జోరు కొనసాగిస్తారా!

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం సఫారీలతో ఆరంభమయ్యే ఏకైక టెస్టులోనూ అదరగొట్టాలని హర్మన్‌ప్రీత్‌ బృందం బరిలో దిగుతోంది.

Published : 28 Jun 2024 03:36 IST

నేటి నుంచే దక్షిణాఫ్రికాతో భారత్‌ ఏకైక టెస్టు
ఉ।। 9.30 నుంచి

చెన్నై: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం సఫారీలతో ఆరంభమయ్యే ఏకైక టెస్టులోనూ అదరగొట్టాలని హర్మన్‌ప్రీత్‌ బృందం బరిలో దిగుతోంది. చివరిగా స్వదేశంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు మ్యాచ్‌ ఆడి విజయాన్ని అందుకున్న భారత్‌.. మరో గెలుపుపై గురి పెట్టింది. వన్డే సిరీస్‌లో సెంచరీలతో అదరగొట్టిన స్మృతి మంధానాపైనే జట్టు ఆధారపడనుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, దీప్తిశర్మ కీలకం కానున్నారు. దక్షిణాఫ్రికాతో చివరిగా 2014లో టెస్టు మ్యాచ్‌ ఆడిన టీమ్‌ఇండియా.. ఇన్నింగ్స్‌ 34 పరుగుల తేడాతో గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని