- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Gautam Gambhir: అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
పదకొండేళ్లప్పుడు భారత్ ఓడిపోవడం చూసిన ఓ కుర్రాడు.. రెండు ప్రపంచ కప్లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్-1992లో (ODI World Cup) భారత్ లీగ్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ దశలో ఆసీస్తో మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు తేడాతో టీమ్ఇండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్ జరిగిన రాత్రి తనకు నిద్ర పట్టలేదని.. భారత్ కోసం ప్రపంచకప్ నెగ్గాలని ప్రతిజ్ఞ చేసినట్లు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తన వయసు కేవలం 11 ఏళ్లు మాత్రమేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. టీమ్ ఇండియాకు ప్రధాన కోచ్గా గంభీర్ (Gautam Gambhir) దాదాపు ఖాయమైనట్లేనని వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
‘‘ఒక మ్యాచ్ చూసిన తర్వాత.. భారత్కు వరల్డ్ కప్ అందించాలనే బలమైన ఆకాంక్ష కలిగింది. బ్రిస్బేన్ వేదికగా 1992 వరల్డ్ కప్లో (ODI World Cup) ఆసీస్తో భారత్ మ్యాచ్ ఆడింది. చివరివరకూ పోరాడినప్పటికీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయా. అంతకుముందు కానీ.. ఆ తర్వాత కానీ ఎప్పుడూ అలా బాధపడిన సందర్భాలు లేవు. ఆరోజు మాత్రం ఎందుకు అలా ఏడ్చానో తెలియదు. నాకు అప్పుడు 11 ఏళ్లు మాత్రమే. నేను భారత్ కోసం వరల్డ్ కప్ నెగ్గుతానని అనుకున్నా. నా కల 2011లో నెరవేరింది. 32 ఏళ్ల కిందట (1992) జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో వెంకటపతిరాజు రనౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్ మన సమయం ప్రకారం వేకువజామునే జరిగింది. నేను పొద్దున్నే ఐదు గంటలకు నిద్ర లేచి చూశా’’ అని గంభీర్ తెలిపాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 237/9 స్కోరు చేసింది. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని డక్వర్త్లూయిస్ పద్ధతి ప్రకారం టార్గెట్ను 47 ఓవర్లకు 235 పరుగులుగా నిర్దేశించారు. భారత్ సరిగ్గా 234 పరుగులు చేసి ఓడింది.
గంభీర్ అనుకున్నట్లుగానే రెండు ప్రపంచకప్లను భారత్ (Team India) నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇక 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధోనీ (MS Dhoni) నాయకత్వంలో టీమ్ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ను సగర్వంగా అందుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలో పొట్టికప్ను (T20 World Cup 2024) భారత్ సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!
చివరిసారిగా 1991-92 సీజన్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. ఆ తర్వాత నాలుగు లేదా మూడు టెస్టుల్లోనే తలపడుతూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో ఢీకొట్టుకోనున్నాయి. -
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి. -
‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
ఇటీవల టీమ్ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్ అనుభవించారు. -
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. -
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం
-
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
-
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
-
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
-
మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం