- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
కోర్టులోనే కుప్పకూలిన 17 ఏళ్ల షట్లర్
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్ జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
దిల్లీ: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్ జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ వార్తతో తన హృదయం ముక్కలైందని ఆమె తెలిపింది. ‘‘బ్యాడ్మింటన్ యువ ఆటగాడు ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ సందర్భంగా మరణించాడనే వార్తతో నా హృదయం ముక్కలైంది. ఈ కష్ట కాలంలో జాంగ్ కుటుంబానికి తీవ్రమైన సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ఓ అద్భుతమైన ప్రతిభను ప్రపంచం కోల్పోయింది’’ అని ఎక్స్లో సింధు పోస్టు చేసింది. ఆదివారం రాత్రి జపాన్ ఆటగాడు కజుమాతో సింగిల్స్లో జాంగ్ తలపడ్డాడు. తొలి గేమ్లో స్కోరు 11-11తో ఉండగా అస్వస్థత కారణంగా జాంగ్ కోర్టులో కుప్పకూలాడు. వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందించి, అంబులెన్స్లో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన వేళ.. ఆ స్థానాన్ని భర్తీ చేసే ఇద్దరు ఎవరు? మీ మాట పోల్లో ఓటేసి చెప్పండి. -
సూర్య క్యాచ్ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ను భారత్ రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో చివరి ఓవర్లో అద్భుతమైన క్యాచ్తో సూర్య టీమ్ఇండియాకు కప్ను అందించాడు. -
కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
ఫామ్ కోల్పోయినప్పుడు ఆటగాడికి కెప్టెన్ నుంచి మద్దతు లభిస్తే.. తిరిగి పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో ధోనీ, రోహిత్ సక్సెస్ కావడం గమనార్హం. -
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
పదకొండేళ్లప్పుడు భారత్ ఓడిపోవడం చూసిన ఓ కుర్రాడు.. రెండు ప్రపంచ కప్లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్. -
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
వరల్డ్ కప్లో మ్యాచ్ ఆడేందుకు ప్రతి ఆటగాడూ ఉత్సాహం చూపిస్తాడు. ఇక పెద్ద జట్టుతో మ్యాచ్ అంటే సిద్ధంగా ఉంటారు. కానీ, బంగ్లాదేశ్ బౌలర్ మాత్రం అతి నిద్రతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. -
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. -
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
రోహిత్ వారసుడెవరు?
ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్.. మళ్లీ ఇప్పుడు భారత్ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్బై చెప్పాడు రోహిత్ శర్మ. -
అంతా కలలాగే..
టీ20 ప్రపంచకప్ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు. -
వింబుల్డన్ ఛాంపియన్కు చెక్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది. -
క్వార్టర్స్లో ఫ్రాన్స్
ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు యూరో 2024 క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. -
భారత జట్టులో సాయి, జితేష్
యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. -
పారిస్ ఒలింపిక్స్లో జ్యోతి!
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్ కోటాలో జ్యోతి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
మణిపుర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం
-
మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి చొరవ.. ఆందోళన విరమించిన అద్దె బస్సుల యజమానులు
-
ఏపీలో ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం
-
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
-
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి
-
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?