- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
గుకేశ్ పోరు సింగపూర్లో
సొంతగడ్డపై డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్ ఆశలు ఫలించలేదు.
లిరెన్తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్
దిల్లీ: సొంతగడ్డపై డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్ ఆశలు ఫలించలేదు. చెన్నై లేదా దిల్లీలో ఈ ఛాంపియన్షిప్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ మెగా పోరును నిర్వహించే అవకాశాన్ని సింగపూర్ పట్టేసింది. నవంబర్ 20-డిసెంబర్ 15 తేదీల్లో జరగబోయే ఈ సమరానికి ఫిడే రూ.20 కోట్లు నగదు బహుమతిగా నిర్ణయించింది. ‘‘ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడానికి పోటీపడిన దేశాల్లో వేదికలను పరిశీలించాం. సౌకర్యాలను గమనించాం. సింగపూర్కు ఆతిథ్య హక్కులను ఇస్తున్నాం’’ అని ఫిడే తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో క్యాండిడేట్ చెస్ టైటిల్ గెలిచిన 17 ఏళ్ల గుకేశ్.. డిఫెండింగ్ ఛాంపియన్ లిరెన్తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో తలపడేందుకు అర్హత సాధించాడు. ఈ మ్యాచ్ ఆడబోతున్న పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
ఆల్రౌండర్ నం.1 హార్దిక్
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. -
అదరగొట్టిన అల్కరాస్
టైటిల్ ఫేవరెట్ మూడో సీడ్ కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. అతను అలవోకగా మూడో రౌండ్ చేరాడు. అయిదో సీడ్ మెద్వెదెవ్ రెండో రౌండ్ను అధిగమించగా.. ఎనిమిదో సీడ్ రూడ్కు ఫోగ్నిని షాకిచ్చాడు. -
క్వార్టర్స్లో తుర్కియే
తొలి నిమిషంలో గోల్.. ఆఖరి సెకన్లలో అద్భుత సేవ్తో తుర్కియే యూరో కప్ ఫుట్బాల్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఆ జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. -
కొత్త సవాల్ను అధిగమించాం
ప్రపంచ బ్యాడ్మింటన్లో ఎదురవుతున్న కొత్త సవాల్ను అధిగమించినట్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం తెలిపింది. -
మార్చి 1న భారత్, పాక్ పోరు!
అసలు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందో లేదో తెలియదు, జరిగితే టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్థాన్లో భారత్ పర్యటిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు గానీ.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ముహూర్తం ఖరారైపోయింది. -
అది తప్పుకోవడం కాదు
పారిస్ డైమండ్ లీగ్ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్పష్టత ఇచ్చాడు. -
బాయ్కాట్కు మళ్లీ క్యాన్సర్
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ రెండోసారి గొంతు క్యాన్సర్ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది.