మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు

జాతీయ అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది.

Published : 29 Jun 2024 03:03 IST

పంచకుల: జాతీయ అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. ఈ ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి 52.11 సెకన్లలో రేసు ముగించి మూడో స్థానంలో నిలిచింది. కిరణ్‌ పహాల్‌ (50.92 సెకన్లు, హరియాణా) పసిడి గెలిచింది. ఇప్పటికే మహిళల 4×400మీ. రిలే తరపున జ్యోతిక ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహిళల 1600 మీటర్ల రిలేలో ఆంధ్రప్రదేశ్‌ పసిడి నెగ్గడంలో ‘లక్ష్య’ అథ్లెట్లు మధుకావ్య రెడ్డి, రజిత కీలక పాత్ర పోషించారు. వీళ్లు రిలేలో స్వర్ణాన్ని అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని