- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Anand Mahindra - Team India: ‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తనను ఆకర్షించిన విషయాలను తరచుగా సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటుంటారు. వాటికి విభిన్నమైన కామెంట్లు పెడుతుంటారు. ఆయన తాజాగా భారత క్రికెట్ జట్టు, అభిమానులను ఉద్దేశిస్తూ ‘అభిమానుల కౌగిలి’ అంటూ ఓ పోస్ట్ చేశారు.
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) గెలుచుకున్న అనంతరం స్వదేశానికి చేరుకున్న భారత జట్టు (Team India)కు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముంబయి (Mumbai) మెరైన్డ్రైవ్లో ఓపెన్ బస్సులో భారత జట్టు విజయయాత్ర నిర్వహించారు. వేలాది మంది క్రికెట్ అభిమానులు, ప్రజలు వెంటరాగా విజయోత్సవ ర్యాలీ సందడిగా సాగింది. ఈ యాత్ర సాగిన రోడ్డు జన సంద్రాన్ని తలపించింది.
ఈ దృశ్యాలను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘ముంబయిలోని ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకు క్వీన్ నెక్లెస్ రోడ్గా పిలిచేవారు. ఇకపై ఇది ‘ముంబయి అభిమానుల కౌగిలి’గా మారిపోయింది’’ అని రాసుకొచ్చారు. మహీంద్రా పోస్టుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ పోస్ట్కు భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందిస్తూ ‘ఏం చెప్పారు సర్..సూపర్’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు.. బార్బడోస్లో తుపాను కారణంగా అయిదు రోజులు అక్కడే నిలిచిపోయింది. బుధవారం ప్రత్యేక విమానంలో బయల్దేరి స్వదేశానికి వచ్చింది. గురువారం ఉదయం 6 గంటలకు దిల్లీలోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకున్న జట్టు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో కలసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ ర్యాలీ ఆరంభం కావాల్సి ఉండగా.. రా.7.30కు షురూ అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్కు ‘భారతరత్న’ ఇవ్వడమే సముచితం: సునీల్ గావస్కర్
భారత్ టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలో రోహిత్తోపాటు జట్టులోని సభ్యులు ఎంత కష్టపడ్డారో.. కోచ్గా రాహుల్ ద్రవిడ్ శ్రమ కూడా అంతే కీలకం. -
భారత కోచ్గా గంభీర్! ఈడెన్ గార్డెన్స్లో ఫేర్వెల్ వీడియో షూట్
టీమ్ ఇండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో ఆ రేసులో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ముందున్నట్లు తెలుస్తోంది. -
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
ఇటీవల టీమ్ఇండియాతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
భారత జెర్సీని ధరించే అవకాశం వస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. అయితే, యువ క్రికెటర్ నితీశ్కు పిలుపు వచ్చినా.. గాయం కారణంగా జింబాబ్వే సిరీస్కు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న రెండో టీ20 ప్రపంచ కప్ను రోహిత్ శర్మ అందించాడు. వచ్చే ఏడాది మరో రెండు కీలక లక్ష్యాలు హిట్మ్యాన్ ముంగిట ఉన్నాయి. -
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
టెన్నిస్ క్రీడాకారుల ఆన్లైన్ ప్రైవసీని కాపాడేందుకు వింబుల్డన్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘ఏఐ’ని పరిచయం చేశారు. -
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల్లో ఏకంగా 2 కోట్ల లైక్స్ను సొంతం చేసుకొంది. -
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు వేడుకను భార్య సాక్షి, మిత్రులతో కలిసి చేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. -
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా రిషభ్ పంత్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. -
యువ భారత్ బోల్తా
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది. -
పోర్చుగల్ షూటౌట్
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్షిప్ను ఓటమితో ముగించాడు. -
రజావత్ సంచలనం
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలన విజయం సాధించాడు. -
ఇంగ్లాండ్ గట్టెక్కింది
ఫుట్బాల్లో స్విట్జర్లాండ్తో పోరంటే ఇంగ్లాండ్ను ఫేవరెట్గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్షిప్ గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్లో ఆ జట్టు ఫేవరెట్గానే బరిలోకి దిగింది. -
స్వైటెక్కు షాక్
వింబుల్డన్లో పెద్ద సంచలనం! టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్సీడ్కు కజకిస్థాన్ అన్సీడెడ్ ప్లేయర్ యూలియా పుటిన్సెవా చెక్ పెట్టింది. -
నేను ఆ తరహా కాదు
టీమ్ఇండియా కోచ్గా తాను కెప్టెన్ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. -
వినేశ్కు స్వర్ణం
గ్రాండ్ప్రి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి: పేరెంట్స్కు సాయి తేజ్ విజ్ఞప్తి
-
ద్రవిడ్కు ‘భారతరత్న’ ఇవ్వడమే సముచితం: సునీల్ గావస్కర్
-
రిసార్టులో 49 మంది.. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదనీరు..
-
మధుమేహం ఉందా? కిళ్లీ వద్దంటే వద్దు!
-
ఆ ‘లోన్ యాప్’తో జాగ్రత్త.. ప్రభుత్వం హెచ్చరిక
-
మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్