైనట్లు బీసీసీఐ పేర్కొంది. లక్ష్మణ్తో పాటు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్పాండే విమానంలో కూర్చున్న ఫొటోల్ని ‘ఎక్స్’లో బీసీసీఐ పంచుకుంది. టీ20 ప్రపంచకప్కు రిజర్వ్ ఓపెనర్గా ఎంపికైన కెప్టెన్ శుభ్మ్న్ గిల్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అతను అక్కడ్నుంచే జింబాబ్వే చేరుకుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.