- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 World Cup: రేపు సెమీఫైనల్స్
టీ20 ప్రపంచకప్లో సూపర్-8 అంకం ముగిసింది. ఎక్కువ విరామం లేకుండానే సెమీఫైనల్స్కు రంగం సిద్ధమైంది. గురువారం ఒక్క రోజులోనే రెండు సెమీస్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి.
టీ20 ప్రపంచకప్లో సూపర్-8 అంకం ముగిసింది. ఎక్కువ విరామం లేకుండానే సెమీఫైనల్స్కు రంగం సిద్ధమైంది. గురువారం ఒక్క రోజులోనే రెండు సెమీస్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్లో ఇంగ్లాండ్ను భారత్ ఢీకొనబోతుండగా, ఉదయం 6 గంటల నుంచి తొలి సెమీస్లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఢీకొనబోతున్నాయి. సంచలన ప్రదర్శనతో సెమీస్ చేరిన అఫ్గాన్.. ఈసారి స్థాయికి తగ్గ ఆటతీరుతో ముందంజ వేసిన సఫారీ జట్టును ఎలా ఎదుర్కొంటుంది, ఈ మ్యాచ్లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. బలాబలాల్లో దక్షిణాఫ్రికాదే పైచేయి అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గాన్ను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఈ పోరు హోరాహోరీగానే సాగుతుందని అంచనా. రెండు జట్లలో ఏది గెలిచినా తొలిసారి ఫైనల్ చేరుతుంది.
9
టీ20ల్లో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టిన సందర్భాలు. ఈ ఫార్మాట్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించిన బౌలర్ అతడే.
442
ఈ టీ20 ప్రపంచకప్లో అఫ్గాన్ బ్యాటర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ల భాగస్వామ్యం. ఒక టీ20 ప్రపంచకప్లో ఓ జోడీ భాగస్వామ్యంలో సాధించిన అత్యధిక పరుగులివే.
డక్వర్త్ కన్నుమూత
దిల్లీ: ఇంగ్లాండ్ గణాంక నిపుణుడు, డక్వర్త్- లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి ఆవిష్కర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్వర్త్ (84) కన్నుమూశారు. ఈనెల 21న డక్వర్త్ మరణించారు. వర్ష ప్రభావిత మ్యాచ్లలో ఫలితాలు నిర్ణయించడానికి డక్వర్త్, టోనీ లూయిస్ కలిసి డీఎల్ఎస్ పద్ధతిని రూపొందించారు. 1997లో తొలిసారిగా ఈ పద్ధతిని ఉపయోగించారు. అనంతరం లక్ష్యాల్ని నిర్దేశించడానికి 2001లో ఈ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది. ఆస్ట్రేలియా గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని సవరణలు చేసిన అనంతరం ఈ పద్ధతికి డీఎల్ఎస్గా నామకరణం చేశారు.
శ్రీజ @ 24
దిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కెరీర్ ఉత్తమ స్థానం సాధించింది. సోమవారం ప్రకటించిన జాబితాలో మహిళల సింగిల్స్లో శ్రీజ 24వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఆదివారం లాగోస్లో ప్రపంచ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో సింగిల్స్లో విజేతగా నిలిచిన శ్రీజ ర్యాంకింగ్లో 19 స్థానాలు మెరుగుపరుచుకుంది. మనిక బాత్రా 29వ ర్యాంకులో నిలిచింది. లాగోస్లో సింగిల్స్తో పాటు డబుల్స్ గెలుచుకున్న శ్రీజ.. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
జులై 19న భారత్, పాక్ పోరు
దిల్లీ: మహిళల టీ20 ఆసియా కప్ ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. జులై 19న శ్రీలంకలోని దంబుల్లాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. జలై 28 వరకు జరిగే ఈ టోర్నీలో 8 జట్లు బరిలో దిగనున్నాయి. గ్రూపు-ఎలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్.. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్లాండ్, మలేసియా ఉన్నాయి. ప్రతి గ్రూపు నుంచి రెండేసి జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. పాక్తో మ్యాచ్ తర్వాత జులై 21న యూఏఈ, 23న నేపాల్తో భారత్ తలపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. -
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
రెండోసారి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకొనే అద్భుతమైన అవకాశం టీమ్ఇండియాకు వచ్చింది. దక్షిణాఫ్రికాతో కీలక పోరు జరగనుంది. -
మ్యాచ్ను ‘బ్రాడ్కాస్టింగ్’ గెలిపించదు కదా..: మైకెల్ వాన్కు గంగూలీ కౌంటర్
టీ20 ప్రపంచ కప్లో భారత్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తట్టుకోలేకపోతున్నాడు. టీమ్ఇండియా విజయాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానికి మాజీ క్రికెటర్లు గట్టిగా బదులిచ్చారు. -
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
టీమ్ఇండియా సారథి రోహిత్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రా నుంచి మాజీ క్రికెటర్ల వరకు రోహిత్ నాయకత్వం గురించి ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
టైటిల్ను దక్కించుకోవాలని రెండు జట్లు సిద్ధం.. కానీ, వరుణుడు కూడా ఆడేస్తానంటూ పలకరింపులు.. ఇప్పుడు బార్బడోస్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. -
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
రాహుల్ ద్రవిడ్ కోసం కప్ గెలవాలనే ట్రెండింగ్పై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
టెస్టు క్రికెట్లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్ యాప్’ మాయలో సివిల్స్ అభ్యర్థి
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్