కోహ్లి లేకుండా ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టులో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సత్తా చాటినప్పటికీ అంతకుముందు విఫలమవడంతో కోహ్లీని 12 మంది సభ్యుల జట్టుకు ఐసీసీ ఎంపిక చేయలేదు.

Published : 02 Jul 2024 03:41 IST

దుబాయ్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టులో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సత్తా చాటినప్పటికీ అంతకుముందు విఫలమవడంతో కోహ్లీని 12 మంది సభ్యుల జట్టుకు ఐసీసీ ఎంపిక చేయలేదు. అయితే భారత్‌ నుంచి ఆరుగురికి జట్టులో స్థానం లభించింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ జట్టుకు ఎంపికయ్యారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టు: రోహిత్, సూర్య, హార్దిక్, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్‌ (భారత్‌), రహ్మనుల్లా గుర్బాజ్, రషీద్‌ ఖాన్, ఫజల్‌హక్‌ ఫారూఖీ (అఫ్గానిస్తాన్‌), మార్కస్‌ స్టాయినిస్‌ (ఆస్ట్రేలియా), నికోలస్‌ పూరన్‌ (వెస్టిండీస్‌), 12వ ఆటగాడు: ఎన్రిచ్‌ నోకియా (దక్షిణాఫ్రికా) 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని