- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
వీళ్లకు వీడ్కోలు!
మునుపెన్నడూ లేని విధంగా అలరించిన టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఈ పొట్టి కప్తోనే టీ20ల్లో కొంతమంది ఆటగాళ్ల కెరీర్ కూడా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఫార్మాట్లో వీళ్లు 2026లో జరిగే తర్వాతి ప్రపంచకప్ ఆడటం అనుమానమే.
మునుపెన్నడూ లేని విధంగా అలరించిన టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఈ పొట్టి కప్తోనే టీ20ల్లో కొంతమంది ఆటగాళ్ల కెరీర్ కూడా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఫార్మాట్లో వీళ్లు 2026లో జరిగే తర్వాతి ప్రపంచకప్ ఆడటం అనుమానమే. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్.. టీ20లకూ వీడ్కోలు పలికాడు. కోహ్లి, రోహిత్ కూడా పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. చివరి ప్రపంచకప్ ఆడేశానని న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్ కూడా తెలిపాడు. నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. నిజానికి ఈ ప్రపంచకప్కు కోహ్లి, రోహిత్ ఎంపికపై మొదట సందేహాలు వ్యక్తమయ్యాయి. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత వీళ్లు భారత టీ20 జట్టుకు దూరంగా ఉండటమే కారణం. కానీ చివరిగా ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. మరోవైపు 37 ఏళ్ల షకిబుల్ హసన్ (బంగ్లాదేశ్), 36 ఏళ్ల రసెల్ (వెస్టిండీస్), 34 ఏళ్ల స్టార్క్ (ఆస్ట్రేలియా), 39 ఏళ్ల మహమ్మద్ నబి (అఫ్గానిస్థాన్), 37 ఏళ్ల మొయిన్ అలీ (ఇంగ్లాండ్) తదితర సీనియర్ ఆటగాళ్లు కూడా వచ్చే టీ20 ప్రపంచకప్లో ఆడటం సందేహంగా కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మాయిలూ చుట్టేశారు
భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి.. అనంతరం స్వల్ప ఛేదనను కొట్టేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమ్ఇండియాదే పైచేయి. -
అల్కరాస్ శుభారంభం
మూడో సీడ్ అల్కరాస్ వింబుల్డన్లో శుభారంభం చేశాడు. అయిదోసీడ్ మెద్వెదెవ్, ఎనిమిదో సీడ్ రూడ్ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తొమ్మిదో సీడ్ సకారి ముందంజ వేసింది. -
గుకేశ్ పోరు సింగపూర్లో
సొంతగడ్డపై డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్ ఆశలు ఫలించలేదు. -
ఆ ఒక్కటీ కొట్టండి
కోచ్గా ఇన్నింగ్స్ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. -
కోహ్లి లేకుండా ఐసీసీ ప్రపంచకప్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సత్తా చాటినప్పటికీ అంతకుముందు విఫలమవడంతో కోహ్లీని 12 మంది సభ్యుల జట్టుకు ఐసీసీ ఎంపిక చేయలేదు. -
ఆర్సీబీతోనే కార్తీక్.. కానీ కొత్తగా
వచ్చే ఏడాది ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్టుతో కలిసి దినేశ్ కార్తీక్ కనిపించనున్నాడు. అదేంటీ.. ఈ సీజన్ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు కదా. -
నా కెరీర్ ముగించాలనే కుట్ర
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లోని లోపాలు ఎత్తి చూపినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని, రెజ్లింగ్లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారని భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ఆరోపించాడు. -
క్వార్టర్స్లో ఇంగ్లాండ్, స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్తో ఇంగ్లాండ్ త్రుటిలో పరాజయం తప్పించుకుంది. -
శ్రీలంకతో సిరీస్లో కొత్త కోచ్ బాధ్యతలు
శ్రీలంకతో సిరీస్లో భారత జట్టు కొత్త చీఫ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ నెలలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తాడని చెప్పాడు. -
పారిస్ డైమైండ్ లీగ్ నుంచి నీరజ్ ఔట్
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్కు దూరమయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బందిపడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. -
కోర్టులోనే కుప్పకూలి..
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్ జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
‘లక్ష్య’ అథ్లెట్లకు గోపీచంద్ అభినందనలు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లను బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ గోపీచంద్ అభినందించారు.